Jammu Kashmir: ఆగి ఉన్న బస్సులో పేలుడు.. గంటల వ్యవధిలోనే రెండు ఘటనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jammu Kashmir: జమ్మూకశ్మీర్లోని ఉధంపూర్లో గంటల వ్యవధిలోని రెండు పేలుళ్లు సంభవించాయి. బుధవారం రాత్రి ఆగి ఉన్న బస్సులో పేలుడు సంభవించిన గంటల వ్యవధిలోనే రెండు పేలుడు సంభవించింది. గురువారం ఉదయం ఉధంపూర్లోని పాతబస్టాండ్లో మరో పేలుడు చోటుచేసుకుంది. బస్టాండ్లో నిలిపి ఉన్న బస్సులో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. అయితే ఈ ఘటనలో ఎవ్వరికీ ప్రమాదం జరగలేదని అధికారులు వెల్లడించారు. జిల్లాలో 8గంటల వ్యవధిలోనే రెండు పేలుళ్లు సంభవించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అప్రమత్తమైన పోలీసులు పేలుళ్ల గురించి ఆరా తీస్తున్నారు.
బుధవారం రాత్రి 10.45 గంటల సమయంలో ఉధంపూర్కు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న దొమాలి చౌక్ వద్ద ఓ బస్సులో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఉదంపూర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు, భద్రతా సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. విచారణ జరుగుతోంది. గంటల వ్యవధిలోనే ఇవి చోటుచేసుకోవడంతో ఏమైనా ఉగ్రవాద కారణాలున్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
- El Nino: 2027 ఫిబ్రవరి వరకు ఎల్ నినో.. 100% కొనసాగుతుందని WMO హెచ్చరిక
- PM Modi: కిర్గిజ్స్థాన్లో ‘మానస్’ ప్రత్యక్ష పఠనాన్ని వీక్షించిన మోడీ.. ప్రత్యేకత ఏంటి?
- Ram Mandir CEO: రామ మందిర్ CEOగా జితేంద్ర మిశ్రా.. ‘ఆపరేషన్ సింధూర్లో రహస్యం ఉందా?’ కాంగ్రెస్ అనుమానం
- Punjab: ‘‘రేప్ కేసుల సెటిల్మెంట్ దందా’’.. సీఎం మాన్, భార్యపై బీజేపీ తీవ్ర ఆరోపణలు
“రాత్రి 10:30 గంటల ప్రాంతంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. సమీపంలో పార్క్ చేసిన వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. పేలుడుకు కారణం ఇంకా తెలియరాలేదు. ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నాము” అని ఉదంపూర్ డీఐజి సులేమాన్ చౌదరి తెలిపారు.
తాజావార్తలు
-
El Nino: 2027 ఫిబ్రవరి వరకు ఎల్ నినో.. 100% కొనసాగుతుందని WMO హెచ్చరిక
-
Konda Surekha : గతంలో పార్టీని తిట్టిన వారిపై చర్యలేవి.? కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు
-
PM Modi: కిర్గిజ్స్థాన్లో ‘మానస్’ ప్రత్యక్ష పఠనాన్ని వీక్షించిన మోడీ.. ప్రత్యేకత ఏంటి?
-
Ram Mandir CEO: రామ మందిర్ CEOగా జితేంద్ర మిశ్రా.. ‘ఆపరేషన్ సింధూర్లో రహస్యం ఉందా?’ కాంగ్రెస్ అనుమానం
-
Konda Surekha : ‘నన్ను అణచేస్తున్నారు’.. రాహుల్కు సురేఖ ఫిర్యాదు.!
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!