INDIA alliance: మహారాష్ట్రలో కాంగ్రెస్ ఓటమికి కారణం ఇదే.. కర్ణాటక హోం మంత్రి కీలక వ్యాఖ్యలు..
- ఇండియా కూటమి పార్టీల్లో సహకారం లేదు..
- అందుకే మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయం..
- కర్ణాటక హోం మంత్రి కీలక వ్యాఖ్యలు..
INDIA alliance: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ‘‘మహాయుతి’’ కూటమి సంచలన విజయాన్ని సాధించింది. మొత్తం 288 సీట్లకు గానూ ఏకంగా 233 సీట్లను కైవసం చేసుకుంది. మరోవైపు కాంగ్రెస్, ఎన్సీపీ శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే శివసేనల మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. కేవలం 49 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఇండియా కూటమి(ఎంవీఏ)లో ఏ ఒక్క పార్టీ కూడా ప్రతిపక్ష హోదాను దక్కించుకోలేకపోయింది. 105 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ కేవలం 16 స్థానాలను గెలుచుకుంది.
Read Also: IPL 2025 Mega Action: రూ.27 కోట్లు పలికిన టీమిండియా డైనమెట్ రిషబ్ పంత్
Also Read
- Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
- Bengal exit polls: బీజేపీ వైపు నాలుగు, టీఎంసీ వైపు రెండు.. ఎగ్జిట్ పోల్స్తో ఉత్కంఠ..
- TM Exit Poll: తమిళనాడు సీఎంగా విజయ్.. సంచలనం స్పష్టిస్తున్న సర్వే..
- Measles Outbreak : బంగ్లాదేశ్ లో విజృంభిస్తున్న మీజిల్స్ మహమ్మారి..భారత్ కి ముప్పు తప్పదా ?
ఇదిలా ఉంటే, కాంగ్రెస్ ఘోర పరాజయంపై కర్ణాటక హోం మంత్రి జి. పరమేశ్వర కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎన్నికల ఇంఛార్జులలో ఒకరైన జి. పరమేశ్వర మాట్లాడుతూ.. ఇండియా కూటమిలో ఒకరికి ఒకరు సహకరించుకోలేదని, ఓటమికి ఇదే కారణమని ఆదివారం అన్నారు. పలు నియోజకవర్గాల్లో శివసేన (యుబిటి)కి కాంగ్రెస్ పూర్తిగా మద్దతివ్వలేదని, ఉద్ధవ్ ఠాక్రే పార్టీ కూడా అదే విధంగా ఉందని పరమేశ్వర్ అన్నారు. ఎన్సీపీ శరద్ పవార్ కూడా సహకరించకపోవడం స్పష్టంగా కనిపించింది. కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలు గెలుస్తుందని తాను భావించినట్లు చెప్పారు. ముఖ్యంగా విదర్భలో ఎక్కువ స్థానాలు గెలుస్తామని భావించామని, 50 కంటే ఎక్కువ సీట్లు అక్కడ వస్తాయని అనుకున్నాము. కానీ 08 సీట్లు మాత్రమే సాధించామని చెప్పారు. 105 సీట్లలో 60-70 సీట్లు గెలుస్తామని ఊహించాము, కానీ సాధించలేకపోయామని చెప్పారు.
ఈ దేశంలో ఈవీఎంలు ఉన్నంత కాలం కాంగ్రెస్ లేదా మరేదైనా పార్టీ అధికారంలోకి రావడం చాలా కష్టమని బీజేపీ ఈవీఎంలను హ్యాక్ చేయడంలో నిపుణులని, వారికి ఎక్కడ కావాలంటే అక్కడ ఫలితాలను తారుమారు చేస్తారని పరమేశ్వర ఆరోపించారు. మహారాష్ట్రలో మహాయుతి విజయం తర్వాత ఠాక్రే సేన నేత సంజయ్ రౌత్ కూడా ఇలాంటి ఆరోపణలే చేశారు. పలువురు కాంగ్రెస్ నాయకులు ఈవీఎంలు హ్యాకింగ్ చేశాయని ఆరోపించారు.
తాజావార్తలు
-
LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!
-
Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?
-
Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
-
Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!
-
MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్ రికెల్టన్’.. SRH ముందు భారీ టార్గెట్.!
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?