Siddaramaiah: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలను తప్పికొడతాం
- కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలను తప్పికొడతాం
- గవర్నర్ విచారణకు ఆదేశించడంపై సిద్ధరామయ్య ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) కుంభకోణం ప్రస్తుతం కర్ణాటకను కుదిపేస్తోంది. ఈ కేసులో ఏకంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను విచారించేందు రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ అనుమతి మంజూరు చేశారు. దీంతో సీఎంకు రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం సీఎం సిద్ధరామయ్య అత్యవసర కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు.
ఇది కూాడా చదవండి: Rakshit Shetty: కాపీరైట్ కేసు.. రక్షిత్ శెట్టికి ఢిల్లీ హైకోర్టు షాక్
Also Read
అనంతరం సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడారు. గవర్నర్ నిర్ణయానికి వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. విజయనగరలో అక్రమంగా భూములు కేటాయించలేదన్నారు. గవర్నర్ విచారణకు ఆదేశించడంపై కేబినెట్ భేటీలో చర్చించామని… గవర్నర్ కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా పని చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రం చెప్పినట్లుగా గవర్నర్ నడుచుకుంటున్నారని ధ్వజమెత్తారు. గవర్నర్ వ్యవహార శైలిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కేబినెట్, పార్టీ అధిష్ఠానం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అంతా తనకు అండగా ఉన్నారని సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు.
గవర్నర్ తన సెక్రటరీ ద్వారా రాజ్యాంగ విరుద్ధమైన లేఖను పంపారని డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ ఆరోపించారు. ఈ రాష్ట్రం, కాంగ్రెస్ పార్టీ సిద్ధరామయ్యకు అండగా ఉందన్నారు. అసలు కేసే లేని చోట వివాదం చేస్తున్నారని ధ్వజమెత్తారు. దీనిపై మేం న్యాయపరంగా ముందుకు వెళ్తామని.. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి రాజకీయంగా పోరాడతామని శివకుమార్ మీడియాతో అన్నారు.
ఇది కూాడా చదవండి: Milind Deora: కాంగ్రెస్ ఎప్పటికీ ఉద్ధవ్ ఠాక్రేని ముఖ్యమంత్రి చేయదు..
ముడా కుంభకోణంలో సిద్ధూ సతీమణి పార్వతితో పాటు మరికొందరి ప్రమేయం ఉందని ఆరోపిస్తూ సామాజిక కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముడా భూకేటాయింపుల్లో జరిగిన అవకతవకల్లో పార్వతి హస్తం ఉందని బీజేపీ ఆరోపణలు చేస్తోంది. దీనిపై గతంలో సిద్ధరామయ్య మాట్లాడుతూ.. తనకు, తన రాష్ట్రానికి వ్యతిరేకంగా కమలం పార్టీ కుట్ర పన్నిందని ఆరోపించారు. తమ భూమినే ముడా తీసుకుందన్నారు. తన సతీమణి పరిహారానికి అర్హురాలని అన్నారు. 2014లో తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆమె పరిహారం కోసం దరఖాస్తు చేసుకుందని గుర్తు చేశారు. అయితే తాను సీఎంగా ఉన్నంతకాలం ఆ పరిహారం ఇవ్వడం కుదరదని చెప్పానన్నారు. దాంతో 2021లో మరో దరఖాస్తు చేసుకోగా.. అప్పటి బీజేపీ ప్రభుత్వం విజయనగరలో భూమి కేటాయించిందని వెల్లడించారు.
#WATCH | On Governor granting permission to prosecute him in the alleged MUDA scam, Karnataka CM Siddaramaiah says, "…Illegal sanction has been given by the Governor. He (Governor) has acted according to the direction of Government of India." pic.twitter.com/qHSZCsqLgO
— ANI (@ANI) August 17, 2024
తాజావార్తలు
-
PM Modi: పొదుపు వేళ మోడీకి సినీ వర్కర్స్ అసోసియేషన్ లేఖ.. ఏముందంటే..!
-
CM Revanth Reddy : బండి భగీరథ్ అరెస్ట్ పై సీఎం రేవంత్ రియాక్షన్..
-
RG Kar Case: ఆర్జీకర్ కేసులో ట్విస్ట్.. మళ్లీ దర్యాప్తుకు హైకోర్టు ఆదేశం
-
GT vs CSK: టాస్ గెలిచిన రుతురాజ్ గైక్వాడ్.. గిల్ సేనకు మొదట బ్యాటింగ్ సవాల్..
-
Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో అత్త గారికి ప్రభుత్వం షాక్.. కీలక పదవి నుంచి తొలగింపు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!