High Court: “కొడుకు”ను కాపాడేందుకు ప్రయత్నించిన తల్లిని శిక్షించే చట్టాలు లేవు..
- అత్యాచారం కేసులో కొడుకును రక్షించేందుకు ప్రయత్నించిన తల్లి..
- నిందితుడికి జీవితఖైదు, నిర్దోషిగా తల్లి..
- తల్లి గుడ్డి ప్రేమతో ఇలా చేసిందని గుర్తించిన కోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
High Court: కొడుకు తప్పు చేసిన రక్షించే తల్లులను శిక్షించే చట్టాలు లేవని పంజాబ్-హర్యానా కోర్టు వ్యాఖ్యానించింది. ఐదున్నరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య చేసిన కొడుకును రక్షించేందుకు ఆధారాలు నాశనం చేయాలని చూసిన తల్లిని నిర్దోషిగా ప్రకటిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. నిందితుడైన కొడుకుకు మరణశిక్షను రద్దు చేసి, జీవితఖైదు (30 సంవత్సరాలు రిమిషన్ లేకుండా), రూ. 30 లక్షల జరిమానాను విధించింది. అదే సమయంలో అతడి తల్లిని నిర్దోషిగా ప్రకటించి విడుదల చేసింది.
అత్యాచారానికి సంబంధించిన సాక్ష్యాలను నాశనం చేయాలనే ఆందోళనతోనే ఈ హత్య జరిగిందని, ఇది ముందుగా పన్నాగం పన్ని చేసిన చర్య కాదని కోర్టు పేర్కొంది. తీర్పును వెలువరిస్తూ జస్టిస్ అనూప్ చిట్కారా, సుఖ్వీందర్ కౌర్లతో కూడిన ధర్మాసనం.. కుటుంబ సభ్యులు, ముఖ్యంగా తల్లులు తమ ‘‘ప్రియమైన’’ కుమారుల పట్ల తరుచుగా గుడ్డి ప్రేమ కలిగి ఉంటారని, కొడుకులు దుర్మార్గులైనప్పటికీ వారిని ‘‘రాజా బేటా’’గానే భావిస్తారని వ్యాఖ్యానించింది.
Also Read
- Vande Mataram in Madrasas: మదర్సాలలో వందేమాతరం తప్పనిసరి.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
- Petrol Diesel Price Hike: పెట్రోల్-డీజిల్ ధరలపై భారీ హెచ్చరికలు.. మరోసారి పెరుగుతాయా?
- West Bengal repolling: బెంగాల్లో మళ్లీ ఎన్నికల వేడి.. ఫల్తాలో రీ-పోలింగ్ షురూ! అసలు ట్విస్ట్ ఇదే..
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Read Also: China: 2 సెకన్లలో 700 kmph! చైనా కొత్త సూపర్ రైలు చూశారా!
ఈ కేసులో తన కొడుకు ఐదేళ్ల బాలికను క్రూరంగా హత్య చేశాడని తెలుసుకున్న తర్వాత కూడా తల్లి పోలీసులకు సమాచారం ఇవ్వకుండా, బాలికకు న్యాయం చేయడానికి బదులుగా కొడుకును రక్షించడానికి ప్రాధాన్యత ఇచ్చిందని కోర్టు పేర్కొంది. ఈ సామాజిక వైఖరి భయంకరమైనది అయినప్పటికీ, కొత్తది కాదని, ఇది పితృస్వామ్య మనస్తత్వం, సంస్కృతిలో లోతుగా పాతుకుపోయిందని కోర్టు వ్యాఖ్యానించింది.
2018లో అత్యాచారం, హత్య కేసు, సాక్ష్యాలు నాశనం చేసినందుకు 2020లో ట్రయల్ కోర్టు వీరేందర్ అలియాస్ భోలుకు మరణశిక్ష, అతడి తల్లి కమలాదేవికి కఠిన జైలుశిక్ష విధించింది. భోలు తన యజమాని కుమార్తెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక మృతదేహం నిందితుడి ఇంటి ప్రాంగణంలో లభించింది. ఈ కేసులో నిందితుడికి ముందస్తు నేరచరిత్ర లేకపోవడం, హత్య ముందస్తు ప్రణాళికలో భాగం కాకపోవడం, జైలులో ప్రవర్తన సంతృప్తికరంగా ఉందని చెబుతూ అతడి మరణశిక్షను జీవితఖైదుగా మార్చింది.
తాజావార్తలు
-
Mega 158: ‘మెగా’ డాటర్ ఫిక్స్.. సినిమాకే హైలైట్ అవ్వనుందా!
-
Gold and Silver Rates: గోల్డ్, సిల్వర్ ధరలు మళ్లీ పైపైకి.. ఈరోజు తులం ఎంతంటే?
-
Summer Foods for Kids: డీహైడ్రేషన్కు చెక్..! వేసవిలో పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడే సూపర్ ఫుడ్స్ ఇవే..
-
Dragon Glimpse Records: ‘డ్రాగన్’ గ్లింప్స్తో చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్.. 24 గంటల్లో భారతీయ సినీ హిస్టరీలోనే ఆల్టైమ్ రికార్డ్!
-
IPL 2026 Playoffs Race: ముంబైపై కేకేఆర్ విజయం.. సీఎస్కే ప్లేఆఫ్స్ ఛాన్సెస్ గల్లంతే, దేవుడు దిగొస్తే తప్ప!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!