Meta: ఆల్గోరిథం మార్చాల్సిందే.. మెటాకు నట్లు బిగిస్తున్న భారత్..
- ఆల్గోరిథం మార్చాల్సిందే, డీప్ఫేక్, తప్పుడు ప్రచారం అరికట్టాల్సిందే..
- మెటాకు కేంద్రం అల్టిమేటం..
- ప్రాపంగండా కంటెంట్ అడ్డుకట్ట వేయాలని ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Meta: కేంద్ర ప్రభుత్వం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మాతృసంస్థ మెటా నట్లు బిగించే పని చేస్తోంది. సోషల్ మీడియా వేదికలపై డీప్ఫేక్ వీడియోలు, తప్పుడు ప్రచారం, అక్రమ కంటెంట్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం మెటాకు కీలక ఆదేశాలు జారీ చేసింది. కంటెంట్ నియంత్రణను మరింత బలోపేతం చేయడానికి చేపట్టనున్న చర్యలపై సమగ్ర కంప్లయెన్స్ రోడ్మ్యాప్ను సమర్పించాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ (MeitY) మెటాను కోరింది. ప్రభుత్వం ఉన్నతాధికారులు, మెటా ప్రతినిదులకు మధ్య జరిగిన సమావేశంలో కంపెనీ ప్రస్తుత కంటెంట్ మోడరేషన్ వ్యవస్థ, హానికర కంటెంట్ను నియంత్రించేందుకు తీసుకున్న చర్యలపై చర్చించారు.
ప్రాపంగండా కంటెంట్, డీప్ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ చేసిన ఇమేజెస్, చట్టవిరుద్ధం కంటెంట్ వ్యాప్తిని తగ్గించేలా ఆల్గోరిథంలో మార్పులు చేయాలని ప్రభుత్వం మెటాకు సూచించింది. భారత డేటా లోకలైజేషన్ నిబంధనల్ని తప్పనిసరిగా పాటించాలని, దీని అర్థం భారత యూజర్ల డేటాను భారత్ లోని సర్వర్లలో నిల్వ చేయడం లేదా దాని కాపీని భారత్లో ఉండచం చేయాలని ఆదేశించింది. ఇదే సమయంలో ప్రభుత్వ అధికార సంస్థల గురించి అభ్యంతరకర కంటెంట్ను వేగంగా తొలగించాలని ఆదేశించింది. వివిధ ప్రభుత్వ శాఖల క్విక్ రెస్పాన్స్ టీమ్ల (QRTs)తో మెటా నేరుగా సమన్వయం చేసుకోవాలని కేంద్రం సూచించింది. డీప్ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ చిత్రాలు, ఫేక్ కంటెంట్ ను వేగంగా గుర్తించి తొలగించేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందని తెలిపింది.
Also Read
- Sheikh Hasina: షేక్ హసీనా వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు.. బంగ్లాదేశ్కు స్పష్టం చేసిన భారత్..
- Modi-Shinde: ప్రధాని మోడీతో ఏక్నాథ్ షిండే భేటీ.. సరికొత్త ఊహాగానాలు
- Kochi Flight: గాల్లో ఉండగా ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు యత్నం.. హడలెత్తిపోయిన ప్రయాణికులు
- Jantar Mantar: జంతర్ మంతర్లో నిరసనలు అవసరమా? ఢిల్లీ హైకోర్టు ప్రశ్న
ఇదిలా ఉంటే, ఇటీవల జరిగిన సమావేశంలో మెటా తన ఆల్గోరిథంలో లోపాలు ఉన్నట్లు అంగీకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు బాధ్యతను మరింత పెంచడంతో పాటు భారత చట్టాలకు అనుగుణంగా వ్యవహరించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏఐ సాయంతో రూపొందిస్తున్న తప్పుడు కంటెంట్ను ముందుగా గుర్తించి అడ్డుకునే టెక్నాలజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కేంద్రం సూచించింది.
తాజావార్తలు
-
Meta: ఆల్గోరిథం మార్చాల్సిందే.. మెటాకు నట్లు బిగిస్తున్న భారత్..
-
Cricket Player: బోర్డును బురిడీ కొట్టించాలనుకున్నాడు.. చివరికి కెరీర్ క్లోజ్..
-
Ind Vs SL: ఊహించని రీతిలో రెచ్చిపోయిన శ్రీలంక బ్యాటర్స్.. చేతులెత్తేసిన టీమిండియా ఆటగాళ్లు..
-
Jupally Krishna Rao: ‘రాష్ట్రంలో నీటి కటకట ఉంది.. అంతటా ఎల్నినో ప్రభావం’..
-
Sheikh Hasina: షేక్ హసీనా వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు.. బంగ్లాదేశ్కు స్పష్టం చేసిన భారత్..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!