CM Siddaramaiah: నేను బలమైన సీఎంని, నీలాగా బలహీన పీఎంని కాదు.. మోడీపై విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Siddaramaiah: కర్ణాటక సీఎం, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య ప్రధాని నరేంద్రమోడీ టార్గెట్గా విమర్శలు చేశారు. బీజేపీలో తిరుగబాటు నాయకులను అదుపు చేయలేని బలహీన ప్రధానిగా ఆరోపించారు. శివమొగ్గలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలకు సిద్ధరామయ్య ప్రతిస్పందించారు. ‘‘ దోపిడిలో భాగస్వామ్యం కావడానికి కర్ణాటకలో పోటీ నెలకొంది. సీఎం-ఇన్-వెయిటింగ్, కాబోయే సీఎం ఆశావహులు, సూపర్ సీఎం, షాడో సీఎం ఇలా కాంగ్రెస్లో ఉన్నారు. చాలా మంది సీఎంల నడుమ ఢిల్లీలో కలెక్షన్ మినిస్టర్ ఉన్నారు’’ అంటూ కాంగ్రెస్ అధిష్టానంపై, కర్ణాటక ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
Read Also: IVF Case: బిడ్డకు జన్మనిచ్చి చిక్కుల్లో పడిన సిద్దూ మూసేవాలా తల్లిదండ్రులు.. కారణం ఏంటంటే.?
Also Read
- Neha Pachisia: నేహా పచిసియా ఎవరు? ఎయిర్ హోస్టెస్ నుంచి పోలీస్ అధికారిణిగా.. ఇప్పుడు సస్పెన్షన్ ఎందుకు?
- Suitcase Torso Case: సూట్కేసులో మొండెం కేసులో కొత్త ట్విస్ట్.. శరీర భాగాలతో బిర్యానీ వండి..!
- Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ..
- Cargo Ship Sinks in Bay of Bengal: బంగాళాఖాతంలో ఘోర ప్రమాదం.. 24 మంది సిబ్బందితో సరుకు నౌక మునక
దీనికి ప్రతిస్పందనగా సిద్ధరామయ్య ఎక్స్ వేదిక ప్రధాని మోడీపై విమర్శలు చేశారు. ‘‘తిరుగుబాటు నాయకుడు ఈశ్వరప్పపై చర్యలు తీసుకోలేని బలహీన ప్రధాని అని, ప్రియమైన ప్రధాని నరేంద్ర మోదీ గారు, కాంగ్రెస్ పార్టీలో సూపర్ సీఎంలు, షాడో సీఎంలు ఉన్నారని మీరు చెప్పారు! మాకు సూపర్ లేదు, షాడో లేదు, ఒకే సీఎం ఉన్నారు. అది స్ట్రాంగ్ సీఎం, నేను మీలా వీక్ పీఎంని కాదు.’’ అంటూ ట్వీట్ చేశారు. ‘‘మీరు మిమ్మల్ని 56 అంగుళాల ఛాతి ఉన్న వ్యక్తిగా అభివర్ణించుకుంటారు. మీ అభిమానులు మిమ్మల్ని విశ్వగురు అని కొనియాడుతున్నారు. కానీ మిమ్మల్ని మీరు మళ్లీ మళ్లీ ‘‘వీక్ పీఎం’’గా చూపిస్తున్నారు’’ అంటూ విమర్శించారు.
మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ఒకప్పుడు ఆయన నాయకత్వంపై తిరుగుబాటు చేశారని, దుర్భాషలాడారని ముఖ్యమంత్రి అన్నారు. అలాంటి వారి కాళ్లపై పడి, వారి మళ్లీ పార్టీలోకి తీసుకొచ్చి ర్యాలీలు నిర్వహించి, మిమ్మల్ని మీరు బలహీన ప్రధానిగా చూపించలేదా..? అని సిద్ధరామయ్య ప్రశ్నించారు. కర్ణాటకలో మీ నాయకత్వంపై అరడజను మంది నాయకులు తిరుగుబాటు చేశారని, టిక్కెట్ల దొరక్క బీజేపీ నేతలు ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటూ వీధిన పడ్డారని సీఎం ఎద్దేవా చేశారు. శివమొగ్గలో మోడీ బహిరంగ సభ నిర్వహిస్తున్న సమయంలో అక్కడే ఉన్న ఈశ్వరప్ప ఇంటికి ఎందుకు వెళ్లలేదని అన్నారు. ఈశ్వరప్ప నిరంతరం బీజేపీ నాయకత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోలేని వారిని వీక్ పీఎం కాకుంటే ఇంకేమంటారు అని సిద్ధరామయ్య ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉందని, సీఎం పదవికి అర్హులైన చాలా మంది నాయకులు ఉన్నారని, బీజేపీలో ప్రధాని అయ్యే అర్హత ఉన్న ఒక్క నాయకుడు కూడా లేదని విమర్శించారు.
తాజావార్తలు
-
Telangana Auto, Cab Strike: అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్స్ బంద్..
-
IND vs SL 2nd Test: 33 ఏళ్ల సారాంశ్ జైన్ అరంగేట్రం.. కుల్దీప్ యాదవ్ ఆడకపోవడానికి కారణం ఫామ్ కాదు!
-
David Reddy: మంచు మనోజ్ సినిమాలో శింబు.. అన్నయ్యగా స్పెషల్ రోల్?
-
Neha Pachisia: నేహా పచిసియా ఎవరు? ఎయిర్ హోస్టెస్ నుంచి పోలీస్ అధికారిణిగా.. ఇప్పుడు సస్పెన్షన్ ఎందుకు?
-
Anil RaviPudi : ‘జనవరి 12 విడుదల’లో స్పెషల్ సాంగ్.. మాస్ ఫ్యాన్స్కు పూనకాలే
ట్రెండింగ్
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!