Indigo Flight: 39 వేల అడుగుల ఎత్తులో సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు
- విమానం గాల్లో ఉండగా ప్రయాణికుడికి అస్వస్థత
- సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన మల్లారెడ్డి కోడలు
- ప్రశంసలు కురిపించిన సహచర ప్రయాణికులు, సిబ్బంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైద్యులు.. దేవుడితో సమానం అంటారు. దేవుడు మనిషిని చేస్తే.. వైద్యం చేసి ప్రాణాలు నిలబెట్టేది డాక్టర్లు. అందుకే రోగులు.. వైద్యులకు దండాలు పెడతారు. దేవుడితో సమానంగా చూస్తారు కాబట్టే.. అంతగా వారిని గౌరవిస్తారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా? అయితే ఈ వార్త చదవాల్సిందే.
ఇది కూడా చదవండి: Student Kills Classmate: తమిళనాడులో పెన్సిల్ గొడవ.. విద్యార్థిని కొడవలితో నరికి చంపిన మరో స్టూడెంట్
Also Read
- Sonam Wangchuk: 'నేను ఇంకా బ్రతికే ఉన్నాను'.. ఆస్పత్రి బెడ్పై నుంచి సోనమ్ వాంగ్చుక్ భావోద్వేగ సందేశం
- Dharmendra Pradhan: విదేశీ విద్యపై ఆన్లైన్ ట్రోలింగ్.. ధర్మేంద్ర ప్రధాన్ కుమార్తె ఇన్స్టాగ్రామ్ ఖాతా డీయాక్టివేట్..!
- Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
ఇండిగో విమానం ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వస్తోంది. విమానం 39 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోంది. ఇంతలో ఒక వృద్ధ ప్రయాణికుడు (74) తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. మూర్ఛపోయి.. నోట్లో నుంచి ద్రవం కారుతూ తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. అదే విమానంలో తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు.. డాక్టర్ ప్రీతి రెడ్డి ప్రయాణిస్తున్నారు. విషయం గమనించిన ఆమె.. వెంటనే బాధితుడి దగ్గరకు వెళ్లి పరీక్షింపగా.. బీపీ తక్కువగా ఉందని నిర్ధారణకు వచ్చి సీపీఆర్ చేశారు. వెంటనే వృద్ధుడు తేరుకున్నాడు. ఆరోగ్యం వెంటనే కుదిటపడింది. దీంతో ప్రయాణికులు, విమాన సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఇక డాక్టర్ ప్రీతి రెడ్డి చేసిన తెగువకు సహచర ప్రయాణికులు, సిబ్బంది ప్రశంసించారు. ఇక విమానం శంషాబాద్ ఎయిర్పోర్టులో ల్యాండ్ కాగానే ఎయిర్పోర్టు సిబ్బంది వృద్ధుడిని ఆస్పత్రికి తరలించారు. గత శనివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Prem Nazir : ఒకే హీరోయిన్తో 130 సినిమాలు చేసిన ఏకైక హీరో ..
ప్రీతిరెడ్డి… మల్లారెడ్డి విద్యా సంస్థల ద్వారా వైద్య విద్యా రంగంలో చేసిన సేవలకు గాను ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ 2024 అవార్డుతో సత్కరించబడ్డారు. ప్రీతి రెడ్డి ప్రస్తుతం మల్లారెడ్డి హెల్త్ సిటీ వైస్ ఛైర్మన్గా ఉన్నారు. వైద్య విద్యారంగంలో మంచి ఆరోగ్యం అందించడంలో ఆమె తనదైన ముద్రను వేసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు కూడా ప్రశంసిస్తున్నారు.
తాజావార్తలు
-
Vaibhav Suryavanshi: హరారేలో వైభవ్ ట్రాక్ రికార్డు ఇదే.. జింబాబ్వేకు కూడా దబిడిదిబిడే!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Mani Ratnam Movie: మణిరత్నం మూవీకి కౌంట్డౌన్.. జూలై 23 నుంచే విజయ్ సేతుపతి, సాయి పల్లవి షూటింగ్!
-
KorianKanakaRaju : భారీ ధర పలికిన ‘కొరియన్ కనకరాజ్’ ఓటీటీ రైట్స్.. షాకిస్తున్న థియేట్రికల్ బిజినెస్
-
New Bajaj Pulsar 125 and 150: బజాజ్ నుంచి కొత్త 125cc, 150cc పల్సర్ బైక్లు.. విడుదల ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!