Hydrogen train: భారత తొలి హైడ్రోజన్ రైలు ఎలా పనిచేస్తుంది..? దీని వెనక ఉన్న సైన్స్ ఇదే..
- భారత్ తొలి స్వదేశీ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ రైలుకు శ్రీకారం.
- హైడ్రోజన్-ఆక్సిజన్ రసాయనిక చర్యతో విద్యుత్ ఉత్పత్తి.
- పొగ, కార్బన్ ఉద్గారాలు లేకుండా నీటి ఆవిరి మాత్రమే విడుదల.
- LFP బ్యాటరీ, రీజనరేటివ్ బ్రేకింగ్తో అధిక సామర్థ్యం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hydrogen train: భారతదేశంలో తొలి హైడ్రోజన్ రైలును శుక్రవారం ప్రధాని నరేంద్రమోడీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు హర్యానాలోని జింద్-సోనిపట్ మధ్య నడుస్తుంది. దీంతో హైడ్రోజన్ టెక్నాలజీ కలిగిన అతికొద్ది దేశాల సరసన భారత్ చేరింది. అమెరికా, జర్మనీ, జపాన్, చైనాల వద్ద మాత్రమే హైడ్రోజన్ రైల్ టెక్నాలజీ ఉంది. 10 కోచ్లు కలిగిన ఈ రైలు 89 కి.మీ మార్గంలో నడుస్తుంది. ప్రపంచంలోనే అతి పొడవైన, శక్తివంతమైన రైలు ఇదే అని నిపుణులు చెబుతున్నారు.
ఎలా పనిచేస్తుంది.?
ఈ రైలులో హైడ్రోజన్ సిలిండర్లు నిల్వ చేసిన రెండు బోగీలు ఉంటాయి. హైడ్రోజన్ గ్యాస్ను హై ప్రెజర్ ట్యాంకుల్లో నిల్వ చేశారు. ఈ మొత్తం రైలులో అత్యంత కీలమైంది 1200 కిలోవాట్ల ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రేన్ ఫ్యూయల్ సెల్(PEMFC). దీంట్లోనే హైడ్రోజన్, ఆక్సిజన్ మధ్య రసాయనిక చర్య జరిగి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ మొత్తం చర్యలో బై ప్రొడక్ట్స్గా నీటి ఆవిరి, వేడి మాత్రమే విడుదలవుతుంది. పూర్తిగా ఎలాంటి కర్బన ఉద్గారాలు లేని క్లీన్ ఎనర్జీగా చెప్పవచ్చు.
Also Read
- Sonam Wangchuk: సోనం వాంగ్చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
- Pakistan: పాక్లో 5వ రాష్ట్రంగా గిల్గిట్-బాల్టిస్తాన్.. భారత్ను కవ్వించే చర్య..
- Supreme Court: ‘సర్’లో పేరు లేకపోతే పౌరసత్వం లేనట్టేనా.. సంక్షేమ పథకాలు నిలిపేస్తారా? సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- ISRO: ఇస్రోను శాస్త్రవేత్తలు ఎందుకు వదిలేస్తున్నారు..? అసలు కారణాలు ఇవే..
ముందుగా హైడ్రోజన్ గ్యాస్ PEMFC సెల్లోకి చేరుతుంది. ఫ్లాటినం ఆధారిత క్యాటలిస్ట్ సాయంతో హైడ్రోజన్ అణువులు ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లుగా విడిపోతాయి. ఎలక్ట్రాన్లు విద్యుత్ను ఉత్పత్తి చేస్తాయి. ఇదే సమయంలో బయట వాతావరణంలో ఉండే ఆక్సిజన్ ఫ్యూయల్ సెల్లోకి ఎంటర్ అవుతుంది. హైడ్రోజన్ ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లతో కలిసి నీటి ఆవిరి, హీట్ను ఉత్పత్తి చేస్తుంది. ఇలా తయారైన విద్యుత్ లిథియం ఐరన్ ఫాస్పేట్(ఎల్ఎఫ్పీ) బ్యాటరీల్లో నిక్షిప్తం అవుతుంది. ఇది ఇంజన్కు అదనపు శక్తిని, యాక్సిలిరేషన్ను ఇస్తుంది. రైలు బ్రేకులు వేసిన సమయంలో ‘‘రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్’’ వల్ల ఉత్పత్తి అయ్యే విద్యుత్ మళ్లీ బ్యాటరీల్లో నిల్వ అవుతుంది.
హైడ్రోజన్ నిల్వ, రీఫ్యూయలింగ్ కేంద్రం ఏర్పాటు:
హర్యానాలోని జింద్లో దేశంలో అతిపెద్ద హైడ్రోజన్ నిల్వ, రీఫ్యూయలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సుమారు 3000 కిలోల హైడ్రోజన్ నిల్వ సామర్థ్యం కలిగి ఉంది. NFPA-2, ISO 19880 అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా దీనిని నిర్మించారు.
రైలు ప్రత్యేకతలు ఇవే:
ఈ రైలు 10 బోగీలను కలిగి ఉంటుంది. ఇందులో 2 హైడ్రోజన్ పవర్ కార్లు, 8 కోచ్లు ఉంటాయి. సుమారు 2600 మంది ప్రయాణికుల సామర్థ్యాన్ని కలిగి ఉంది. గరిష్ట ఆపరేటింగ్ వేగం గంటకు 75 కిలోమీటర్లు. నిజమైన వేగం గంటకు 110 కి.మీ ఉంటుంది. ఈ రైలు పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో RDSO అభివృద్ధి చేసింది.
తాజావార్తలు
-
UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
-
Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
-
Sonam Wangchuk: సోనం వాంగ్చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
-
Gambhir-Kohli: గంభీర్-కోహ్లీ మధ్య ‘కోల్డ్ వార్’.. తొలి సారి నోరు విప్పిన టీమిండియా కోచ్!
-
Pakistan: పాక్లో 5వ రాష్ట్రంగా గిల్గిట్-బాల్టిస్తాన్.. భారత్ను కవ్వించే చర్య..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?