UP: హనీమూన్ మర్డర్ భయంతో ప్రియుడితో ఉండేందుకు భార్యకు అనుమతిచ్చిన భర్త
- హనీమూన్ మర్డర్ భయంతో వణికిన భర్త
- ప్రియుడితో ఉండేందుకు భార్యకు అనుమితిచ్చిన భర్త
- ఉత్తరప్రదేశ్లో వెలుగులోకి వచ్చిన ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హనీమూన్ మర్డర్ కేసు తర్వాత మగాళ్లలో భయం మొదలైంది. హనీమూన్ పేరుతో భర్తను మేఘాలయకు తీసుకెళ్లి సోనమ్ రఘువంశీ అనే నవవధువు చంపేసింది. ఈ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. ఆమెను ఆదర్శంగా తీసుకున్నారో.. ఏమో తెలియదు గానీ.. చాలా మంది ఇల్లాల్లు.. ప్రియుడితో సుఖం కోసం కట్టుకున్నవాళ్లనే కాటికి పంపేస్తున్నారు. ఇలాంటి ఘటనలు దేశ వ్యాప్తంగా ఎక్కడొక చోట జరుగుతూనే ఉంటున్నాయి. తాజాగా హనీమూన్ మర్డర్ కేసు భయంతో ఒక భర్త.. ప్రియుడితోనే సుఖం జీవించాలని రాతపూర్వకంగా భార్యకు పర్మిషన్ ఇచ్చేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: PM Modi: నేటి నుంచి 2 దేశాల్లో పర్యటించనున్న మోడీ
Also Read
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
- Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
రామ్చరణ్(47), జానకీదేవి(40) భార్యాభర్తలు. ఉత్తర్ప్రదేశ్లోని కేరి జిల్లా పర్సాముర్తా గ్రామంలో నివాసం ఉంటున్నారు. వీరికి నలుగురు సంతానం. ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇక రామ్చరణ్ ముంబైలో టైల్స్ కార్మికుడిగా పని చేస్తున్నాడు. జానకీదేవి గ్రామంలోనే పిల్లలతో ఉంటోంది. భర్తేమో ముంబైలో.. జానకీదేవి గ్రామంలో ఉంటుంది. ఈ క్రమంలో నాలుగేళ్ల క్రితం సోను ప్రజాపతి(24) అనే యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. కుటుంబానికి వేరుగా జానకీదేవి, సోను ప్రజాపతి ఏడు నెలలుగా వేరే ఇంట్లో ఉంటున్నారు. విషయం తెలుసుకున్న రామ్చరణ్.. భార్యను నిలదీయగా క్షమాపణ చెప్పి భర్త దగ్గరకు వచ్చేసింది. అంతా సర్దుకునేలోపే తిరిగి జానకి.. ప్రియుడి దగ్గరకు వెళ్లిపోయింది. కొన్ని నెలల నుంచి భర్త, పిల్లలకు దూరంగా ప్రియుడితోనే జీవిస్తోంది.
ఇది కూడా చదవండి: HHVM : ఆ మూవీ నన్ను రాజకీయాల్లో నిలబెట్టింది : పవన్
దీంతో తన భార్య జానకి కనిపించడం లేదంటూ పోలీసులకు రామ్చరణ్ ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంతలోనే రామ్చరణ్ మనసు మార్చుకున్నాడు. తన భార్య చేతిలో చచ్చేకంటే.. ప్రశాంతంగా జీవించడం బెటర్ అనుకున్నాడు. దీంతో ఈనెల 20న కేసును వెనక్కి తీసుకున్నాడు. తన భార్య ప్రియుడు సోనుతో ఉండటం తనకు ఇష్టమేనని, ఇకపై ఆమెతో తనకు ఎలాంటి సంబంధం లేదని రాతపూర్వక ఒప్పంద పత్రాన్ని పోలీస్ స్టేషన్లో సమర్పించాడు. తనను ఏమైనా చేస్తుందన్న భయంగా ఉందని.. ఇకపై ఆమెతో కలిసి ఉండలేనని రామ్చరణ్ పేర్కొ్న్నాడు.
తాజావార్తలు
-
Vivo X Fold 6: 200MP కెమెరా, 7000mAh బ్యాటరీతో వివో ఎక్స్ ఫోల్డ్ 6 విడుదల.. ఫోల్డబుల్ ఫోన్లలో కొత్త బెంచ్మార్క్
-
TTD: రామ మందిరం విరాళాల వివాదం ఎఫెక్ట్.. టీటీడీ ఖాతాలకు టెక్నాలజీ అప్గ్రేడ్.! ఖాతాలకు టెక్నాలజీ అప్గ్రేడ్..
-
CM Chandrababu Markapuram Tour: రూ.300 కోట్ల పరిహారం పంపిణీకి సీఎం.. మార్కాపురం జిల్లాలో నేడు విస్తృత పర్యటన
-
Maa Inti Bangaram: వైజాగ్ సక్సెస్ మీట్లో బిగ్ సర్ప్రైజ్.. ‘మా ఇంటి బంగారం 2’ అధికారికంగా ప్రకటించిన రాజ్
-
US Airstrikes on Iran: మధ్యప్రాచ్యంలో మళ్లీ యుద్ధ మేఘాలు.. ఇరాన్పై అమెరికా వైమానిక దాడులు
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!