COP28 Dubai: ప్రపంచ జనాభాలో 17 శాతం ఉన్నా.. కర్భన ఉద్గారాల్లో 4 శాతమే.. ప్రధాని వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
COP28 Dubai: యూఏఈ దుబాయ్ వేదికగా COP28 సదస్సు జరుగుతోంది. ఈ సమావేశాలకు ప్రధాని నరేంద్రమోడీ కూడా హాజరయ్యారు. ప్రపంచ ఉద్గారాలను తగ్గించడానికి అన్ని దేశాలు కలిసి పనిచేయాలని ప్రధాని మోడీ ప్రపంచదేశాలకు పిలుపునిచ్చారు. ప్రజల సహకారంతో కార్బన్ స్కిన్లను రూపొందించడంపై దృష్టి సారిచే ‘‘గ్రీన్ క్రెడిట్’’ స్కీమును ఆయన ప్రకటించారు.
జనాభా తక్కువగా ఉన్న చాలా దేశాలతో పోలిస్తే, ఇండియాలో కర్బన ఉద్గారాల విడుదల చాలా తక్కువగా ఉందని చెప్పారు. ప్రపంచ జనాభాలో భారత్లో 17 శాతం ఉంటే.. కర్బన్ ఉద్గారాల్లో 4 శాతం మాత్రమే ఉందని, ఎన్డీసీ లక్ష్యాలను సాధించడంలో మేము వేగవంతంగా పనిచేస్తున్నామని ప్రధాని అన్నారు. మా నాన్-ఫాజిల్ ప్యూయల్ లక్ష్యాలను డెడ్లైన్ కన్నా తొమ్మిదేళ్ల ముందే చేరుకున్నామన్నారు. 2070 నాటికి శిలాజేతర ఇంధన లక్ష్యాలను భారత్ నెట్ జిరోకి చేరుతుందని ఆయన వెల్లడించారు. గత శతాబ్ధపు తప్పులను సరిదిద్దడానికి మనకు ఎక్కువ సమయం లేదని, ప్రతీ దేశం కూడా నేషనల్లీ డిటర్మైంట్ కాంట్రిబ్యూషన్(NDC) లక్ష్యాలకు అనుగుణంగా చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు.
Also Read
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
- Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
Read Also: Serial killer: 6 నెలల్లో 9 మంది మహిళల హత్య.. సీరియల్ కిల్లర్ కోసం గాలింపు..
భారతదేశం ప్రపంచానికి అభివృద్ధి నమూనాను అందించిందని, ఎకాలజీ-ఎకనామి మధ్య సమతుల్యతను కలిగి ఉందని అన్నారు. 2030 నాటికి ఉద్గార తీవ్రతను 45% తగ్గించి, శిలాజ యేతర ఇంధనాల వాటాను 50%కి పెంచాలని భారత్ లక్ష్యాలను నిర్దేశించుకుందని, హైడ్రోజన్ ఫ్యూయల్, బయో ఫ్యూయల్ పొత్తుల ద్వారా భారత్ ప్రత్యామ్నాయ ఇంధనం కోసం ముందుకు వచ్చిందని తెలిపారు. మనం మాత్రమే ప్రయోజనం పొందాలనే దృక్ఫథం ప్రపంచాన్ని అంధకారంలోకి నెట్టేస్తుందని, అన్ని దేశాలు కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు. 2028లో COP28 సదస్సు ఇండియాలో జరగనుంది.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..