CM Siddaramaiah: నేను బలమైన సీఎంని, నీలాగా బలహీన పీఎంని కాదు.. మోడీపై విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Siddaramaiah: కర్ణాటక సీఎం, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య ప్రధాని నరేంద్రమోడీ టార్గెట్గా విమర్శలు చేశారు. బీజేపీలో తిరుగబాటు నాయకులను అదుపు చేయలేని బలహీన ప్రధానిగా ఆరోపించారు. శివమొగ్గలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలకు సిద్ధరామయ్య ప్రతిస్పందించారు. ‘‘ దోపిడిలో భాగస్వామ్యం కావడానికి కర్ణాటకలో పోటీ నెలకొంది. సీఎం-ఇన్-వెయిటింగ్, కాబోయే సీఎం ఆశావహులు, సూపర్ సీఎం, షాడో సీఎం ఇలా కాంగ్రెస్లో ఉన్నారు. చాలా మంది సీఎంల నడుమ ఢిల్లీలో కలెక్షన్ మినిస్టర్ ఉన్నారు’’ అంటూ కాంగ్రెస్ అధిష్టానంపై, కర్ణాటక ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
Read Also: IVF Case: బిడ్డకు జన్మనిచ్చి చిక్కుల్లో పడిన సిద్దూ మూసేవాలా తల్లిదండ్రులు.. కారణం ఏంటంటే.?
Also Read
- Work From Home: కేంద్రం కంపెనీలకు "వర్క్ ఫ్రమ్ హోమ్" ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
- Indian Railways logo: ఇండియన్ రైల్వేస్ లోగోలో భారీ మార్పు.. ఇకపై 18 నక్షత్రాలు..ఈ మార్పుకు కారణం ఏమిటి?
- Uttar Pradesh: యూపీలో ప్రకృతి ప్రకోపం.. పిడుగులు, వానాకాలం బీభత్సానికి 111 మంది బలి
- Delhi Work From Home: ప్రభుత్వం కీలక నిర్ణయం.. రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్.. పొదుపు చర్యల జాబితా విడుదల
దీనికి ప్రతిస్పందనగా సిద్ధరామయ్య ఎక్స్ వేదిక ప్రధాని మోడీపై విమర్శలు చేశారు. ‘‘తిరుగుబాటు నాయకుడు ఈశ్వరప్పపై చర్యలు తీసుకోలేని బలహీన ప్రధాని అని, ప్రియమైన ప్రధాని నరేంద్ర మోదీ గారు, కాంగ్రెస్ పార్టీలో సూపర్ సీఎంలు, షాడో సీఎంలు ఉన్నారని మీరు చెప్పారు! మాకు సూపర్ లేదు, షాడో లేదు, ఒకే సీఎం ఉన్నారు. అది స్ట్రాంగ్ సీఎం, నేను మీలా వీక్ పీఎంని కాదు.’’ అంటూ ట్వీట్ చేశారు. ‘‘మీరు మిమ్మల్ని 56 అంగుళాల ఛాతి ఉన్న వ్యక్తిగా అభివర్ణించుకుంటారు. మీ అభిమానులు మిమ్మల్ని విశ్వగురు అని కొనియాడుతున్నారు. కానీ మిమ్మల్ని మీరు మళ్లీ మళ్లీ ‘‘వీక్ పీఎం’’గా చూపిస్తున్నారు’’ అంటూ విమర్శించారు.
మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ఒకప్పుడు ఆయన నాయకత్వంపై తిరుగుబాటు చేశారని, దుర్భాషలాడారని ముఖ్యమంత్రి అన్నారు. అలాంటి వారి కాళ్లపై పడి, వారి మళ్లీ పార్టీలోకి తీసుకొచ్చి ర్యాలీలు నిర్వహించి, మిమ్మల్ని మీరు బలహీన ప్రధానిగా చూపించలేదా..? అని సిద్ధరామయ్య ప్రశ్నించారు. కర్ణాటకలో మీ నాయకత్వంపై అరడజను మంది నాయకులు తిరుగుబాటు చేశారని, టిక్కెట్ల దొరక్క బీజేపీ నేతలు ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటూ వీధిన పడ్డారని సీఎం ఎద్దేవా చేశారు. శివమొగ్గలో మోడీ బహిరంగ సభ నిర్వహిస్తున్న సమయంలో అక్కడే ఉన్న ఈశ్వరప్ప ఇంటికి ఎందుకు వెళ్లలేదని అన్నారు. ఈశ్వరప్ప నిరంతరం బీజేపీ నాయకత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోలేని వారిని వీక్ పీఎం కాకుంటే ఇంకేమంటారు అని సిద్ధరామయ్య ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉందని, సీఎం పదవికి అర్హులైన చాలా మంది నాయకులు ఉన్నారని, బీజేపీలో ప్రధాని అయ్యే అర్హత ఉన్న ఒక్క నాయకుడు కూడా లేదని విమర్శించారు.
తాజావార్తలు
-
Dhurandhar 2: ‘ధురంధర్ 2’ OTT రిలీజ్పై ట్విస్ట్..
-
NBK111 : ‘బాలయ్య – నర్గిస్ ఫక్రి’ దబిడి.. దిబిడి.. షూటింగ్ ఫినిష్.. టీజర్ ఎప్పుడంటే?
-
NPS Sanchay Yojana: NPS సంచయ్ యోజన.. ఖాతా ఎలా తెరవాలి? ఎవరికీ ఉపయోగం? పూర్తి వివరాలు
-
Karuppu : ఫైనాన్స్ అడ్డంకులు తొలగి థియేటర్లలోకి వచ్చిన సూర్య ‘కరుప్పు’
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
ట్రెండింగ్
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!