India Bangladesh: బంగ్లాదేశ్కు టర్కీ అధ్యక్షుడి కొడుకు.. భారత్కు ప్రమాద హెచ్చరిక..
- బంగ్లాదేశ్కు వెళ్లిన టర్కీ అధ్యక్షుడి కొడుకు..
- పలు ప్రాంతాల్లో సందర్శన..
- భారతదేశానికి భద్రతా హెచ్చరికలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Bangladesh: బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) ప్రభుత్వం కొలువుదీరింది. దీని అధ్యక్షుడు తారిక్ రెహ్మాన్ బంగ్లాదేశ్ కొత్త ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. గత రెండేళ్లుగా బంగ్లాదేశ్లో భారత వ్యతిరేకత, హిందూ విద్వేషాన్ని రెచ్చగొడుతున్న మహ్మద్ యూనస్ ఇక దిగిపోతున్నాడు. ఇదిలా ఉంటే, మతోన్మాద జమాతే ఇస్లామీ పార్టీ 300 స్థానాలకు గానూ 77 సీట్లను గెలుచుకుంది. ఆ పార్టీ ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష పాత్రను పోషించబోతోంది. బంగ్లాదేశ్లో ముఖ్యంగా, భారత సరిహద్దు ప్రాంతాల్లో జమాత్ క్లీన్స్వీప్ చేసింది. ఈ పరిస్థితిని పాకిస్తాన్, టర్కీ వంటి దేశాలు ఉపయోగించుకోవాలని చూస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ తన కుమారుడు బిలాల్ ఎర్డోగన్ను బంగ్లాదేశ్కు పంపారు. బిలాల్ ఎర్డోగన్ బంగ్లాదేశ్కు వచ్చే సమయానికి, తారిక్ రెహమాన్ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 24 గంటల కంటే తక్కువ సమయం మాత్రమే గడిచింది. దీనిని చూస్తే ఈ పర్యటన చాలా ప్రత్యేకతతో కూడుకున్నదని తెలుస్తోంది. టర్కీ, పాక్ సంబంధాలు భారత్కు వ్యతిరేకంగా ఉన్నాయి. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్కు టర్కీ డ్రోన్లను ఇవ్వడమే కాకుండా, వాటిని ఆపరేట్ చేయడానికి మనుషుల్ని కూడా పంపింది.
Also Read
- JPSC Exams: హేమంత్ సోరెన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్.. JPSC పరీక్షల రద్దుపై స్టే
- CM Vijay-Amit shah: నీట్ నుంచి తమిళనాడును మినహాయించండి.. సీఎం విజయ్ విజ్ఞప్తి
- Supreme Court: జంతర్ మంతర్ ఘటనపై సుప్రీం కీలక నిర్ణయం.. జస్టిస్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో హైపవర్ ఎంక్వైరీ కమిటీ
- CBSE Three-Language Policy: సీబీఎస్ఈ త్రిభాషా విధానంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. విద్యార్థులకు ఊరట..
ప్రస్తుతం ఎర్డోగాన్ కొడుకు ఢాకాకు రావడం ఇండియాకు ఆందోళన కలిగిచే పరిణామంగా చెప్పవచ్చు. ఆయనతో పాటు టర్కిష్ మాజీ ఫుట్బాల్ క్రీడాకారుడు మెసుత్ ఓజిల్, టర్కీ ప్రభుత్వ మద్దతుగల సహాయ సంస్థ TIKA చైర్మన్ అబ్దుల్లా ఆరోన్ కూడా ఉన్నారు. ముఖ్యంగా జమాతే ఇస్లామికి చెందిన పలు ప్రాజెక్టుల్లో టర్కీ పెట్టుబడులు పెట్టింది. ఢాకా యూనివర్సిటీలో నిర్మించిన వైద్య కేంద్రానికి టర్కీ నిధులు ఇచ్చింది. ఇప్పుడు దీనిని ప్రారంభించారు. బిలాల్ టీమ్ గురువారం కాక్స్ బజార్లోని రోహింగ్యా శరణార్థి శిబిరాన్ని కూడా సందర్శించనుంది.
ఈ పర్యటన భారత్కు వ్యతిరేకంగా ఉన్నట్లు తెలుస్తోంది. టర్కీకి చెందిన TIKA, భారత్కు సమీపంలోని లాల్మోనీర్హాట్ లోని సాంకేతిక సంస్థల్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. టర్కీ సంస్థలకు, ఎన్జీవోలకు జమాతే ఇస్లామీ గ్రూపులతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇవన్నీ పాన్ ఇస్లామిక్ భావజాలాన్ని ప్రోత్సహిస్తున్నాయి. స్థానిక రాజకీయాలను ప్రభావితం చేయవచ్చని నిఘా వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గతంలో షేక్ హసీనాకు వ్యతిరేకంగా విద్యార్థుల్ని రెచ్చగొట్టడంతో జమాతే పాత్ర ఉంది. దీనికి పాక్ ఐఎస్ఐ నుంచి నిధులు వచ్చాయి.
తాజావార్తలు
-
Tarique Rahman: భారత్ పర్యటనపై బంగ్లాదేశ్ ప్రధాని యూటర్న్.. కారణమిదేనా?
-
BC Reservation: బీసీలకు గుడ్న్యూస్.. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కోటా పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు
-
Rakhi Making at Home: థ్రెడ్, పూసలతో అందమైన రాఖీ.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా
-
TS Inter 2026 : ఇంటర్ పాస్.. మెమోలు రెడీ.. ఎక్కడ తీసుకోవాలంటే.?
-
Former OSD Sumanth : మంత్రి మాజీ ఓఎస్డీపై అటెంప్ట్ మర్డర్ కేసు..
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?