Maha kumbh Mela: మహా కుంభమేళా ఆదాయం రూ. 2 లక్షల కోట్లు..!
- ఉత్తర్ ప్రదేశ్ని ఆర్థికంగా బలపరుస్తున్న ‘‘మహా కుంభమేళా’’..
- ఏకంగా రూ. 2 లక్షల కోట్ల ఆదాయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maha kumbh Mela: హిందువులకు అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం ‘‘మహా కుంభమేళా’’ అట్టహాసంగా ప్రారంభమైంది. ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న ఈ కుంభమేళాకు యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ కార్యక్రమానికి దాదాపుగా 40 కోట్ల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. నెల రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం ప్రపంచంలోనే అతిపెద్ద సమావేశంగా పరిగణించబడుతుంది. ఇది స్థానికంగా వాణిజ్యం, పర్యాటకం, ఉపాధిని గణనీయంగా ప్రోత్సహిస్తుంది.
ఈ కుంభమేళా ద్వారా దాదాపుగా రూ. 2 లక్షల కోట్ల విలువైన వాణిజ్యం జరుగుతుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) అంచనా వేసింది. ఈ ఆర్థిక వృద్ధికి వసతి, స్థానిక హోటల్లు, గెస్ట్ హౌజులు, తాత్కాలిక బస ఏర్పాట్ల ద్వారా రూ. 40,000 కోట్లు ఆర్జించే అవకాశం ఉందని చెప్పింది. మతపరమైన కార్యక్రమాల కోసం ఒక్కో వ్యక్తి కనీసం రూ. 5000 ఖర్చు పెడతారని అంచనా. ఇలా మొత్తం ఖర్చు రూ. 2 లక్షల కోట్లకు మించి ఉంటుందని పేర్కొంది. హోటల్లు, వసతి సౌకర్యాలతో పాటు ఫుడ్, మతపరమైన వస్తువులు, ఆరోగ్య సంరక్షణ, ఇతర సేవలు ఈ ఆదయానికి ఊతమిస్తాయని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Also Read
- Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
- Geetanjali Angmo: సుప్రీంకోర్టు మెట్లెక్కిన సోనమ్ వాంగ్చుక్ భార్య.. హైకోర్టు తీర్పుపై సవాల్!
- Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్ను ఆస్పత్రికి తరలించడం సరైనదే: ఢిల్లీ హైకోర్టు
- Congress: డీలిమిటేషన్కు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా? క్లారిటీ ఇచ్చిన జైరాం రమేష్.
Read Also: Oscar Nominations: కార్చిచ్చు ఎఫెక్ట్.. ఆస్కార్ నామినేషన్లు మరోసారి వాయిదా
ప్యాకేజ్డ్ ఫుడ్స్, వాటర్, బిస్కెట్లు, జ్యూస్లు, మీల్స్తో సహా ఫుడ్ అండ్ బేవరేజెస్ రంగం మొత్తం వాణిజ్యానికి రూ.20,000 కోట్లు జోడించగలదని అంచనా. నూనె, దీపాలు, గంగా జలం, మతపరమైన పుస్తకాలు మరో రూ. 20,000 కోట్లను ఆర్జిస్తాయి. టూర్ గైడ్లు, ట్రావెల్ ప్యాకేజీలు, సంబంధిత కార్యకలాపాలు వంటి పర్యాటక సేవలు మరో రూ. 10,000 కోట్లను అందించే అవకాశం ఉంది.
తాత్కాలిక వైద్య శిబిరాలు, ఆయుర్వేద ఉత్పత్తులు మరియు మందులు రూ. 3,000 కోట్ల ఆదాయాన్ని తీసుకురావచ్చు, ఇ-టికెటింగ్, డిజిటల్ చెల్లింపులు, వై-ఫై సేవలు, మొబైల్ ఛార్జింగ్ స్టేషన్లు వంటి రంగాలలో రూ. 1,000 కోట్ల విలువైన వ్యాపారం జరుగుతుందని అంచనా. ప్రకటనలు మరియు ప్రచార కార్యకలాపాలు సహా వినోదం, మీడియా 10,000 కోట్ల రూపాయల వాణిజ్యాన్ని ఆర్జిస్తాయని అంచనా. స్థానిక ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడానికి ఉత్తర్ ప్రదేశ్ ఈ మహా కుంభమేళా ప్రాముఖ్యాన్ని హైలెట్ చేసింది. దేశవ్యాప్తంగా భక్తులను ఆకర్షించింది.
తాజావార్తలు
-
Missing Girls: హైదరాబాద్లో ముగ్గురు మైనర్ బాలికలు అదృశ్యం
-
Jagga Reddy : కేటీఆర్ రక్తంలో నిజాయితీ, కృతజ్ఞత లేదు
-
Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
-
Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
-
Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!