Waqf Board: వక్ఫ్ బోర్డు సంస్కరణలు.. 44 సవరణలు.. మహిళలు తప్పనిసరి..
- వక్ఫ్ బోర్డు సంస్కరణలకి సిద్ధమైన బీజేపీ ప్రభుత్వం..
- వర్షాకాల సమావేశాల్లో రెండు బిల్లులు..
- 44 సవరణలు.. మహిళలకు బోర్డులో స్థానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Waqf Board: వక్ఫ్ బోర్డు ‘‘అపరిమిత అధికారాలకు’’ బ్రేక్ వేసేందుకు కేంద్రం కొత్తగా చట్టంలో సవరణలు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈ చర్యను కొందరు ముస్లింలు స్వాగతిస్తుండగా, మరికొందరు వ్యతిరేకంగా స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు బిల్లులను తీసుకురావడం ద్వారా చట్టానికి 40కి పైగా సవరణలు ప్రవేశపెట్టబడనున్నట్లు తెలుస్తోంది. వర్షకాల సమావేశాల్లోనే ఈ రెండు బిల్లులతో వక్ఫ్ బోర్డులో సంస్కరణలు ప్రారంభించే లక్ష్యంతో కేంద్రం ఉంది. దీంతో పాటు వక్ఫ్ ప్యానెల్లో ఇద్దరు మహిళా సభ్యులు ఉండటాన్ని కేంద్రం తప్పనిసరి చేయనుంది.
సెంట్రల్ పోర్టల్ ద్వారా వక్ఫ్ ఆస్తుల్ని నమోదు చేయడంతో పాటు బోహ్రా కమ్యూనిటీ ముస్లిం హక్కుల పరిరక్షణ ప్రతిపాదిత సవరణలు ఉండబోతున్నాయి. ఏదైనా ఆస్తిని ‘‘వక్ఫ్ ఆస్తి’’గా ప్రకటించే అధికారాన్ని బోర్డుకు తొలగించాలని సవరణ బిల్లు ప్రతిపాదిస్తోంది. ఇందుకోసం ప్రస్తుతం వక్ఫ్ చట్టంలో ఉన్న సెక్షన్ 40ని రద్దు చేయనున్నారు. వక్ఫ్ సవరణ బిల్లు ప్రకారం, వక్ఫ్ చట్టం-1923 ఉపసంహరించబడుతుంది, 1995 వక్ఫ్ చట్టం నిర్మాణంలో మెరుగైన పనితీరు, నిర్వహణ కోసం 44 సవరణలు ప్రవేశపెట్టడం ద్వారా మార్చబడుతుంది. ప్రతిపాదిత సవరణలు సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ మరియు రాష్ట్ర బోర్డులలో మహిళా ప్రాతినిధ్యాన్ని పెంచనున్నారు.
Also Read
- Air India Plane Crash Anniversary: 260 మంది ప్రాణాలు గాల్లో కలిసిన వేళ.. ఏడాది గడిచినా వీడని సస్పెన్స్?
- Rajnath Singh: హైదరాబాద్కు రక్షణ మంత్రి రాక.. నేడు, రేపు మేధావులతో భేటీలు, శాస్త్రవేత్తలతో ప్రత్యేక సమావేశం
- AIR INDIA Crash: ఆ మూడు సెకన్లలో అసలేం జరిగింది? విమానం కూలి ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నలు!
- New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
Read Also: Karan Bhushan Singh: వినేష్ ఫోగట్ అనర్హత వేటుపై బ్రిజ్ భూషణ్ సింగ్ కుమారుడు ఏమన్నారంటే?
కొత్త చట్టంలో ప్రతిపాదిత కీలకమైన మార్పుల్లో వక్ఫ్ చట్టం 1995 పేరుని ఏకీకృత వక్ఫ్ నిర్వహణ, సాధికారత, సమర్థత మరియు అభివృద్ధి చట్టం, 1995గా మార్చడంతో పాటు షియా, సున్నీ, బోహ్రా, అఘఖానీ ఇతర వెనకబడిన తరగతులతో సహా అన్ని ముస్లిం వర్గాలకు తగిన ప్రాతినిధ్యం ఉండేలా మార్పులు చేస్తున్నారు. బోహ్రా, అఘాఖానీ సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ కోసం ప్రత్యేక బోర్డ్ ఆఫ్ ఔకాఫ్ ప్రతిపాదిస్తున్నారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డుల్లో ముస్లిం మహిళలు, ముస్లిమేతరకు ప్రాతినిధ్యం ఉంటుంది.
ప్రతిపాదిత మార్పులకు వివిధ దర్గాల ముఖ్యుల నుంచి కూడా మద్దతు లభించింది. మంగళవారం సాయంత్రం మైనారిటీ నేతలు, మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజును కలుసుకుని చట్టానికి మద్దతు ఇచ్చారు. ‘‘భారతదేశంలోని వివిధ దర్గాల నుండి అత్యంత గౌరవనీయమైన & ప్రముఖ సజ్జదానాశిన్లతో కూడిన ఆల్ ఇండియా సూఫీ సజ్జదనాషిన్ కౌన్సిల్ (AISSC) యొక్క ప్రతినిధి బృందం అజ్మీర్ దర్గా యొక్క ప్రస్తుత ఆధ్యాత్మిక అధిపతి చైర్మన్ & వారసుడు శ్రీ సయ్యద్ నసెరుద్దీన్ చిష్టీ నేతృత్వంలో నన్ను కలిశారు. ’’ అని కిరణ్ రిజిజు ఎక్స్లో ట్వీట్ చేశారు. నివేదికల ప్రకారం వక్ఫ్ బోర్డు దాదాపుగా 8.7 లక్షల ఆస్తులుల ఉన్నాయి. 9.8 లక్షల ఎకరాల భూమి ఉంది.
తాజావార్తలు
-
The Odyssey : ‘ది ఒడిస్సీ’కి భయపడి ప్రీ పోన్ చేసుకుంటోన్న బాలీవుడ్ ఫిల్మ్స్
-
2027 ODI World Cup: హార్దిక్ పాండ్యా ఎందుకు.. ఆ తెలుగోడే ‘సరైనోడు’!
-
Prabhas : షాకింగ్.. ఫౌజీ vs స్పిరిట్?
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
IND vs IRE: భారత్-ఐర్లాండ్ టీ20 సిరీస్ రద్దు.?
ట్రెండింగ్
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?