Amit Shah: “ఒకవేళ రాహుల్ గాంధీ ప్రధాని అయితే..” అమిత్ షా కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: రాహుల్ గాంధీ ప్రధాని అయితే దేశంలో స్కామ్లు, అవినీతి పెరుగుతుందని కేంద్ర హోంమంత్రి విమర్శించారు. నరేంద్రమోడీ మళ్లీ అధికారంలోకి వస్తే మోసగాళ్లంతా కటకటాల పాలవుతారని శుక్రవారం అన్నారు. గతేడాది ఉదయ్పూర్లో జరిగిన కన్హయ్య లాల్ హత్య కేసులో ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసి ఉంటే, ఈలోగా నిందితులకు ఉరిశిక్ష పడి ఉండేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. అవినీతిలో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం మొదటి స్థానంలో ఉందని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారానికి దూరంగా ఉంచాలని ప్రజలకు పిలునిచ్చారు.
రాబోయే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 300 కన్నా ఎక్కువ సీట్లు సాధించి అధికారంలోకి వస్తామని, మోడీ మరోసారి ప్రధాని అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గత తొమ్మిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలను వివరిస్తూ ఉదయ్పూర్లో జరిగిన బహిరంగ సభలో షా మాట్లాడారు. విపక్షాలు కొడుకుల భవిష్యత్తు కోసం పోరాడుతున్నాయని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే సోనియా గాంధీ లక్ష్యమని, తన కుమారుడు తేజస్వి యాదవ్ను ప్రధాని చేయడమే లాలూయాదవ్ లక్ష్యమని, మేనల్లుడు అభిషేక్ను ముఖ్యమంత్రిని చేయడమే మమతా బెనర్జీ లక్ష్యమని, అలాగే అశోక్ గెహ్లాట్ తన కొడుకు వైభవ్ను సీఎం చేయాలని భావిస్తున్నారంటూ అమిత్ షా విమర్శించారు.
Also Read
- Sugar Price Hike: పండుగల వేళ చక్కెర ధరకు రెక్కలు.. తాజాగా ఎంత పెరిగిందంటే..!
- IRCTC: తత్కాల్ టికెట్ దొరకలేదని బాధపడొద్దు.. మీకు ఈ ఆప్షన్ ఉందని తెలుసా!
- Punjab Politics: నిన్న బాదల్, నేడు రాఘవ్ చద్దాలతో ప్రధాని మోడీ భేటీ.. రసవత్తరంగా పంజాబ్ పాలిటిక్స్..
- Renu Dhariyal: అయ్ బాబోయ్ ఎంతపొడుగో.. జుట్టు పెంచుకుంటూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టేసిన మహిళ..
Read Also: Rajasthan: పాము పగబట్టిందా.. 5 రోజుల వ్యవధిలో రెండుసార్లు కాటు.. రెండోసారి..
రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలను చేస్తోందని, కన్హయ్యలాల్ హత్య కేసులో దోషులకు శిక్ష ఆలస్యం కావడానికి కాంగ్రెస్ కారణమని అన్నారు. మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తర్వాత ఆమెకు సపోర్టుగా సోషల్ మీడియా పోస్టు చేసినందుకు కన్హయ్యలాల్ ను కిరాతకంగా చంపేశారు. రాజస్థాన్లో కాంగ్రెస్ పాలనలో మెజారిటీ వర్గీయులు దోపిడీకి గురవుతున్నారని అమిత్ షా ఆరోపించారు.
కేంద్రం పీఎఫ్ఐని నిషేధిస్తే.. అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం పాలనలో పీఎఫ్ఐ ర్యాలీ జరిగింది. కరౌలీలో హిందూ పండుగను నిలిపివేశారని, అల్వార్ లో 300 ఏళ్ల నాటి శివాలయాన్ని కూల్చేశారని ఆరోపించారు. ప్రభుత్వం గట్టిగా వాదించకపోవడంతో 2008 నాటి జైపూర్ బాంబు పేలుళ్ల కేసు నిందితులను రాజస్థాన్ హైకోర్టు నిర్దోషులుగా విడుదలయ్యారని అన్నారు. 2014 ముందు పాకిస్తాన్ నుంచి వచ్చే ఉగ్రవాదులు దాడులకు పాల్పడే వారని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని, సర్జికల్ స్ట్రైక్స్ తో సమాధానం చెప్పారని అన్నారు.
తాజావార్తలు
-
Sugar Price Hike: పండుగల వేళ చక్కెర ధరకు రెక్కలు.. తాజాగా ఎంత పెరిగిందంటే..!
-
Vijaya Dairy Chairman Post: విజయ డైరీ ఛైర్మన్ ఎంపికకు బ్రేక్.. వారం రోజులు వాయిదా..
-
North Korea: కిమ్ జోంగ్ ఉన్ ఎక్కడ? రెండు నెలలుగా కనిపించని ఉత్తర కొరియా అధినేత
-
Medico Priyanka : కిమ్స్లో కూతురు మృత్యుపోరాటం.. తండ్రి కన్నీటి వేడుకోలు.!
-
Mrunal Thakur-Yashasvi Jaiswal Dating: యశస్వితో రిలేషన్షిప్.. మృణాల్ ఠాకూర్ కామెంట్స్ వైరల్.. నిజమెంత?
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!