Maha kumbh Mela: మహా కుంభమేళా ఆదాయం రూ. 2 లక్షల కోట్లు..!
- ఉత్తర్ ప్రదేశ్ని ఆర్థికంగా బలపరుస్తున్న ‘‘మహా కుంభమేళా’’..
- ఏకంగా రూ. 2 లక్షల కోట్ల ఆదాయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maha kumbh Mela: హిందువులకు అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం ‘‘మహా కుంభమేళా’’ అట్టహాసంగా ప్రారంభమైంది. ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న ఈ కుంభమేళాకు యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ కార్యక్రమానికి దాదాపుగా 40 కోట్ల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. నెల రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం ప్రపంచంలోనే అతిపెద్ద సమావేశంగా పరిగణించబడుతుంది. ఇది స్థానికంగా వాణిజ్యం, పర్యాటకం, ఉపాధిని గణనీయంగా ప్రోత్సహిస్తుంది.
ఈ కుంభమేళా ద్వారా దాదాపుగా రూ. 2 లక్షల కోట్ల విలువైన వాణిజ్యం జరుగుతుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) అంచనా వేసింది. ఈ ఆర్థిక వృద్ధికి వసతి, స్థానిక హోటల్లు, గెస్ట్ హౌజులు, తాత్కాలిక బస ఏర్పాట్ల ద్వారా రూ. 40,000 కోట్లు ఆర్జించే అవకాశం ఉందని చెప్పింది. మతపరమైన కార్యక్రమాల కోసం ఒక్కో వ్యక్తి కనీసం రూ. 5000 ఖర్చు పెడతారని అంచనా. ఇలా మొత్తం ఖర్చు రూ. 2 లక్షల కోట్లకు మించి ఉంటుందని పేర్కొంది. హోటల్లు, వసతి సౌకర్యాలతో పాటు ఫుడ్, మతపరమైన వస్తువులు, ఆరోగ్య సంరక్షణ, ఇతర సేవలు ఈ ఆదయానికి ఊతమిస్తాయని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Also Read
- Mamata Banerjee: మమతా బెనర్జీకి మరో షాక్.. సుఖేందు శేఖర్ రాయ్ టీఎంసీని వీడి రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా
- Relationship Controversy: అందానికి ముగ్ధుడై పిల్లనిచ్చిన అత్తతో ప్రేమలో పడ్డ అల్లుడు.. లేచిపోయి వివాహం
- INDIA Alliance Meeting: విజయ్ పార్టీకి ఊహించని పరిణామం.. టీవీకేను పక్కన పెట్టిన ఇండియా కూటమి?
- Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
Read Also: Oscar Nominations: కార్చిచ్చు ఎఫెక్ట్.. ఆస్కార్ నామినేషన్లు మరోసారి వాయిదా
ప్యాకేజ్డ్ ఫుడ్స్, వాటర్, బిస్కెట్లు, జ్యూస్లు, మీల్స్తో సహా ఫుడ్ అండ్ బేవరేజెస్ రంగం మొత్తం వాణిజ్యానికి రూ.20,000 కోట్లు జోడించగలదని అంచనా. నూనె, దీపాలు, గంగా జలం, మతపరమైన పుస్తకాలు మరో రూ. 20,000 కోట్లను ఆర్జిస్తాయి. టూర్ గైడ్లు, ట్రావెల్ ప్యాకేజీలు, సంబంధిత కార్యకలాపాలు వంటి పర్యాటక సేవలు మరో రూ. 10,000 కోట్లను అందించే అవకాశం ఉంది.
తాత్కాలిక వైద్య శిబిరాలు, ఆయుర్వేద ఉత్పత్తులు మరియు మందులు రూ. 3,000 కోట్ల ఆదాయాన్ని తీసుకురావచ్చు, ఇ-టికెటింగ్, డిజిటల్ చెల్లింపులు, వై-ఫై సేవలు, మొబైల్ ఛార్జింగ్ స్టేషన్లు వంటి రంగాలలో రూ. 1,000 కోట్ల విలువైన వ్యాపారం జరుగుతుందని అంచనా. ప్రకటనలు మరియు ప్రచార కార్యకలాపాలు సహా వినోదం, మీడియా 10,000 కోట్ల రూపాయల వాణిజ్యాన్ని ఆర్జిస్తాయని అంచనా. స్థానిక ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడానికి ఉత్తర్ ప్రదేశ్ ఈ మహా కుంభమేళా ప్రాముఖ్యాన్ని హైలెట్ చేసింది. దేశవ్యాప్తంగా భక్తులను ఆకర్షించింది.
తాజావార్తలు
-
Jasprit Bumrah: ఐపీఎల్ పూర్తి సీజన్ ఆడుతాడు, భారత్ మ్యాచ్లు మాత్రం ఆడడా.. బుమ్రాపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
ATM Withdrawals: ఏటీఎం నుంచి డబ్బు తీసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది!
-
Vivo X Fold 6: ఏఐ ఫీచర్లు, న్యూ యూజర్ ఇంటర్ఫేస్తో.. వివో ఎక్స్ ఫోల్డ్ 6 త్వరలో విడుదల
-
Kangana Ranaut : నర్స్లను గ్లామర్ వృత్తిగా మార్చేశారు… డ్రెస్ కోడ్పై కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్
-
Kishan Reddy: బొగ్గు ఉత్పత్తిలో భారత్ కొత్త రికార్డు.. మోదీ సంస్కరణలే ఈ ఫలితం.!
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!