Himanta Biswa Sarma: బంగ్లాకి చెందిన మైనారిటీలు కాంగ్రెస్కి ఓటేశారు.. హిందువులు..
- అభివృద్ధి పనులు చేసినా బంగ్లా మైనారిటీల ఓటు కాంగ్రెస్కే..
- హిందువులు ఎప్పుడూ మతతత్వంలో వ్యవహరించలేదు..
- వచ్చే 10 ఏళ్లలో అస్సాంని కంట్రోల్ చేయడమే వారి లక్ష్యం..
- అస్సాం సీఎం హిమంత బిశ్వ సర్మ సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Himanta Biswa Sarma: బీజేపీ నేత, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ సర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్కి చెందిన మైనారిటీ కమ్యూనిటీ ప్రజలు ఈ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కి ఓటేశారని అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వారి కోసం చేసిన అభివృద్ధి పనుల్ని పరిగణలోకి తీసుకోలేదని శనివారం చెప్పారు. అస్సాంలో మతతత్వానికి పాల్పడుతున్న ఏకైక కమ్యూనిటీ ఇదేనని ఆరోపించారు. గౌహతిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో హిమంత మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
పోలైన ఓట్లలో 47 శాతం ఓట్లు బీజేపీ కూటమి సాధిస్తే , కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు 39 శాతం ఓట్లు సాధించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని 14 లోక్సభ స్థానాలకు గాను బీజేపీ-ఏజీపీ-యూపీపీఎల్ కూటమి 11 స్థానాలను గెలుచుకోగా, మిగిలిన మూడు స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కాంగ్రెస్కి వచ్చిన 39 శాతం ఓట్లలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి రాలేదని, ఇందులో 50 శాతం మైనారిటీల ప్రాబల్యం ఉన్న 21 అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి వచ్చాయని, ఈ మైనారిటీల ఆధిక్యత ఉన్న సెగ్మెంట్లలో బీజేపీకి 3 శాతం ఓట్లు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.
Also Read
Read Also: Diarrhea Cases: కాకినాడ జిల్లాలో డయేరియా కలకలం.. ఇప్పటివరకు ఇద్దరు మృతి
హిందువులు మతప్రాతిపదిక ఓట్లు వేయరని ఇది రుజువు చేస్తోందని, అస్సాంలో ఎవరైనా మతతత్వానికి పాల్పడితే, అది ఒకే వర్గం, ఒకే మతం కారణమవుతోందని పరోక్షంగా ముస్లింలను ఉద్దేశించి అన్నారు. మైనారిటీల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో రోడ్లు, కరెంట్ లేదని అయినా కూడా కాంగ్రెస్కే ఓట్లు వేశారని చెప్పారు. అస్సామీ ప్రజలు, గిరిజనుల కోసం బీజేపీ పనిచేస్తున్నప్పటీ, ఆ వర్గాలు బీజేపీకి 100 శాతం ఓట్లు వేయలేదని చెప్పారు. కరీంగంజ్ మినహా బంగ్లాదేశ్ మూలాలున్న మైనారిటీ ప్రాంతాల్లో 99 శాతం ఓట్లు కాంగ్రెస్కి వచ్చాయని చెప్పారు.
వారు ప్రధాని మోడీ ఇచ్చిన ఇళ్లలో నివసిస్తున్నారు, మోడీ అందించిన విద్యుత్, పారిశుద్ధ కార్యక్రమాలను పొందుతున్నారు, కానీ ఓటు వేసేటప్పుడు కాంగ్రెస్కి ఓటేస్తారని హిమంత చెప్పారు. రాబోయే 10 ఏళ్లో బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వారు రాష్ట్రాన్ని నియంత్రించాలనే కోరికతో కాంగ్రెస్కి ఓటేశారని అన్నారు. బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడే సదరు కమ్యూనిటీ వారు బ్రార్ పేట్ లోని పోలీస్ స్టేషన్పై దాడికి తెగబడ్డారు, బీజేపీ ప్రభుత్వం లేకుంటే ఇలాంటి ఘటనలు మరెన్ని జరుగుతాయో అని అన్నారు. ఈ లోక్సభ ఎన్నికల్లో 126 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే, 92 స్థానాల్లో బీజేపీనే ప్రజలు ఆదరించినట్లు తెలిపారు. మా లక్ష్యం 47 శాతం ఓట్ల అని, 2026లో 50 శాతం సాధించడమే లక్ష్యమని చెప్పారు.
తాజావార్తలు
-
Astrology: జూన్ 13 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
-
CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
-
Family Suicide: ఇంత ఘోరమా? ముక్కుపచ్చలారని పసిబిడ్డల పట్ల విలన్గా మారిన తండ్రి
-
TCS Engineer Suicide: TCSలో సీనియర్ల వేధింపులు.. ఉద్యోగి ఆత్మహత్య..
-
Fenya: ‘అమమ్మ’ అంటే డబ్బు, ‘చెత్త’ అంటే పోలీసులు..! దొంగలకు ఆయుధంగా మారిన రహస్య భాష..
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!