PM Modi: యూనిఫాం సివిల్ కోడ్పై ప్రధాని కీలక వ్యాఖ్యలు.. ఒకే దేశంలో 2 చట్టాలపై నడవదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: దేశంలో ఉమ్మడి పౌరస్మృతి(యూనిఫాం సివిల్ కోడ్, UCC)ని బీజేపీ ప్రభుత్వం తీసుకువస్తుందని అంతా భావిస్తున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది చివరిలో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో మంగళవారం పర్యటించారు. బీజేపీ పార్టీ ‘మేరా బూత్ సబ్సే మజ్బూత్’ ప్రచారంలో భాగంగా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు మాట్లాడుతూ ట్రిపుల్ తలాక్, యూనిఫాం సివిల్ కోడ్ పై వ్యాఖ్యలు చేశారు.
Read Also: Silver Price Hike: 48 గంటల్లో రూ.2300 పెరిగిన వెండి ధర.. కారణాలవే..!
Also Read
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమార్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
ట్రిపుల్ తలాక్ ఇస్లాం నుంచి విడదీయరానిది అయితే.. ఈజిప్ట్, ఇండోనేషియా, ఖతార్, జోర్డాన్, సిరియా, బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్ వంటి ముస్లిం మెజారిటీ దేశాల్లో ముస్లింలు ఎందుకు పాటించడం లేదని ప్రశ్నించారు. ఒకే కుటుంబంలోని వేర్వేరు సభ్యులకు వేర్వేరు నిబంధలను కలిగి ఉండటం పనిచేయదని.. ఒకే దేశం రెండు చట్టాలపై నడవదని ఆయన యూనిఫాం సివిల్ కోడ్ ను ఉద్దేశించి అన్నారు. 90 శాతం సున్నీ ముస్లింలు ఉన్న ఈజిప్టు 80 నుంచి 90 ఏళ్ల క్రితమే ట్రిపుల్ తలాక్ను రద్దు చేసిందని ఆయన గుర్తు చేశారు. ట్రిపుత్ తలాక్ కోసం వాదించేవారు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ముస్లిం మహిళలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ప్రధాని అన్నారు.
ట్రిపుల్ తలాక్ కేవలం మహిళలకు మాత్రమే పరిమితం కాలేదని.. మొత్తం కుటుంబాన్ని కూడా నాశనం చేస్తుందని అన్నారు. కొందరు ముస్లిం మహిళలను అణిచివేయడానికి ట్రిపుల్ తలాక్ ను సమర్థిస్తున్నారని.. అయితే ముస్లిం మహిళలు ఎక్కడి వెళ్లిని బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నారని అన్నారు. యూనిఫాం సివిల్ కోడ్ వ్యతిరేకించే వారిపై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు తమ ప్రయోజనాల కోసం రెచ్చగొడుతున్నారని అన్నారు. భారతీయ ముస్లింలు, రాజకీయం కోసం కొన్ని పార్టీలు రెచ్చగొడుతున్నాయనే విషయాన్ని అర్థం చేసుకోవాలని కోరారు. రాజ్యాంగం ప్రజలందరి సమాన హక్కుల గురించి మాట్లాడుతుందని.. యూసీసీ అమలు చేయాలని సుప్రీంకోర్టు కూడా కోరిందని ఆయన తెలిపారు.
తాజావార్తలు
-
Lorcan Tucker: టీమిండియాపై టీ20 సిరీస్ గెలిచామా.. నేను ఇంకా నమ్మలేకపోతున్నా!
-
US Iran Talks: అమెరికా–ఇరాన్ మధ్య శాంతి దిశగా కీలక అడుగు..
-
God Of War : సోషల్ మీడియాని షేక్ చేస్తున్న Jr. NTR – త్రివిక్రమ్ ‘గాడ్ ఆఫ్ వార్’
-
Peddi OTT Release: రామ్ చరణ్ ‘పెద్ది’ ఇప్పుడు ఇంట్లోనే.. కానీ ఈ ఒక్క భాషకు వెయిటింగ్ తప్పదు!
-
Astrology: జూన్ 29 సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!