PM Modi: యూనిఫాం సివిల్ కోడ్పై ప్రధాని కీలక వ్యాఖ్యలు.. ఒకే దేశంలో 2 చట్టాలపై నడవదు..
PM Modi: దేశంలో ఉమ్మడి పౌరస్మృతి(యూనిఫాం సివిల్ కోడ్, UCC)ని బీజేపీ ప్రభుత్వం తీసుకువస్తుందని అంతా భావిస్తున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది చివరిలో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో మంగళవారం పర్యటించారు. బీజేపీ పార్టీ ‘మేరా బూత్ సబ్సే మజ్బూత్’ ప్రచారంలో భాగంగా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు మాట్లాడుతూ ట్రిపుల్ తలాక్, యూనిఫాం సివిల్ కోడ్ పై వ్యాఖ్యలు చేశారు.
Read Also: Silver Price Hike: 48 గంటల్లో రూ.2300 పెరిగిన వెండి ధర.. కారణాలవే..!
Also Read
- Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
- Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
- Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
- Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
ట్రిపుల్ తలాక్ ఇస్లాం నుంచి విడదీయరానిది అయితే.. ఈజిప్ట్, ఇండోనేషియా, ఖతార్, జోర్డాన్, సిరియా, బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్ వంటి ముస్లిం మెజారిటీ దేశాల్లో ముస్లింలు ఎందుకు పాటించడం లేదని ప్రశ్నించారు. ఒకే కుటుంబంలోని వేర్వేరు సభ్యులకు వేర్వేరు నిబంధలను కలిగి ఉండటం పనిచేయదని.. ఒకే దేశం రెండు చట్టాలపై నడవదని ఆయన యూనిఫాం సివిల్ కోడ్ ను ఉద్దేశించి అన్నారు. 90 శాతం సున్నీ ముస్లింలు ఉన్న ఈజిప్టు 80 నుంచి 90 ఏళ్ల క్రితమే ట్రిపుల్ తలాక్ను రద్దు చేసిందని ఆయన గుర్తు చేశారు. ట్రిపుత్ తలాక్ కోసం వాదించేవారు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ముస్లిం మహిళలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ప్రధాని అన్నారు.
ట్రిపుల్ తలాక్ కేవలం మహిళలకు మాత్రమే పరిమితం కాలేదని.. మొత్తం కుటుంబాన్ని కూడా నాశనం చేస్తుందని అన్నారు. కొందరు ముస్లిం మహిళలను అణిచివేయడానికి ట్రిపుల్ తలాక్ ను సమర్థిస్తున్నారని.. అయితే ముస్లిం మహిళలు ఎక్కడి వెళ్లిని బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నారని అన్నారు. యూనిఫాం సివిల్ కోడ్ వ్యతిరేకించే వారిపై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు తమ ప్రయోజనాల కోసం రెచ్చగొడుతున్నారని అన్నారు. భారతీయ ముస్లింలు, రాజకీయం కోసం కొన్ని పార్టీలు రెచ్చగొడుతున్నాయనే విషయాన్ని అర్థం చేసుకోవాలని కోరారు. రాజ్యాంగం ప్రజలందరి సమాన హక్కుల గురించి మాట్లాడుతుందని.. యూసీసీ అమలు చేయాలని సుప్రీంకోర్టు కూడా కోరిందని ఆయన తెలిపారు.
తాజావార్తలు
-
Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
-
యష్ ‘టాక్సిక్’కు ఓటీటీ టెన్షన్..
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!