Maha kumbh Mela: మహా కుంభమేళా ఆదాయం రూ. 2 లక్షల కోట్లు..!
- ఉత్తర్ ప్రదేశ్ని ఆర్థికంగా బలపరుస్తున్న ‘‘మహా కుంభమేళా’’..
- ఏకంగా రూ. 2 లక్షల కోట్ల ఆదాయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maha kumbh Mela: హిందువులకు అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం ‘‘మహా కుంభమేళా’’ అట్టహాసంగా ప్రారంభమైంది. ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న ఈ కుంభమేళాకు యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ కార్యక్రమానికి దాదాపుగా 40 కోట్ల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. నెల రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం ప్రపంచంలోనే అతిపెద్ద సమావేశంగా పరిగణించబడుతుంది. ఇది స్థానికంగా వాణిజ్యం, పర్యాటకం, ఉపాధిని గణనీయంగా ప్రోత్సహిస్తుంది.
ఈ కుంభమేళా ద్వారా దాదాపుగా రూ. 2 లక్షల కోట్ల విలువైన వాణిజ్యం జరుగుతుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) అంచనా వేసింది. ఈ ఆర్థిక వృద్ధికి వసతి, స్థానిక హోటల్లు, గెస్ట్ హౌజులు, తాత్కాలిక బస ఏర్పాట్ల ద్వారా రూ. 40,000 కోట్లు ఆర్జించే అవకాశం ఉందని చెప్పింది. మతపరమైన కార్యక్రమాల కోసం ఒక్కో వ్యక్తి కనీసం రూ. 5000 ఖర్చు పెడతారని అంచనా. ఇలా మొత్తం ఖర్చు రూ. 2 లక్షల కోట్లకు మించి ఉంటుందని పేర్కొంది. హోటల్లు, వసతి సౌకర్యాలతో పాటు ఫుడ్, మతపరమైన వస్తువులు, ఆరోగ్య సంరక్షణ, ఇతర సేవలు ఈ ఆదయానికి ఊతమిస్తాయని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Also Read
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
- Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
Read Also: Oscar Nominations: కార్చిచ్చు ఎఫెక్ట్.. ఆస్కార్ నామినేషన్లు మరోసారి వాయిదా
ప్యాకేజ్డ్ ఫుడ్స్, వాటర్, బిస్కెట్లు, జ్యూస్లు, మీల్స్తో సహా ఫుడ్ అండ్ బేవరేజెస్ రంగం మొత్తం వాణిజ్యానికి రూ.20,000 కోట్లు జోడించగలదని అంచనా. నూనె, దీపాలు, గంగా జలం, మతపరమైన పుస్తకాలు మరో రూ. 20,000 కోట్లను ఆర్జిస్తాయి. టూర్ గైడ్లు, ట్రావెల్ ప్యాకేజీలు, సంబంధిత కార్యకలాపాలు వంటి పర్యాటక సేవలు మరో రూ. 10,000 కోట్లను అందించే అవకాశం ఉంది.
తాత్కాలిక వైద్య శిబిరాలు, ఆయుర్వేద ఉత్పత్తులు మరియు మందులు రూ. 3,000 కోట్ల ఆదాయాన్ని తీసుకురావచ్చు, ఇ-టికెటింగ్, డిజిటల్ చెల్లింపులు, వై-ఫై సేవలు, మొబైల్ ఛార్జింగ్ స్టేషన్లు వంటి రంగాలలో రూ. 1,000 కోట్ల విలువైన వ్యాపారం జరుగుతుందని అంచనా. ప్రకటనలు మరియు ప్రచార కార్యకలాపాలు సహా వినోదం, మీడియా 10,000 కోట్ల రూపాయల వాణిజ్యాన్ని ఆర్జిస్తాయని అంచనా. స్థానిక ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడానికి ఉత్తర్ ప్రదేశ్ ఈ మహా కుంభమేళా ప్రాముఖ్యాన్ని హైలెట్ చేసింది. దేశవ్యాప్తంగా భక్తులను ఆకర్షించింది.
తాజావార్తలు
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
-
Jabardasth Mahesh: ‘ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో తెలీదు’.. సడన్గా కమెడియన్ మహేష్ షాకింగ్ వీడియో.. అసలేమైంది?
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!