Gujarat: గుజరాత్ మంత్రివర్గంలో భారీ మార్పు.. వారిని ఆ శాఖల నుంచి తొలగింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gujarat: గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని నెలలు మిగిలి ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం శనివారం రాత్రి మంత్రివర్గంలో పెద్ద మార్పు చేసింది. రాజేంద్ర త్రివేది నుంచి రెవెన్యూ శాఖ, పూర్ణేష్ మోదీ నుంచి రోడ్డు, భవనాల శాఖను తొలగించారు. రెండు మంత్రిత్వ శాఖలను ఇప్పుడు ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ నిర్వహిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం త్రివేది లా అండ్ జస్టిస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, లెజిస్లేటివ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలను కొనసాగిస్తారు మరియు పూర్ణేష్ మోడీ రవాణా, పౌర విమానయానం, పర్యాటకం, తీర్థయాత్ర అభివృద్ధి మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తారు. హర్ష్ రమేష్కుమార్ సంఘవికి రెవెన్యూ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు అప్పగించగా.. జగదీష్ ఈశ్వర్ పంచల్కు రాష్ట్ర మంత్రిగా రోడ్డు, భవనాల శాఖను అప్పగించారు.
Mumbai Threat Case: ముంబై ఉగ్ర బెదిరింపుల కేసు.. ఒకరు అరెస్ట్
Also Read
- Jantar Mantar Protest: జంతర్ మంతర్ వద్ద మరో నిరసన.. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వేలాది మంది..
- Drugs Control Department: “UP TO 60%/70%/80% DISCOUNT” బోర్డులు.. ఫార్మసీలకు డ్రగ్స్ కంట్రోల్ సీరియస్ వార్నింగ్
- Rahul Gandhi: పెల్లెట్ గన్ ఘటనపై రాహుల్ గాంధీ ధర్నా.. ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ నమోదు
- Maharashtra: కొడుకును కాపాడే ప్రయత్నం విషాదాంతం.. తల్లిదండ్రులు సహా ముగ్గురూ మృతి
రెవిన్యూ శాఖ నుండి తొలగించబడిన రాజేంద్ర త్రివేది గుజరాత్ ప్రభుత్వంలో కీలక నేతగా పరిగణించబడటం గమనార్హం. భూపేంద్ర పటేల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. త్రివేది రెవెన్యూ మంత్రిగా ఉన్న సమయంలో శాఖకు చెందిన పలు కార్యాలయాలను ఆకస్మిక తనిఖీలు చేశారు. ఆకస్మిక తనిఖీల కారణంగా ఆయన వార్తల్లో నిలిచారు. రాజేంద్ర త్రివేది, పూర్ణేష్ మోడీ ఇద్దరూ భూపేంద్ర పటేల్ ప్రభుత్వంలోని పది మంది కేబినెట్ మంత్రులలో ఉన్నారు. ఈ ఏడాది డిసెంబర్లో గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఈ అనూహ్య నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్ఫర్డ్కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!