India Bangladesh: బంగ్లాదేశ్కు టర్కీ అధ్యక్షుడి కొడుకు.. భారత్కు ప్రమాద హెచ్చరిక..
- బంగ్లాదేశ్కు వెళ్లిన టర్కీ అధ్యక్షుడి కొడుకు..
- పలు ప్రాంతాల్లో సందర్శన..
- భారతదేశానికి భద్రతా హెచ్చరికలు..
India Bangladesh: బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) ప్రభుత్వం కొలువుదీరింది. దీని అధ్యక్షుడు తారిక్ రెహ్మాన్ బంగ్లాదేశ్ కొత్త ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. గత రెండేళ్లుగా బంగ్లాదేశ్లో భారత వ్యతిరేకత, హిందూ విద్వేషాన్ని రెచ్చగొడుతున్న మహ్మద్ యూనస్ ఇక దిగిపోతున్నాడు. ఇదిలా ఉంటే, మతోన్మాద జమాతే ఇస్లామీ పార్టీ 300 స్థానాలకు గానూ 77 సీట్లను గెలుచుకుంది. ఆ పార్టీ ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష పాత్రను పోషించబోతోంది. బంగ్లాదేశ్లో ముఖ్యంగా, భారత సరిహద్దు ప్రాంతాల్లో జమాత్ క్లీన్స్వీప్ చేసింది. ఈ పరిస్థితిని పాకిస్తాన్, టర్కీ వంటి దేశాలు ఉపయోగించుకోవాలని చూస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ తన కుమారుడు బిలాల్ ఎర్డోగన్ను బంగ్లాదేశ్కు పంపారు. బిలాల్ ఎర్డోగన్ బంగ్లాదేశ్కు వచ్చే సమయానికి, తారిక్ రెహమాన్ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 24 గంటల కంటే తక్కువ సమయం మాత్రమే గడిచింది. దీనిని చూస్తే ఈ పర్యటన చాలా ప్రత్యేకతతో కూడుకున్నదని తెలుస్తోంది. టర్కీ, పాక్ సంబంధాలు భారత్కు వ్యతిరేకంగా ఉన్నాయి. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్కు టర్కీ డ్రోన్లను ఇవ్వడమే కాకుండా, వాటిని ఆపరేట్ చేయడానికి మనుషుల్ని కూడా పంపింది.
Also Read
- Pune: పెళ్లి కోసం యువకుడి ఆరాటం.. ఏకంగా పోలీస్ శాఖలో ఉద్యోగం వచ్చినట్లు పోస్టర్లతో ప్రచారం..
- Earthquake: గుజరాత్లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!
- PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
- Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. 'మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం'.. అంటూ ఆగ్రహం!
ప్రస్తుతం ఎర్డోగాన్ కొడుకు ఢాకాకు రావడం ఇండియాకు ఆందోళన కలిగిచే పరిణామంగా చెప్పవచ్చు. ఆయనతో పాటు టర్కిష్ మాజీ ఫుట్బాల్ క్రీడాకారుడు మెసుత్ ఓజిల్, టర్కీ ప్రభుత్వ మద్దతుగల సహాయ సంస్థ TIKA చైర్మన్ అబ్దుల్లా ఆరోన్ కూడా ఉన్నారు. ముఖ్యంగా జమాతే ఇస్లామికి చెందిన పలు ప్రాజెక్టుల్లో టర్కీ పెట్టుబడులు పెట్టింది. ఢాకా యూనివర్సిటీలో నిర్మించిన వైద్య కేంద్రానికి టర్కీ నిధులు ఇచ్చింది. ఇప్పుడు దీనిని ప్రారంభించారు. బిలాల్ టీమ్ గురువారం కాక్స్ బజార్లోని రోహింగ్యా శరణార్థి శిబిరాన్ని కూడా సందర్శించనుంది.
ఈ పర్యటన భారత్కు వ్యతిరేకంగా ఉన్నట్లు తెలుస్తోంది. టర్కీకి చెందిన TIKA, భారత్కు సమీపంలోని లాల్మోనీర్హాట్ లోని సాంకేతిక సంస్థల్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. టర్కీ సంస్థలకు, ఎన్జీవోలకు జమాతే ఇస్లామీ గ్రూపులతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇవన్నీ పాన్ ఇస్లామిక్ భావజాలాన్ని ప్రోత్సహిస్తున్నాయి. స్థానిక రాజకీయాలను ప్రభావితం చేయవచ్చని నిఘా వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గతంలో షేక్ హసీనాకు వ్యతిరేకంగా విద్యార్థుల్ని రెచ్చగొట్టడంతో జమాతే పాత్ర ఉంది. దీనికి పాక్ ఐఎస్ఐ నుంచి నిధులు వచ్చాయి.
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?