Operation Sindoor: ఉగ్రవాదానికి పాకిస్థాన్ అండగా నిలిచింది.. భారత్ డీజీఎంవో వెల్లడి
- ఉగ్రవాదానికి పాకిస్థాన్ అండగా నిలిచింది
- భారత్ డీజీఎంవో వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉగ్రవాదానికి పాకిస్థాన్ అండగా నిలిచిందని భారత్ డీజీఎంవో పేర్కొంది. ఆపరేషన్ సిందూర్పై జాయింట్ మిలటరీ ప్రెస్మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా త్రివిధ దళాల అధిపతులు మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాదులు, వారికి సాయం చేసే వారే లక్ష్యంగా ఆపరేషన్ సిందూర్ జరిగిందని పేర్కొన్నారు. కానీ పాకిస్థాన్ మాత్రం తమపై భారత్ దాడి చేస్తోందని భావించిందన్నారు. మన పోరాటం ఉగ్రవాదులపైనే అని తెలిపారు. పాకిస్థాన్ వివిధ రకాల డ్రోన్లు ప్రయోగించిందని భారత్ డీజీఎంవో స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: PM Modi: రాత్రి 8 గంటలకు మోడీ ప్రెస్మీట్.. సర్వత్రా ఉత్కంఠ
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- IMD Rain Alert: దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
- India At UN: పాక్కు భారత్ షాక్.. కాశ్మీర్ రాగం పాడితే ఇదే సమాధానం!
ఉగ్రవాదులు కొన్నేళ్లుగా వ్యూహాలు మార్చుకుంటున్నారని.. సైనికులనే కాకుండా, యాత్రికులను, భక్తులను టార్గెట్ చేసుకుంటున్నారని చెప్పారు. మే 9, 10 తేదీల్లో పాకిస్థాన్ మన వైమానికి స్థావరాలను చాలా టార్గెట్ చేసిందని.. కానీ మన డిఫెన్స్ వ్యవస్థతో వాటిని అడ్డుకున్నట్లు చెప్పుకొచ్చారు. మల్టీ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను దాటుకొని పాకిస్థాన్ మన వైమానికి స్థావరాలను ధ్వంసం చేయలేకపోయిందని.. వివిధ రకాల ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థతో మనం పాకిస్థాన్ను అడ్డుకున్నట్లు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Ram Charan : చరణ్ మైనపు విగ్రహంతో చిరంజీవి ఫ్యామిలీ..
‘‘పాకిస్తాన్ వివిధ రకాల డ్రోన్లను వినియోగించింది. దేశీయంగా తయారు చేసిన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థతో మనం వాటిని అడ్డుకున్నాం.. ఆకాశ్ డిఫెన్స్ వ్యవస్థతో శత్రువులను దీటుగా ఎదుర్కొన్నాం. చైనా తయారు చేసిన పీఎల్-15 మిస్సైళ్లతో పాక్ దాడి చేసింది. వాటిని మనం ఆకాశ్ క్షిపణులతో నిర్వీర్యం చేశాం. పాక్లోని నూర్ఖాన్ ఎయిర్బేస్పై ఇండియన్ ఎయిర్ఫోర్స్ దాడి చేసింది. నూర్ఖాన్ ఎయిర్బేస్ రన్వేకు తీవ్రనష్టం జరిగింది.’’ అని డీజీఎంవో ఎయిర్ మార్షల్ ఏకే భారతి పేర్కొన్నారు.
‘‘దేశ ప్రజలంతా మాకు అండగా నిలిచారు. శత్రువుల విమానాలను మన దేశంలోకి రాకుండా అడ్డుకున్నాం. మన అన్ని సైనిక స్థావరాలు సిద్ధంగా ఉన్నాయి. ఎలాంటి ఆపరేషన్కు అయినా మేం సన్నద్ధంగా ఉన్నాం. పాక్కు జరిగిన డ్యామేజీ ఆ దేశం చెప్పుకోవడం లేదు.’’ అని డీజీఎంవో ఎయిర్ మార్షల్ ఏకే భారతి వెల్లడించారు.
आकाशे शत्रुन् जहि I
Destroy the Enemy in the Sky.#PahalgamTerrorAttack #OperationSindoor#JusticeServed #IndianArmy@IAF_MCC @indiannavy pic.twitter.com/vO28RS0IdE
— ADG PI – INDIAN ARMY (@adgpi) May 12, 2025

తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!