Karan Bhushan Singh: వినేష్ ఫోగట్ అనర్హత వేటుపై బ్రిజ్ భూషణ్ సింగ్ కుమారుడు ఏమన్నారంటే?
- పారిస్ ఒలింపిక్స్ నుంచి భారత్కు చేదువార్త
- ఫైనల్స్కు చేరిన రెజ్లర్ వినేష్ ఫోగట్ ను అనర్హురాలిగా తేల్చిన నిర్వహకులు
- భారత రెజ్లింగ్ సంఘం మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కుమారుడు కరణ్ భూషణ్ స్పందన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పారిస్ ఒలింపిక్స్ నుంచి భారత్కు చేదువార్త వచ్చింది. 50 కిలోల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ పోటీల్లో ఫైనల్స్కు చేరిన రెజ్లర్ వినేష్ ఫోగట్ ను అనర్హురాలిగా ప్రకటించారు. దీనిపై భారత రెజ్లింగ్ సంఘం మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కుమారుడు కరణ్ భూషణ్ స్పందించారు. కైసర్గంజ్కు చెందిన బీజేపీ ఎంపీ కరణ్ భూషణ్ మాట్లాడుతూ.. దేశం పతకం కోల్పోయిందన్నారు. దీనిపై సమాఖ్య అప్పీలు చేస్తుందని తెలిపారు. మరి ఇందులో ఏం జరుగుతుందో చూడాలని చెప్పారు.
READ MORE: Balka Suman : రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారింది
Also Read
- Success story: గ్రామీణ నేపథ్యం, IIT చదువు లేదు.. కానీ, రూ. 2.6 కోట్ల ప్యాకేజీ సాధించిన కుర్రాడు..
- Bangladesh: మార్షల్ ఆర్ట్స్ పేరుతో ఉగ్రవాదం..
- Khamenei Funeral: ఖమేనీ అంత్యక్రియల్లో "మాస్క్ మ్యాన్".. ఎవరనేది తెలిసింది
- Jagga Reddy : బీఆర్ఎస్ నేతలకు జగ్గారెడ్డి సవాల్.. కేసీఆర్, హరీష్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.!
ఉత్తరప్రదేశ్ రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు కరణ్ భూషణ్ పార్లమెంట్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చారు. ఆయన పార్లమెంట్ నుంచి బయటకు రాగానే ఓ జాతీయ మీడియా ఆయనను సంప్రదించింది. విలేకరి వినేష్ ఫోగట్ గురించి ప్రశ్నలు అడిగారు. “పార్లమెంట్ నుంచి ఇప్పుడే బయటకు వచ్చాను. ఈ సమస్యపై పెద్దగా సమాచారం లేదు. ఇదే జరిగితే దేశం పతకం కోల్పోయినట్టే. ఈ అంశంపై కచ్చితంగా సమాఖ్య అప్పీలు చేస్తుంది. ఒకసారి మేము కూడా మాట్లాడుతాం. అసలేం జరిగింది. ఇక ముందు ఏం చేయాలో తెలుసుకుంటాం.” అని పేర్కొన్నారు.
READ MORE:Vinesh Phogat: అది పీడకల అయితే బాగుండు.. ఆనంద్ మహీంద్రా ట్వీట్!
గతంలో బ్రిజ్ భూషణ్ను అరెస్టు చేయాలని వినేష్ ఫోగట్ డిమాండ్..
రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ బ్రిజ్భూషణ్ ను ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పక్కనబెట్టింది. అయితే ఆ స్థానంలో ఆయన కుమారుడికి టికెట్ కల్పించింది. ఉత్తరప్రదేశ్లోని కైసర్గంజ్ స్థానం నుంచి కరణ్ భూషణ్ సింగ్ పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇక రాయబరేలీ నుంచి దినేశ్ ప్రతాప్ సింగ్ను నిలబెట్టింది. కైసర్గంజ్ లోక్సభ స్థానానికి వరుసగా మూడు పర్యాయాలుగా బ్రిజ్భూషణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019 ఎన్నికల్లో 2లక్షల మెజార్టీతో విజయం సాధించారు. అయితే లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ గతేడాది జనవరిలో అగ్రశ్రేణి రెజ్లర్లు ఆయనకు వ్యతిరేకంగా రోడ్డెక్కి ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి బ్రిజ్భూషణ్ పేరు వార్తల్లో నిలిచింది. ఈ క్రమంలోనే రెజ్లింగ్ సమాఖ్య నుంచి వైదొలిగిన ఆయన క్రీడారాజకీయాలకు స్వస్తి పలికారు. అయితే ఆ స్థానం నుంచి కరణ్ భూషణ్ గెలుపొందాడు.
#WATCH | Delhi: On Indian wrestler Vinesh Phogat's disqualification from #ParisOlympics2024, BJP MP Karan Bhushan Singh says, "It is a loss for the country. The Federation will take this into consideration and see what can be done" pic.twitter.com/lSntbFF3kv
— ANI (@ANI) August 7, 2024
తాజావార్తలు
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
-
Srinivasa Mangapuram Trailer: మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి కొత్త హీరో.. ట్రైలర్తోనే అంచనాలు పెంచేసిన జై కృష్ణ!
-
Tirupati Drugs Case : తిరుపతి డ్రగ్స్ కేసులో టీటీడీ ఉద్యోగి అరెస్ట్..
-
Success story: గ్రామీణ నేపథ్యం, IIT చదువు లేదు.. కానీ, రూ. 2.6 కోట్ల ప్యాకేజీ సాధించిన కుర్రాడు..
-
Bangladesh: మార్షల్ ఆర్ట్స్ పేరుతో ఉగ్రవాదం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..