Bulldozer Action: బహ్రైచ్ నిందితులపై బుల్డోజర్ యాక్షన్.. యోగి సర్కార్కి సుప్రీంకోర్టు వార్నింగ్..
- బహ్రైచ్ అల్లర్ల నిందితుల ఇళ్లకు యూపీ సర్కార్ నోటీసులు..
- బుల్డోజర్ యాక్షన్పై యోగి ప్రభుత్వాన్ని హెచ్చరించిన సుప్రీంకోర్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bulldozer Action: ఉత్తర్ ప్రదేశ్ బహ్రైచ్ జిల్లాలో ఇటీవల దుర్గా నిమజ్జనం సమయంలో అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్లలో 22 ఏళ్ల యువకుడు రామ్ గోపాల్ మిశ్రాను వేరే వర్గం వ్యక్తులు కాల్చి చంపారు. ఈ ఘటనలో పోలీసులు మహ్మద్ ఫహీన్, మహ్మద్ సర్ఫరాజ్, అబ్దుల్ హమీద్, మహ్మద్ తలీమ్ అలియాస్ సబ్లూ మరియు మహ్మద్ అఫ్జల్ని అరెస్ట్ చేశారు. నేపాల్ పారిపోతున్న సమయంలో మహ్మద్ తలీమ్, మహ్మద్ సర్ఫరాజ్లను పోలీసులు ఎన్కౌంటర్ చేసి పట్టుకున్నారు.
Read Also: UP: ఒకే మైనర్ బాలుడిని ప్రేమించిన ఇద్దరు బాలికలు.. ముగ్గురూ కలిసి ఏం ప్లాన్ చేశారో చూడండి
Also Read
- Kolar Tragedy: గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి.. చివరకు..!
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Mamata Banerjee: మమతా దీదీకి మరో షాక్.. ముస్లిం ఎమ్మెల్యేల తిరుగుబాటు..
- Mohan Bhagwat: ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరం.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
అయితే, ఈ కేసు తర్వాత ఉత్తర్ ప్రదేశ్ సర్కార్ నిందితుల ఇళ్లపై బుల్డోజర్ యాక్షన్కి దిగింది. నిందితుల కుటుంబాలకు ప్రభుత్వం ఇళ్లను కూల్చివేస్తున్నట్లుగా నోటీసులు ఇచ్చింది. అయితే, తాజాగా సుప్రీంకోర్టు కూల్చివేత నోటీసులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారించింది. ప్రభుత్వానికి పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసింది. ‘‘వారు (యుపి అధికారులు) మా ఆర్డర్ను ఉల్లంఘించే రిస్క్ తీసుకోవాలనుకుంటే, అది వారి ఇష్టం’’ అని జస్టిస్ గవాయ్ ఈ రోజు అన్నారు. అయితే, నిర్మాణాలు చట్టవిరుద్ధమైతే తాము జోక్యం చేసుకోబోమని ‘‘బుల్డోజర్ జస్టిస్’’కేసులో తమ ఉత్తర్వులు పేర్కొన్నట్లు కోర్టు తెలిపింది. రేపు తదుపరి విచారణకు ముందు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్ ప్రదేశ్ సర్కార్ని కోరింది.
పిటిషనర్ల తరుపున సీనియర్ న్యాయవాది సియు సింగ్ వాదించారు. అక్టోబర్ 13న హింసాకాండ జరిగిన తర్వాత స్థానిక అధికారులు కూల్చివేత నోటీసులు ఇచ్చి మూడు రోజుల్లో సమాధానం ఇవ్వాలని కోరారు. అంతకుముందు, అలహాబాద్ హైకోర్టు కూల్చివేత నోటీసులకు రిప్లై దాఖలు చేయడానికి గడువును 15 రోజులకు పొడిగించింది, ప్రతిస్పందనలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర అధికారులను ఆదేశించింది. రేపటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోబోమని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ కేఎం నటరాజ్ కోర్టుకు హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Peddi : పెద్దిపై మిక్డ్స్ టాక్.. కానీ ఆ ఒక్కదానికి అందరూ కనెక్ట్ అవ్వాల్సిందే
-
Kolar Tragedy: గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి.. చివరకు..!
-
Xiaomi TV FX Mini LED Series: షియోమి TV FX Mini LED సిరీస్ విడుదల.. Dolby Vision, Fire TV, 4K డిస్ప్లే
-
Hyderabad: అలర్ట్.. నగరంలో రెండు ఎబోలా కేసులు.. ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!