Maha kumbh Mela: మహా కుంభమేళా ఆదాయం రూ. 2 లక్షల కోట్లు..!
- ఉత్తర్ ప్రదేశ్ని ఆర్థికంగా బలపరుస్తున్న ‘‘మహా కుంభమేళా’’..
- ఏకంగా రూ. 2 లక్షల కోట్ల ఆదాయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maha kumbh Mela: హిందువులకు అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం ‘‘మహా కుంభమేళా’’ అట్టహాసంగా ప్రారంభమైంది. ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న ఈ కుంభమేళాకు యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ కార్యక్రమానికి దాదాపుగా 40 కోట్ల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. నెల రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం ప్రపంచంలోనే అతిపెద్ద సమావేశంగా పరిగణించబడుతుంది. ఇది స్థానికంగా వాణిజ్యం, పర్యాటకం, ఉపాధిని గణనీయంగా ప్రోత్సహిస్తుంది.
ఈ కుంభమేళా ద్వారా దాదాపుగా రూ. 2 లక్షల కోట్ల విలువైన వాణిజ్యం జరుగుతుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) అంచనా వేసింది. ఈ ఆర్థిక వృద్ధికి వసతి, స్థానిక హోటల్లు, గెస్ట్ హౌజులు, తాత్కాలిక బస ఏర్పాట్ల ద్వారా రూ. 40,000 కోట్లు ఆర్జించే అవకాశం ఉందని చెప్పింది. మతపరమైన కార్యక్రమాల కోసం ఒక్కో వ్యక్తి కనీసం రూ. 5000 ఖర్చు పెడతారని అంచనా. ఇలా మొత్తం ఖర్చు రూ. 2 లక్షల కోట్లకు మించి ఉంటుందని పేర్కొంది. హోటల్లు, వసతి సౌకర్యాలతో పాటు ఫుడ్, మతపరమైన వస్తువులు, ఆరోగ్య సంరక్షణ, ఇతర సేవలు ఈ ఆదయానికి ఊతమిస్తాయని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
- Kamal Haasan: పొదుపు మంత్రంపై కమల్హాసన్ కీలక వ్యాఖ్యలు
- 1991 India Gold Crisis: రాత్రికి రాత్రి బ్రిటన్కు 47,000 కిలోల బంగారం తరలింపు.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే!
Read Also: Oscar Nominations: కార్చిచ్చు ఎఫెక్ట్.. ఆస్కార్ నామినేషన్లు మరోసారి వాయిదా
ప్యాకేజ్డ్ ఫుడ్స్, వాటర్, బిస్కెట్లు, జ్యూస్లు, మీల్స్తో సహా ఫుడ్ అండ్ బేవరేజెస్ రంగం మొత్తం వాణిజ్యానికి రూ.20,000 కోట్లు జోడించగలదని అంచనా. నూనె, దీపాలు, గంగా జలం, మతపరమైన పుస్తకాలు మరో రూ. 20,000 కోట్లను ఆర్జిస్తాయి. టూర్ గైడ్లు, ట్రావెల్ ప్యాకేజీలు, సంబంధిత కార్యకలాపాలు వంటి పర్యాటక సేవలు మరో రూ. 10,000 కోట్లను అందించే అవకాశం ఉంది.
తాత్కాలిక వైద్య శిబిరాలు, ఆయుర్వేద ఉత్పత్తులు మరియు మందులు రూ. 3,000 కోట్ల ఆదాయాన్ని తీసుకురావచ్చు, ఇ-టికెటింగ్, డిజిటల్ చెల్లింపులు, వై-ఫై సేవలు, మొబైల్ ఛార్జింగ్ స్టేషన్లు వంటి రంగాలలో రూ. 1,000 కోట్ల విలువైన వ్యాపారం జరుగుతుందని అంచనా. ప్రకటనలు మరియు ప్రచార కార్యకలాపాలు సహా వినోదం, మీడియా 10,000 కోట్ల రూపాయల వాణిజ్యాన్ని ఆర్జిస్తాయని అంచనా. స్థానిక ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడానికి ఉత్తర్ ప్రదేశ్ ఈ మహా కుంభమేళా ప్రాముఖ్యాన్ని హైలెట్ చేసింది. దేశవ్యాప్తంగా భక్తులను ఆకర్షించింది.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..