UP: హనీమూన్ మర్డర్ భయంతో ప్రియుడితో ఉండేందుకు భార్యకు అనుమతిచ్చిన భర్త
- హనీమూన్ మర్డర్ భయంతో వణికిన భర్త
- ప్రియుడితో ఉండేందుకు భార్యకు అనుమితిచ్చిన భర్త
- ఉత్తరప్రదేశ్లో వెలుగులోకి వచ్చిన ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హనీమూన్ మర్డర్ కేసు తర్వాత మగాళ్లలో భయం మొదలైంది. హనీమూన్ పేరుతో భర్తను మేఘాలయకు తీసుకెళ్లి సోనమ్ రఘువంశీ అనే నవవధువు చంపేసింది. ఈ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. ఆమెను ఆదర్శంగా తీసుకున్నారో.. ఏమో తెలియదు గానీ.. చాలా మంది ఇల్లాల్లు.. ప్రియుడితో సుఖం కోసం కట్టుకున్నవాళ్లనే కాటికి పంపేస్తున్నారు. ఇలాంటి ఘటనలు దేశ వ్యాప్తంగా ఎక్కడొక చోట జరుగుతూనే ఉంటున్నాయి. తాజాగా హనీమూన్ మర్డర్ కేసు భయంతో ఒక భర్త.. ప్రియుడితోనే సుఖం జీవించాలని రాతపూర్వకంగా భార్యకు పర్మిషన్ ఇచ్చేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: PM Modi: నేటి నుంచి 2 దేశాల్లో పర్యటించనున్న మోడీ
Also Read
- Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
- Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
- House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
- Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్చుక్ ఆవేదన
రామ్చరణ్(47), జానకీదేవి(40) భార్యాభర్తలు. ఉత్తర్ప్రదేశ్లోని కేరి జిల్లా పర్సాముర్తా గ్రామంలో నివాసం ఉంటున్నారు. వీరికి నలుగురు సంతానం. ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇక రామ్చరణ్ ముంబైలో టైల్స్ కార్మికుడిగా పని చేస్తున్నాడు. జానకీదేవి గ్రామంలోనే పిల్లలతో ఉంటోంది. భర్తేమో ముంబైలో.. జానకీదేవి గ్రామంలో ఉంటుంది. ఈ క్రమంలో నాలుగేళ్ల క్రితం సోను ప్రజాపతి(24) అనే యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. కుటుంబానికి వేరుగా జానకీదేవి, సోను ప్రజాపతి ఏడు నెలలుగా వేరే ఇంట్లో ఉంటున్నారు. విషయం తెలుసుకున్న రామ్చరణ్.. భార్యను నిలదీయగా క్షమాపణ చెప్పి భర్త దగ్గరకు వచ్చేసింది. అంతా సర్దుకునేలోపే తిరిగి జానకి.. ప్రియుడి దగ్గరకు వెళ్లిపోయింది. కొన్ని నెలల నుంచి భర్త, పిల్లలకు దూరంగా ప్రియుడితోనే జీవిస్తోంది.
ఇది కూడా చదవండి: HHVM : ఆ మూవీ నన్ను రాజకీయాల్లో నిలబెట్టింది : పవన్
దీంతో తన భార్య జానకి కనిపించడం లేదంటూ పోలీసులకు రామ్చరణ్ ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంతలోనే రామ్చరణ్ మనసు మార్చుకున్నాడు. తన భార్య చేతిలో చచ్చేకంటే.. ప్రశాంతంగా జీవించడం బెటర్ అనుకున్నాడు. దీంతో ఈనెల 20న కేసును వెనక్కి తీసుకున్నాడు. తన భార్య ప్రియుడు సోనుతో ఉండటం తనకు ఇష్టమేనని, ఇకపై ఆమెతో తనకు ఎలాంటి సంబంధం లేదని రాతపూర్వక ఒప్పంద పత్రాన్ని పోలీస్ స్టేషన్లో సమర్పించాడు. తనను ఏమైనా చేస్తుందన్న భయంగా ఉందని.. ఇకపై ఆమెతో కలిసి ఉండలేనని రామ్చరణ్ పేర్కొ్న్నాడు.
తాజావార్తలు
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
RC17 – Rukmini Vasanth: చరణ్ – సుకుమార్ సినిమాలో కాంతర హీరోయిన్!
-
Ajinkya Rahane: ఎంఎస్ ధోనీ రూమ్కు రూల్.. తలుపు మూసి ఉంటే అంతే సంగతులు!
-
Dorothy Official Teaser : ‘డొరోతి’ టైటిల్ టీజర్.. దటీజ్ కార్తీక్ సుబ్బరాజ్
-
Engineering College fees: “అక్షరాలను అమ్ముకుంటున్న భకాసురులు”.. ఇంజినీరింగ్ కాలేజీల్లో అదనపు వసూళ్ల పర్వం!
ట్రెండింగ్
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!