UP: ఒకే మైనర్ బాలుడిని ప్రేమించిన ఇద్దరు బాలికలు.. ముగ్గురూ కలిసి ఏం ప్లాన్ చేశారో చూడండి
- ముగ్గురు మైనర్ల మధ్య ప్రేమాయణం
- ముగ్గురూ కలిసి ఇంట్లో నుంచి పారిపోయిన వైనం
- ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో ఈ ఉదంతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముగ్గురు మైనర్ల మధ్య ప్రేమాయణం సాగించిన విచిత్రమైన ఉదంతం ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో వెలుగు చూసింది. వాస్తవానికి షాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు మైనర్ బాలికలు ఓ మైనర్ బాలుడితో కలిసి ఇంటి నుంచి పారిపోయారు. బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, వెలుగులోకి వచ్చిన విషయం విస్మయానికి గురిచేసింది. ఇద్దరు అమ్మాయిలు స్నేహితులు, వారు ఒకే అబ్బాయితో జీవించడానికి అంగీకరించారు.
ఒకే అబ్బాయిని ప్రేమించిన14 -15 ఏళ్ల ఇద్దరు బాలికలు..
14 -15 ఏళ్ల ఇద్దరు బాలికలు ఒకే అబ్బాయిని ప్రేమించి, అతనితో కలిసి ఇల్లు వదిలి వెళ్లేందుకు అంగీకరించారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం.. పాలు తీసుకొచ్చేందుకు ఇంటి నుంచి వెళ్లిన బాలిక సాయంత్రం వరకు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై ఆమె కోసం వెతకడం ప్రారంభించారు. విస్తృతంగా వెతికినా దొరకకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే ప్రాంతానికి చెందిన మరో బాలిక అదృశ్యమైనట్లు పోలీసుల విచారణలో తేలింది. పోలీసులు నిఘా, సీడీఆర్ ద్వారా దర్యాప్తు ప్రారంభించారు. బాలికలిద్దరూ 15 ఏళ్ల బాలుడితో పరారీలో ఉన్నారని తెలుసుకున్నారు.
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
లక్నో హోటల్లో గదిలో ..
బాలికలిద్దరూ మైనర్ అబ్బాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నారనే చర్చ సాగుతోంది. ముగ్గురూ కలిసి జీవించాలనుకున్నారు. దీంతో ముగ్గురూ తమ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా ఇంటి నుంచి పారిపోవాలని నిర్ణయించుకున్నారు. గత ఆదివారం, బీహార్లోని హతువాలోని ఓ హోటల్లో పోలీసులు ముగ్గురిని స్వాధీనం చేసుకుని సోమవారం వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ముగ్గురూ మొదట పారిపోయి లక్నో వెళ్లారు. ఎక్కడ చూసినా ఆధార్కార్డు అడగడంతో అక్కడ ఏ హోటల్లోనూ చోటు దొరకలేదు. విసుగు చెందిన ముగ్గురూ బీహార్ వెళ్లే రైలు ఎక్కి హతువా చేరుకున్నారు. అక్కడ ఓ హోటల్లో రూమ్ తీసుకున్నారు.
పోలీసులు ఏమంటున్నారు?
ఈ విషయమై కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించగా.. ముగ్గురి ఆచూకీ బీహార్లోని హతువా జిల్లాలోని ఓ హోటల్గా తేలిందని పోలీసులు చెబుతున్నారు. గోరఖ్పూర్ పోలీసులు బీహార్ పోలీసుల సహాయంతో ముగ్గురిని పట్టుకుని గోరఖ్పూర్కు తీసుకొచ్చారు. బాలికలిద్దరినీ వారి కుటుంబాలకు అప్పగించారు. మైనర్ నిందితుడైన బాలుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!