India Bangladesh: బంగ్లాదేశ్కు టర్కీ అధ్యక్షుడి కొడుకు.. భారత్కు ప్రమాద హెచ్చరిక..
- బంగ్లాదేశ్కు వెళ్లిన టర్కీ అధ్యక్షుడి కొడుకు..
- పలు ప్రాంతాల్లో సందర్శన..
- భారతదేశానికి భద్రతా హెచ్చరికలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Bangladesh: బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) ప్రభుత్వం కొలువుదీరింది. దీని అధ్యక్షుడు తారిక్ రెహ్మాన్ బంగ్లాదేశ్ కొత్త ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. గత రెండేళ్లుగా బంగ్లాదేశ్లో భారత వ్యతిరేకత, హిందూ విద్వేషాన్ని రెచ్చగొడుతున్న మహ్మద్ యూనస్ ఇక దిగిపోతున్నాడు. ఇదిలా ఉంటే, మతోన్మాద జమాతే ఇస్లామీ పార్టీ 300 స్థానాలకు గానూ 77 సీట్లను గెలుచుకుంది. ఆ పార్టీ ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష పాత్రను పోషించబోతోంది. బంగ్లాదేశ్లో ముఖ్యంగా, భారత సరిహద్దు ప్రాంతాల్లో జమాత్ క్లీన్స్వీప్ చేసింది. ఈ పరిస్థితిని పాకిస్తాన్, టర్కీ వంటి దేశాలు ఉపయోగించుకోవాలని చూస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ తన కుమారుడు బిలాల్ ఎర్డోగన్ను బంగ్లాదేశ్కు పంపారు. బిలాల్ ఎర్డోగన్ బంగ్లాదేశ్కు వచ్చే సమయానికి, తారిక్ రెహమాన్ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 24 గంటల కంటే తక్కువ సమయం మాత్రమే గడిచింది. దీనిని చూస్తే ఈ పర్యటన చాలా ప్రత్యేకతతో కూడుకున్నదని తెలుస్తోంది. టర్కీ, పాక్ సంబంధాలు భారత్కు వ్యతిరేకంగా ఉన్నాయి. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్కు టర్కీ డ్రోన్లను ఇవ్వడమే కాకుండా, వాటిని ఆపరేట్ చేయడానికి మనుషుల్ని కూడా పంపింది.
Also Read
- Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
- BRICS Summit 2026: పుతిన్-మోడీ-జిన్పింగ్.. ప్రపంచం చూపంతా ఢిల్లీ వైపే!
- Maharashtra: నాందేడ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు-టాటా మ్యాజిక్ ఢీ.. 9 మంది మృతి
- IndiGo Flight: టిష్యూ పేపర్పై ‘బాంబు’ బెదిరింపు.. అహ్మదాబాద్లో ఇండిగో ఎమర్జెన్సీ ల్యాండింగ్
ప్రస్తుతం ఎర్డోగాన్ కొడుకు ఢాకాకు రావడం ఇండియాకు ఆందోళన కలిగిచే పరిణామంగా చెప్పవచ్చు. ఆయనతో పాటు టర్కిష్ మాజీ ఫుట్బాల్ క్రీడాకారుడు మెసుత్ ఓజిల్, టర్కీ ప్రభుత్వ మద్దతుగల సహాయ సంస్థ TIKA చైర్మన్ అబ్దుల్లా ఆరోన్ కూడా ఉన్నారు. ముఖ్యంగా జమాతే ఇస్లామికి చెందిన పలు ప్రాజెక్టుల్లో టర్కీ పెట్టుబడులు పెట్టింది. ఢాకా యూనివర్సిటీలో నిర్మించిన వైద్య కేంద్రానికి టర్కీ నిధులు ఇచ్చింది. ఇప్పుడు దీనిని ప్రారంభించారు. బిలాల్ టీమ్ గురువారం కాక్స్ బజార్లోని రోహింగ్యా శరణార్థి శిబిరాన్ని కూడా సందర్శించనుంది.
ఈ పర్యటన భారత్కు వ్యతిరేకంగా ఉన్నట్లు తెలుస్తోంది. టర్కీకి చెందిన TIKA, భారత్కు సమీపంలోని లాల్మోనీర్హాట్ లోని సాంకేతిక సంస్థల్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. టర్కీ సంస్థలకు, ఎన్జీవోలకు జమాతే ఇస్లామీ గ్రూపులతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇవన్నీ పాన్ ఇస్లామిక్ భావజాలాన్ని ప్రోత్సహిస్తున్నాయి. స్థానిక రాజకీయాలను ప్రభావితం చేయవచ్చని నిఘా వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గతంలో షేక్ హసీనాకు వ్యతిరేకంగా విద్యార్థుల్ని రెచ్చగొట్టడంతో జమాతే పాత్ర ఉంది. దీనికి పాక్ ఐఎస్ఐ నుంచి నిధులు వచ్చాయి.
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?