High Court: “కొడుకు”ను కాపాడేందుకు ప్రయత్నించిన తల్లిని శిక్షించే చట్టాలు లేవు..
- అత్యాచారం కేసులో కొడుకును రక్షించేందుకు ప్రయత్నించిన తల్లి..
- నిందితుడికి జీవితఖైదు, నిర్దోషిగా తల్లి..
- తల్లి గుడ్డి ప్రేమతో ఇలా చేసిందని గుర్తించిన కోర్టు..
High Court: కొడుకు తప్పు చేసిన రక్షించే తల్లులను శిక్షించే చట్టాలు లేవని పంజాబ్-హర్యానా కోర్టు వ్యాఖ్యానించింది. ఐదున్నరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య చేసిన కొడుకును రక్షించేందుకు ఆధారాలు నాశనం చేయాలని చూసిన తల్లిని నిర్దోషిగా ప్రకటిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. నిందితుడైన కొడుకుకు మరణశిక్షను రద్దు చేసి, జీవితఖైదు (30 సంవత్సరాలు రిమిషన్ లేకుండా), రూ. 30 లక్షల జరిమానాను విధించింది. అదే సమయంలో అతడి తల్లిని నిర్దోషిగా ప్రకటించి విడుదల చేసింది.
అత్యాచారానికి సంబంధించిన సాక్ష్యాలను నాశనం చేయాలనే ఆందోళనతోనే ఈ హత్య జరిగిందని, ఇది ముందుగా పన్నాగం పన్ని చేసిన చర్య కాదని కోర్టు పేర్కొంది. తీర్పును వెలువరిస్తూ జస్టిస్ అనూప్ చిట్కారా, సుఖ్వీందర్ కౌర్లతో కూడిన ధర్మాసనం.. కుటుంబ సభ్యులు, ముఖ్యంగా తల్లులు తమ ‘‘ప్రియమైన’’ కుమారుల పట్ల తరుచుగా గుడ్డి ప్రేమ కలిగి ఉంటారని, కొడుకులు దుర్మార్గులైనప్పటికీ వారిని ‘‘రాజా బేటా’’గానే భావిస్తారని వ్యాఖ్యానించింది.
Also Read
- Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం
- UIDAI Important Update: యూఐడీఏఐ కీలక నిర్ణయం.. ఇక వీటికి ఆధార్ చెల్లదు..
- Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
- Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
Read Also: China: 2 సెకన్లలో 700 kmph! చైనా కొత్త సూపర్ రైలు చూశారా!
ఈ కేసులో తన కొడుకు ఐదేళ్ల బాలికను క్రూరంగా హత్య చేశాడని తెలుసుకున్న తర్వాత కూడా తల్లి పోలీసులకు సమాచారం ఇవ్వకుండా, బాలికకు న్యాయం చేయడానికి బదులుగా కొడుకును రక్షించడానికి ప్రాధాన్యత ఇచ్చిందని కోర్టు పేర్కొంది. ఈ సామాజిక వైఖరి భయంకరమైనది అయినప్పటికీ, కొత్తది కాదని, ఇది పితృస్వామ్య మనస్తత్వం, సంస్కృతిలో లోతుగా పాతుకుపోయిందని కోర్టు వ్యాఖ్యానించింది.
2018లో అత్యాచారం, హత్య కేసు, సాక్ష్యాలు నాశనం చేసినందుకు 2020లో ట్రయల్ కోర్టు వీరేందర్ అలియాస్ భోలుకు మరణశిక్ష, అతడి తల్లి కమలాదేవికి కఠిన జైలుశిక్ష విధించింది. భోలు తన యజమాని కుమార్తెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక మృతదేహం నిందితుడి ఇంటి ప్రాంగణంలో లభించింది. ఈ కేసులో నిందితుడికి ముందస్తు నేరచరిత్ర లేకపోవడం, హత్య ముందస్తు ప్రణాళికలో భాగం కాకపోవడం, జైలులో ప్రవర్తన సంతృప్తికరంగా ఉందని చెబుతూ అతడి మరణశిక్షను జీవితఖైదుగా మార్చింది.
తాజావార్తలు
-
Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
-
AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
-
Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం
-
AP Fuel Crisis: తగ్గిన పెట్రోల్ డీజిల్ కొరత ప్రభావం.. లిమిట్ పెంచిన బంక్లు..
-
Shruti Haasan: ఆ దర్శనం తర్వాత నా జీవితమే మారిపోయింది..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!