PM Modi: యూనిఫాం సివిల్ కోడ్పై ప్రధాని కీలక వ్యాఖ్యలు.. ఒకే దేశంలో 2 చట్టాలపై నడవదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: దేశంలో ఉమ్మడి పౌరస్మృతి(యూనిఫాం సివిల్ కోడ్, UCC)ని బీజేపీ ప్రభుత్వం తీసుకువస్తుందని అంతా భావిస్తున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది చివరిలో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో మంగళవారం పర్యటించారు. బీజేపీ పార్టీ ‘మేరా బూత్ సబ్సే మజ్బూత్’ ప్రచారంలో భాగంగా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు మాట్లాడుతూ ట్రిపుల్ తలాక్, యూనిఫాం సివిల్ కోడ్ పై వ్యాఖ్యలు చేశారు.
Read Also: Silver Price Hike: 48 గంటల్లో రూ.2300 పెరిగిన వెండి ధర.. కారణాలవే..!
Also Read
- Petrol and Diesel Prices Hike: వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రో ధరలు
- Maharashtra: పెళ్లింట తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి..
- Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి వీడియో
- India Bullet Train: భారత్ బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ లుక్ విడుదల.. ఫొటో వైరల్
ట్రిపుల్ తలాక్ ఇస్లాం నుంచి విడదీయరానిది అయితే.. ఈజిప్ట్, ఇండోనేషియా, ఖతార్, జోర్డాన్, సిరియా, బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్ వంటి ముస్లిం మెజారిటీ దేశాల్లో ముస్లింలు ఎందుకు పాటించడం లేదని ప్రశ్నించారు. ఒకే కుటుంబంలోని వేర్వేరు సభ్యులకు వేర్వేరు నిబంధలను కలిగి ఉండటం పనిచేయదని.. ఒకే దేశం రెండు చట్టాలపై నడవదని ఆయన యూనిఫాం సివిల్ కోడ్ ను ఉద్దేశించి అన్నారు. 90 శాతం సున్నీ ముస్లింలు ఉన్న ఈజిప్టు 80 నుంచి 90 ఏళ్ల క్రితమే ట్రిపుల్ తలాక్ను రద్దు చేసిందని ఆయన గుర్తు చేశారు. ట్రిపుత్ తలాక్ కోసం వాదించేవారు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ముస్లిం మహిళలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ప్రధాని అన్నారు.
ట్రిపుల్ తలాక్ కేవలం మహిళలకు మాత్రమే పరిమితం కాలేదని.. మొత్తం కుటుంబాన్ని కూడా నాశనం చేస్తుందని అన్నారు. కొందరు ముస్లిం మహిళలను అణిచివేయడానికి ట్రిపుల్ తలాక్ ను సమర్థిస్తున్నారని.. అయితే ముస్లిం మహిళలు ఎక్కడి వెళ్లిని బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నారని అన్నారు. యూనిఫాం సివిల్ కోడ్ వ్యతిరేకించే వారిపై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు తమ ప్రయోజనాల కోసం రెచ్చగొడుతున్నారని అన్నారు. భారతీయ ముస్లింలు, రాజకీయం కోసం కొన్ని పార్టీలు రెచ్చగొడుతున్నాయనే విషయాన్ని అర్థం చేసుకోవాలని కోరారు. రాజ్యాంగం ప్రజలందరి సమాన హక్కుల గురించి మాట్లాడుతుందని.. యూసీసీ అమలు చేయాలని సుప్రీంకోర్టు కూడా కోరిందని ఆయన తెలిపారు.
తాజావార్తలు
-
Petrol and Diesel Prices Hike: వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రో ధరలు
-
Astrology: మే 19 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!