INDIA alliance: మహారాష్ట్రలో కాంగ్రెస్ ఓటమికి కారణం ఇదే.. కర్ణాటక హోం మంత్రి కీలక వ్యాఖ్యలు..
- ఇండియా కూటమి పార్టీల్లో సహకారం లేదు..
- అందుకే మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయం..
- కర్ణాటక హోం మంత్రి కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
INDIA alliance: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ‘‘మహాయుతి’’ కూటమి సంచలన విజయాన్ని సాధించింది. మొత్తం 288 సీట్లకు గానూ ఏకంగా 233 సీట్లను కైవసం చేసుకుంది. మరోవైపు కాంగ్రెస్, ఎన్సీపీ శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే శివసేనల మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. కేవలం 49 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఇండియా కూటమి(ఎంవీఏ)లో ఏ ఒక్క పార్టీ కూడా ప్రతిపక్ష హోదాను దక్కించుకోలేకపోయింది. 105 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ కేవలం 16 స్థానాలను గెలుచుకుంది.
Read Also: IPL 2025 Mega Action: రూ.27 కోట్లు పలికిన టీమిండియా డైనమెట్ రిషబ్ పంత్
Also Read
- Su-57 fighter jet: భారత్కు పుతిన్ బిగ్ ఆఫర్.. Su-57 స్టెల్త్ ఫైటర్పై కీలక ప్రతిపాదన..
- Marriage Dispute: నాకు 41 ఏళ్లు సర్.. అయినా మా ఇంట్లో పెళ్లి చేయడం లేదు.. పోలీసులను ఆశ్రయించిన మహిళ
- K Annamalai: "కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా".. అన్నామలై సంచలన ప్రకటన..
- Green SM Limo: ఓలా-ఉబర్లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
ఇదిలా ఉంటే, కాంగ్రెస్ ఘోర పరాజయంపై కర్ణాటక హోం మంత్రి జి. పరమేశ్వర కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎన్నికల ఇంఛార్జులలో ఒకరైన జి. పరమేశ్వర మాట్లాడుతూ.. ఇండియా కూటమిలో ఒకరికి ఒకరు సహకరించుకోలేదని, ఓటమికి ఇదే కారణమని ఆదివారం అన్నారు. పలు నియోజకవర్గాల్లో శివసేన (యుబిటి)కి కాంగ్రెస్ పూర్తిగా మద్దతివ్వలేదని, ఉద్ధవ్ ఠాక్రే పార్టీ కూడా అదే విధంగా ఉందని పరమేశ్వర్ అన్నారు. ఎన్సీపీ శరద్ పవార్ కూడా సహకరించకపోవడం స్పష్టంగా కనిపించింది. కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలు గెలుస్తుందని తాను భావించినట్లు చెప్పారు. ముఖ్యంగా విదర్భలో ఎక్కువ స్థానాలు గెలుస్తామని భావించామని, 50 కంటే ఎక్కువ సీట్లు అక్కడ వస్తాయని అనుకున్నాము. కానీ 08 సీట్లు మాత్రమే సాధించామని చెప్పారు. 105 సీట్లలో 60-70 సీట్లు గెలుస్తామని ఊహించాము, కానీ సాధించలేకపోయామని చెప్పారు.
ఈ దేశంలో ఈవీఎంలు ఉన్నంత కాలం కాంగ్రెస్ లేదా మరేదైనా పార్టీ అధికారంలోకి రావడం చాలా కష్టమని బీజేపీ ఈవీఎంలను హ్యాక్ చేయడంలో నిపుణులని, వారికి ఎక్కడ కావాలంటే అక్కడ ఫలితాలను తారుమారు చేస్తారని పరమేశ్వర ఆరోపించారు. మహారాష్ట్రలో మహాయుతి విజయం తర్వాత ఠాక్రే సేన నేత సంజయ్ రౌత్ కూడా ఇలాంటి ఆరోపణలే చేశారు. పలువురు కాంగ్రెస్ నాయకులు ఈవీఎంలు హ్యాకింగ్ చేశాయని ఆరోపించారు.
తాజావార్తలు
-
Su-57 fighter jet: భారత్కు పుతిన్ బిగ్ ఆఫర్.. Su-57 స్టెల్త్ ఫైటర్పై కీలక ప్రతిపాదన..
-
Gautam Gambhir: టెస్టుల్లో నంబర్-3పై కోచ్ గంభీర్ క్లారిటీ.. రిషభ్ పంత్పై కీలక వ్యాఖ్యలు!
-
Jhanvi Kapoor : ఇన్స్టాగ్రామ్లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
-
Rama Nandana: లగ్జరీ లైఫ్స్టైల్ వెనుక “గలీజ్ దందా”.. యూట్యూబర్ రమానందన, మధుకర్కు లుకౌట్ నోటీసులు!
-
OnePlus Community Sale 2026: వన్ప్లస్ కమ్యూనిటీ సేల్ ప్రారంభం.. ఫ్లాగ్షిప్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!