India: జనాభాలో ఇక ఇండియా ఫస్ట్ ప్లేస్.. చైనాను మించినట్లు అంచనా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India has surpassed China to become the most populous country in the world, as per estimates: ప్రపంచంలో అధిక జనాభా కలిగిన దేశం అంటే నిన్నమొన్నటి వరకు చైనా అని అంతా సమాధానం చెప్పేవారు. రెండో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారతదేశం ఉండేది. ఇప్పుడు ఇక ఈ సమాధానం మారబోతోంది. జనాభాలో చైనాను ఇప్పటికే భారత్ దాటేసిందని ఓ అంచనా. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ మారిందని అంచానా వేస్తున్నారు. వరల్డ్ పాపులేషన్ రివ్యూ(డబ్ల్యూపీఆర్) అంచానా ప్రకారం భారతదేశం జనాభాలో చైనాను అధిగమించినట్లు తెలిపింది.
వరల్డ్ పాపులేషన్ రివ్యూ అంచానా ప్రకారం.. 2022 చివరి నాటికి భారత జనాభా 141.7 కోట్లు. ఇది జనవరి 17న చైనా ప్రకటించిన జనాభా 141.2 కోట్లతో పోలిస్తే 50 లక్షలు. ఎక్కువ 1960 తరువాత మొదటిసారిగి చైనాలో జనాభా తగ్గుతోందని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. దీన్ని బట్టి చూస్తే ఈ ఏడాది జనవరి నెలలో భారత్, చైనాను అధిగమించిందని అంచానా వేస్తున్నారు.
Also Read
- Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
- Sonam Wangchuk: దీక్ష భగ్నం.. సోనమ్ వాంగ్చుక్ను ఆసుపత్రికి తరలింపు..
- LoC Ceasefire: ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి.. ఎల్వోసీ వెంబడి భారీ కాల్పులు..
- Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
Read Also: Kishan Reddy: బీఆర్ఎస్ కలల పార్టీ.. ఢిల్లీకి పోతానని కేసీఆర్ పగటి కలలు కంటున్నారు
భారతదేశంలో 50 శాతం జనాబా 30 ఏళ్లలోపు వారే ఉన్నారు. యువశక్తి భారతదేశానికి ప్రయోజనం. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో భారత్ మొదటిస్థానంలో ఉంది. వరల్డ్ పాపులేషన్ రివ్యూ ప్రకారం, జనవరి 18 నాటికి భారత జనాభా 142.3 కోట్లకు పెరిగిందని ఓ అంచానా. భారతదేశ జనాభా పెరుగుదల మందగించినప్పటికీ, జనాభా 2050 నాటికి ఇలా పెరుగుతూనే ఉంటుందని తెలిపింది. ఇదిలా ఉంటే రీసెర్చ్ ప్లాట్ఫారమ్ మాక్రోట్రెండ్స్ భారత జనాబా 142.8 కోట్లకు చేరిందని అంచానా వేసింది. 2021లో మహమ్మారి కారణంగా ప్రతీ పదేళ్లకు ఒకసారి జరిపే జనాభా లెక్కింపులను నిలిపివేశారు.
భారత్ అత్యధిక వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఆసియాలో మూడో పెద్ద ఆర్థిక వ్యవస్థ, ప్రపంచంలో 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థ. బియ్యం, గోధుమలు, చక్కెర ఉత్పత్తిలో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. నూనెల దిగుమతిదారుగా మొదటిస్థానంలో ఉండగా.. చక్కెర అతిపెద్ద వినియోగదారుగా ఉంది. ముడిచమురు కొనుగోలులో భారత్ మూడవ అతిపెద్ద మార్కెట్. ఉక్కు, బంగారం యొక్క అతిపెద్ద రెండో వినియోగదారు, భారత్ మూడో అతిపెద్ద దేశీయ విమాన మార్కెట్ ను కలిగి ఉంది.
తాజావార్తలు
-
IND vs ENG 3rd ODI: లార్డ్స్లో భారత్తో చివరి వన్డే.. ఇద్దరు ఇంగ్లండ్ ప్లేయర్స్ అవుట్!
-
Aditya Dhar: ‘ధురందర్’ తర్వాత ఆదిత్య ధర్కు మరో భారీ ఛాన్స్.. అస్సాం వీరుడి జీవితకథపై సినిమా?
-
Boss Scam: వాట్సాప్, ఏఐ వాయిస్తో మోసం.. ‘బాస్ స్కామ్’పై సెబీ హెచ్చరిక..
-
Anna Lezhneva: అప్పుడు కొడుకు కోసం.. ఇప్పుడు భర్త కోసం.! కాలినడకన తిరుమల కొండెక్కిన డిప్యూటీ సీఎం భార్య.!
-
Vikram-1: విక్రమ్-1 రాకెట్లో అంతరిక్షంలోకి ప్రధాని మోడీ చేతిరాత పోస్ట్కార్డ్.. చరిత్ర సృష్టించనున్న మిషన్ ఆగమన్
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!