India: జనాభాలో ఇక ఇండియా ఫస్ట్ ప్లేస్.. చైనాను మించినట్లు అంచనా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India has surpassed China to become the most populous country in the world, as per estimates: ప్రపంచంలో అధిక జనాభా కలిగిన దేశం అంటే నిన్నమొన్నటి వరకు చైనా అని అంతా సమాధానం చెప్పేవారు. రెండో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారతదేశం ఉండేది. ఇప్పుడు ఇక ఈ సమాధానం మారబోతోంది. జనాభాలో చైనాను ఇప్పటికే భారత్ దాటేసిందని ఓ అంచనా. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ మారిందని అంచానా వేస్తున్నారు. వరల్డ్ పాపులేషన్ రివ్యూ(డబ్ల్యూపీఆర్) అంచానా ప్రకారం భారతదేశం జనాభాలో చైనాను అధిగమించినట్లు తెలిపింది.
వరల్డ్ పాపులేషన్ రివ్యూ అంచానా ప్రకారం.. 2022 చివరి నాటికి భారత జనాభా 141.7 కోట్లు. ఇది జనవరి 17న చైనా ప్రకటించిన జనాభా 141.2 కోట్లతో పోలిస్తే 50 లక్షలు. ఎక్కువ 1960 తరువాత మొదటిసారిగి చైనాలో జనాభా తగ్గుతోందని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. దీన్ని బట్టి చూస్తే ఈ ఏడాది జనవరి నెలలో భారత్, చైనాను అధిగమించిందని అంచానా వేస్తున్నారు.
Also Read
- Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
- BRICS Summit 2026: పుతిన్-మోడీ-జిన్పింగ్.. ప్రపంచం చూపంతా ఢిల్లీ వైపే!
- Maharashtra: నాందేడ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు-టాటా మ్యాజిక్ ఢీ.. 9 మంది మృతి
- IndiGo Flight: టిష్యూ పేపర్పై ‘బాంబు’ బెదిరింపు.. అహ్మదాబాద్లో ఇండిగో ఎమర్జెన్సీ ల్యాండింగ్
Read Also: Kishan Reddy: బీఆర్ఎస్ కలల పార్టీ.. ఢిల్లీకి పోతానని కేసీఆర్ పగటి కలలు కంటున్నారు
భారతదేశంలో 50 శాతం జనాబా 30 ఏళ్లలోపు వారే ఉన్నారు. యువశక్తి భారతదేశానికి ప్రయోజనం. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో భారత్ మొదటిస్థానంలో ఉంది. వరల్డ్ పాపులేషన్ రివ్యూ ప్రకారం, జనవరి 18 నాటికి భారత జనాభా 142.3 కోట్లకు పెరిగిందని ఓ అంచానా. భారతదేశ జనాభా పెరుగుదల మందగించినప్పటికీ, జనాభా 2050 నాటికి ఇలా పెరుగుతూనే ఉంటుందని తెలిపింది. ఇదిలా ఉంటే రీసెర్చ్ ప్లాట్ఫారమ్ మాక్రోట్రెండ్స్ భారత జనాబా 142.8 కోట్లకు చేరిందని అంచానా వేసింది. 2021లో మహమ్మారి కారణంగా ప్రతీ పదేళ్లకు ఒకసారి జరిపే జనాభా లెక్కింపులను నిలిపివేశారు.
భారత్ అత్యధిక వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఆసియాలో మూడో పెద్ద ఆర్థిక వ్యవస్థ, ప్రపంచంలో 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థ. బియ్యం, గోధుమలు, చక్కెర ఉత్పత్తిలో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. నూనెల దిగుమతిదారుగా మొదటిస్థానంలో ఉండగా.. చక్కెర అతిపెద్ద వినియోగదారుగా ఉంది. ముడిచమురు కొనుగోలులో భారత్ మూడవ అతిపెద్ద మార్కెట్. ఉక్కు, బంగారం యొక్క అతిపెద్ద రెండో వినియోగదారు, భారత్ మూడో అతిపెద్ద దేశీయ విమాన మార్కెట్ ను కలిగి ఉంది.
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?