COVID 19: కాస్త తగ్గిన కరోనా కేసులు.. అయినా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్లో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పంజా విసురుతున్నాయి.. వందలకు పరిమితమైన కేసులు.. ఇప్పుడు వేలను దాటేస్తున్నాయి.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 8,084 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,32,30,101కు చేరింది.. ఇప్పటి వరకు కోవిడ్ బారినపడి 4,26,57,335 మంది బాధితులు పూర్తిస్థాయిలో కోలుకోగా.. మహమ్మారి బారినపడి ఇప్పటికే 5,24,771 మంది ప్రాణాలు వదిలారు.. యాక్టివ్ కేసుల సంఖ్య 50 వేలవైపు పరుగులు పెడుతోంది.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 47,995 కేసులు యాక్టివ్గా ఉన్నట్టు బులెటిన్లో పేర్కొంది సర్కార్.
Read Also: Airtel: గుడ్న్యూస్ చెప్పిన ఎయిర్టెల్..
Also Read
ఇక, కోవిడ్ బారినపడి గత 24 గంటల్లో 10 మంది మృతిచెందగా.. 4,592 మంది బాధితులు కోలుకున్నారు.. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 2,946, కేరళలో 4,319, ఢిల్లీలో 735, కర్ణాటకలో 463, హర్యానాలో 304 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. యాక్టివ్ కేసులు 0.11 శాతానికి చేరగా.. రికవరీ రేటు 98.68 శాతానికి, మరణాల శాతం 1.21కి చేరింది.. కాగా, మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండడంతో ఆయా రాష్ట్రాలు అప్రమత్తం అవుతున్నాయి.
- Tags
- corona
- COVID 19 Update
- india
తాజావార్తలు
-
BRICS: ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోడీ భేటీ.. వారాల వ్యవధిలో రెండోసారి..
-
The Paradise: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి నాని ‘ది ప్యారడైజ్’!
-
BRICS: బ్రిక్స్ ఎలా ఏర్పడింది? బ్యాగ్రౌండ్ ఇదే!
-
Bans Non Dairy Paneer: తెలంగాణలో పనీర్కు బిగ్ షాక్.. ఏడాది బ్యాన్
-
AP Employees: ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?