UP: ఒకే మైనర్ బాలుడిని ప్రేమించిన ఇద్దరు బాలికలు.. ముగ్గురూ కలిసి ఏం ప్లాన్ చేశారో చూడండి
- ముగ్గురు మైనర్ల మధ్య ప్రేమాయణం
- ముగ్గురూ కలిసి ఇంట్లో నుంచి పారిపోయిన వైనం
- ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో ఈ ఉదంతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముగ్గురు మైనర్ల మధ్య ప్రేమాయణం సాగించిన విచిత్రమైన ఉదంతం ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో వెలుగు చూసింది. వాస్తవానికి షాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు మైనర్ బాలికలు ఓ మైనర్ బాలుడితో కలిసి ఇంటి నుంచి పారిపోయారు. బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, వెలుగులోకి వచ్చిన విషయం విస్మయానికి గురిచేసింది. ఇద్దరు అమ్మాయిలు స్నేహితులు, వారు ఒకే అబ్బాయితో జీవించడానికి అంగీకరించారు.
ఒకే అబ్బాయిని ప్రేమించిన14 -15 ఏళ్ల ఇద్దరు బాలికలు..
14 -15 ఏళ్ల ఇద్దరు బాలికలు ఒకే అబ్బాయిని ప్రేమించి, అతనితో కలిసి ఇల్లు వదిలి వెళ్లేందుకు అంగీకరించారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం.. పాలు తీసుకొచ్చేందుకు ఇంటి నుంచి వెళ్లిన బాలిక సాయంత్రం వరకు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై ఆమె కోసం వెతకడం ప్రారంభించారు. విస్తృతంగా వెతికినా దొరకకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే ప్రాంతానికి చెందిన మరో బాలిక అదృశ్యమైనట్లు పోలీసుల విచారణలో తేలింది. పోలీసులు నిఘా, సీడీఆర్ ద్వారా దర్యాప్తు ప్రారంభించారు. బాలికలిద్దరూ 15 ఏళ్ల బాలుడితో పరారీలో ఉన్నారని తెలుసుకున్నారు.
Also Read
- YS Jagan: 'దిశ' లేకపోతే మహిళల భద్రత ఎలా?.. ‘మహిళలు, చిన్నారులకు ఇది చీకటి రోజు’
- Liquor Closed: మందుబాబులకు బ్యాడ్న్యూస్.. ఎల్లుండి వైన్స్ బంద్..
- Meta: ఆల్గోరిథం మార్చాల్సిందే.. మెటాకు నట్లు బిగిస్తున్న భారత్..
- Ajinkya Rahane New Innings: రిటైర్మెంట్ రోజే స్టీవ్ వా ఫోన్.. రహానే కెరీర్కు కొత్త మలుపు
లక్నో హోటల్లో గదిలో ..
బాలికలిద్దరూ మైనర్ అబ్బాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నారనే చర్చ సాగుతోంది. ముగ్గురూ కలిసి జీవించాలనుకున్నారు. దీంతో ముగ్గురూ తమ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా ఇంటి నుంచి పారిపోవాలని నిర్ణయించుకున్నారు. గత ఆదివారం, బీహార్లోని హతువాలోని ఓ హోటల్లో పోలీసులు ముగ్గురిని స్వాధీనం చేసుకుని సోమవారం వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ముగ్గురూ మొదట పారిపోయి లక్నో వెళ్లారు. ఎక్కడ చూసినా ఆధార్కార్డు అడగడంతో అక్కడ ఏ హోటల్లోనూ చోటు దొరకలేదు. విసుగు చెందిన ముగ్గురూ బీహార్ వెళ్లే రైలు ఎక్కి హతువా చేరుకున్నారు. అక్కడ ఓ హోటల్లో రూమ్ తీసుకున్నారు.
పోలీసులు ఏమంటున్నారు?
ఈ విషయమై కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించగా.. ముగ్గురి ఆచూకీ బీహార్లోని హతువా జిల్లాలోని ఓ హోటల్గా తేలిందని పోలీసులు చెబుతున్నారు. గోరఖ్పూర్ పోలీసులు బీహార్ పోలీసుల సహాయంతో ముగ్గురిని పట్టుకుని గోరఖ్పూర్కు తీసుకొచ్చారు. బాలికలిద్దరినీ వారి కుటుంబాలకు అప్పగించారు. మైనర్ నిందితుడైన బాలుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.
తాజావార్తలు
-
YS Jagan: ‘దిశ’ లేకపోతే మహిళల భద్రత ఎలా?.. ‘మహిళలు, చిన్నారులకు ఇది చీకటి రోజు’
-
Liquor Closed: మందుబాబులకు బ్యాడ్న్యూస్.. ఎల్లుండి వైన్స్ బంద్..
-
Meta: ఆల్గోరిథం మార్చాల్సిందే.. మెటాకు నట్లు బిగిస్తున్న భారత్..
-
Ajinkya Rahane New Innings: రిటైర్మెంట్ రోజే స్టీవ్ వా ఫోన్.. రహానే కెరీర్కు కొత్త మలుపు
-
Cricket Player: బోర్డును బురిడీ కొట్టించాలనుకున్నాడు.. చివరికి కెరీర్ క్లోజ్..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!