Corona Cases: దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు నిన్నటితో పోల్చితే కాస్త తగ్గాయి. శుక్రవారం 13,272 కేసులు నమోదు కాగా.. గడిచిన 24గంటల్లో 11,539 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. మరోవైపు తాజాగా 43 మంది కరోనా బారినపడి చనిపోయారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.59 శాతానికి చేరింది. యాక్టివ్ కేసులు 0.23 శాతం ఉన్నాయి. శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు దేశంలో 3,07,680 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు.
Gujarat: గుజరాత్ మంత్రివర్గంలో భారీ మార్పు.. వారిని ఆ శాఖల నుంచి తొలగింపు
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 5,27,332 మంది కరోనాతో మృతి చెందినట్లు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 99,879 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం ఇప్పటివరకు దేశంలో 4,43,39,429 మంది కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కరోనా బారి నుంచి 4,37,12,218 మంది కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో భారత్లో 26,58,755 మందికి కరోనా వ్యాక్సిన్లు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 209.67 కోట్లు దాటింది. అటు ప్రపంచ దేశాల్లో మాత్రం కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా కొత్తగా 6,28,641 కేసులు వెలుగుచూశాయి. మరో 1,253 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు.