CM Siddaramaiah: నేను బలమైన సీఎంని, నీలాగా బలహీన పీఎంని కాదు.. మోడీపై విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Siddaramaiah: కర్ణాటక సీఎం, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య ప్రధాని నరేంద్రమోడీ టార్గెట్గా విమర్శలు చేశారు. బీజేపీలో తిరుగబాటు నాయకులను అదుపు చేయలేని బలహీన ప్రధానిగా ఆరోపించారు. శివమొగ్గలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలకు సిద్ధరామయ్య ప్రతిస్పందించారు. ‘‘ దోపిడిలో భాగస్వామ్యం కావడానికి కర్ణాటకలో పోటీ నెలకొంది. సీఎం-ఇన్-వెయిటింగ్, కాబోయే సీఎం ఆశావహులు, సూపర్ సీఎం, షాడో సీఎం ఇలా కాంగ్రెస్లో ఉన్నారు. చాలా మంది సీఎంల నడుమ ఢిల్లీలో కలెక్షన్ మినిస్టర్ ఉన్నారు’’ అంటూ కాంగ్రెస్ అధిష్టానంపై, కర్ణాటక ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
Read Also: IVF Case: బిడ్డకు జన్మనిచ్చి చిక్కుల్లో పడిన సిద్దూ మూసేవాలా తల్లిదండ్రులు.. కారణం ఏంటంటే.?
Also Read
- Cockroach Janta Party: ఢిల్లీలో "కాక్రోచ్ జనతా పార్టీ" ఆందోళన.. పోలీసులు ఏం చెబుతున్నారంటే..
- Sanjay Raut: కాంగ్రెస్లో విలీనం కావాలి.. టీఎంసీ, ఎన్సీపీలకు సంజయ్ రౌత్ పిలుపు..
- Arunachal Pradesh: ‘‘ఇది 1962 కాదు’’.. చైనాకు అరుణాచల్ సీఎం హెచ్చరిక..
- PM Surya Ghar: సోలార్ విద్యుత్ దిశగా దేశం.. 40 లక్షల ఇళ్లకు చేరిన ‘పీఎం సూర్య ఘర్’ పథకం
దీనికి ప్రతిస్పందనగా సిద్ధరామయ్య ఎక్స్ వేదిక ప్రధాని మోడీపై విమర్శలు చేశారు. ‘‘తిరుగుబాటు నాయకుడు ఈశ్వరప్పపై చర్యలు తీసుకోలేని బలహీన ప్రధాని అని, ప్రియమైన ప్రధాని నరేంద్ర మోదీ గారు, కాంగ్రెస్ పార్టీలో సూపర్ సీఎంలు, షాడో సీఎంలు ఉన్నారని మీరు చెప్పారు! మాకు సూపర్ లేదు, షాడో లేదు, ఒకే సీఎం ఉన్నారు. అది స్ట్రాంగ్ సీఎం, నేను మీలా వీక్ పీఎంని కాదు.’’ అంటూ ట్వీట్ చేశారు. ‘‘మీరు మిమ్మల్ని 56 అంగుళాల ఛాతి ఉన్న వ్యక్తిగా అభివర్ణించుకుంటారు. మీ అభిమానులు మిమ్మల్ని విశ్వగురు అని కొనియాడుతున్నారు. కానీ మిమ్మల్ని మీరు మళ్లీ మళ్లీ ‘‘వీక్ పీఎం’’గా చూపిస్తున్నారు’’ అంటూ విమర్శించారు.
మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ఒకప్పుడు ఆయన నాయకత్వంపై తిరుగుబాటు చేశారని, దుర్భాషలాడారని ముఖ్యమంత్రి అన్నారు. అలాంటి వారి కాళ్లపై పడి, వారి మళ్లీ పార్టీలోకి తీసుకొచ్చి ర్యాలీలు నిర్వహించి, మిమ్మల్ని మీరు బలహీన ప్రధానిగా చూపించలేదా..? అని సిద్ధరామయ్య ప్రశ్నించారు. కర్ణాటకలో మీ నాయకత్వంపై అరడజను మంది నాయకులు తిరుగుబాటు చేశారని, టిక్కెట్ల దొరక్క బీజేపీ నేతలు ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటూ వీధిన పడ్డారని సీఎం ఎద్దేవా చేశారు. శివమొగ్గలో మోడీ బహిరంగ సభ నిర్వహిస్తున్న సమయంలో అక్కడే ఉన్న ఈశ్వరప్ప ఇంటికి ఎందుకు వెళ్లలేదని అన్నారు. ఈశ్వరప్ప నిరంతరం బీజేపీ నాయకత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోలేని వారిని వీక్ పీఎం కాకుంటే ఇంకేమంటారు అని సిద్ధరామయ్య ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉందని, సీఎం పదవికి అర్హులైన చాలా మంది నాయకులు ఉన్నారని, బీజేపీలో ప్రధాని అయ్యే అర్హత ఉన్న ఒక్క నాయకుడు కూడా లేదని విమర్శించారు.
తాజావార్తలు
-
Ben Stokes: గుర్తుపట్టలేని స్థితిలో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్.. నెటిజన్లు షాక్..
-
Cockroach Janta Party: ఢిల్లీలో “కాక్రోచ్ జనతా పార్టీ” ఆందోళన.. పోలీసులు ఏం చెబుతున్నారంటే..
-
Sanjay Raut: కాంగ్రెస్లో విలీనం కావాలి.. టీఎంసీ, ఎన్సీపీలకు సంజయ్ రౌత్ పిలుపు..
-
Iran: యురేనియం బదిలీపై ఇరాన్ సంచలన నిర్ణయం.. పాక్కు కీలక సమాచారం!
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
ట్రెండింగ్
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!