Himanta Biswa Sarma: భారత్ లోనే అనేక మంది “హుస్సేన్ ఒబామాలు”.. వివాదాస్పదమైన సీఎం వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Himanta Biswa Sarma: బీజేపీ కీలక నేత, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ సర్మ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. ప్రధాని అమెరికా పర్యటనలో ఉన్న సందర్భంలో ఆ దేశ మాజీ అధ్యక్షుడు బారాక్ ఒబామా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను ప్రధాని మోదీతో మాట్లాడితే, భారత్ లో మైనారిటీల హక్కులను రక్షించకపోతే భారతదేశం విడిపోవచ్చని ఆయనతో చెబుతానని వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలపై అస్సాం సీఎంను.. మీరు ఒబామాను అరెస్ట్ చేసేందుకు అమెరికా వెళ్లారా..? అంటూ ఓ విలేకరి ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘భారతదేశంలోనే అనేక మంది హుస్సేన్ ఒబామాలు ఉన్నారని.. వారిని ఎదుర్కోవడానికి నా తొలి ప్రాధాన్యం’’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు దుమారం రేగింది. అస్సాం పోలీసులు ప్రాధాన్యతల ప్రకారం నడుచుకుంటారని ఆయన అన్నారు.
Also Read
- AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
- NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
- Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
- Gig Workers Strike: "పెరిగిన రేట్లకు తగ్గట్టు సర్వీస్ ఛార్జీలు పెంచండి".. మళ్లీ సమ్మె బాట పట్టిన గిగ్ వర్కర్లు..
Read Also: PM Modi: ఈజిప్టు పర్యటనకు బయలుదేరిన ప్రధాని.. 1997 తర్వాత ఇదే తొలిసారి..
ఈ వ్యాఖ్యలపై ఎన్సీపీ నేత క్లైడ్ క్రాస్టో మండిపడ్డారు. భారత్ లో మతం ఆదారంగా వివక్ష లేదని అమెరికా పర్యటనలో ప్రధాని చెప్పిన వ్యాఖ్యలను ఇది ఉల్లంఘించడమే అవుతుందని ఆయన అన్నారు. దీనిపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు కాంగ్రెస్ కూడా బీజేపీ టార్గెట్ గా విమర్శలు చేస్తోంది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ మాట్లాడుతూ.. హిమంత బిశ్వ సర్మ ప్రధాని కోటరీలో చాలా కీలకమైన వ్యక్తి అని.. అమెరికాలో ప్రధాని చేసిన వ్యాఖ్యలకు విరుద్ధంగా ఆయన వ్యాఖ్యానించారని అన్నారు. అన్నారు.
తాజావార్తలు
-
Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
-
AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
-
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. ‘నా పిల్లలను కూడా చూడనివ్వట్లేదు’ అంటూ ఏడ్చేసిన జయం రవి..
-
Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
-
NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..