The Kerala Story: “ది కేరళ స్టోరీ” సినిమాపై స్టేకు హైకోర్టు నిరాకరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The Kerala Story: సంచలనాలకు కేంద్రబిందువుగా మారిని ‘‘ ది కేరళ స్టోరీ ’’ సినిమాపై స్టే ఇచ్చేందుకు కేరళ హైకోర్టు శుక్రవారం నిరాకరించింది. ఈ సినిమా సెన్సార్ షిప్ రద్దు చేయాలని దాఖలైన పిటిషన్ ను ఈ రోజు విచారించింది. ఇప్పటికే ఈ సినిమాపై సుప్రీంకోర్టు కూడా స్టేకు నిరాకరించింది. సెక్యులర్ కేరళ సమాజం ఈ సినిమాను అంగీకరిస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది. ఇది చరిత్రకాదు, కల్పితం అని గమనించిన ఈ సినిమా సమాజంలో మతవివాదాన్ని, సంఘర్షణను ఎలా సృష్టిస్తుందని పిటిషనర్లను ప్రశ్నించింది. సినిమా ట్రైలర్ మొత్తం సమాజానికి వ్యతిరేకంగా ఉందా..? అని అడిగింది.
సినిమా ప్రదర్శించినంత మాత్రన ఏమీ జరగదని, నవంబర్ లో సినిమా టీజర్ విడుదల చేశారని, సినిమాలో అభ్యంతరకరం ఏముంది..?అని, అల్లా ఒక్కడే దేవుడు అని చెప్పడంలో తప్పేంటని ప్రశ్నించింది. దేశ పౌరులకు నమ్మే హక్కు కల్పించబడిందని, దీంట్లో అభ్యంతరం ఏముందని హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. ఇంతకుముందు కూడా ఇలాంటి సినిమాలు చాలానే వచ్చాయని, హిందూ, క్రిస్టియన్ పూజారులఅను రిఫరెన్స్ గా సినిమాలు వచ్చాయని, వీటన్నింటిని కల్పగానే చూశారు కదా.. ఈ సినిమాలో స్పెషల్ ఏముంది..? ఈ సినిమా లౌకికవాదాన్ని ఎలా దెబ్బతీస్తుంది..? ఘర్షణకు ఎలా కారణం అవుతుంది..? అని కోర్టు వ్యాఖ్యానించింది.
Also Read
- PM Kisan 23వ విడత: ఖరీఫ్ సీజన్ వేళ రైతులకు కీలక అప్డేట్.. జూన్ 18న రూ.2,000 ఖాతాలో జమ అవుతాయా?
- Narendra Modi: 'జవహర్ లాల్ నెహ్రూ'ను అధిగమించిన నరేంద్ర మోడీ.. అత్యధిక కాలం ప్రధానిగా.!
- Petrol and Diesel Prices: పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా? వాహనదారులకు షాక్ తప్పదా?
- Delhi: డబుల్ ధమాకా.. 12 ఏళ్ల మోడీ పాలన పూర్తి.! కేంద్ర క్యాబినెట్, ఎన్డీఏ కీలక భేటీలు.!
Read Also: Bajrangdal protest: తెలంగాణకు తాకిన కర్ణాటక సెగ.. గాంధీ భవన్ వద్ద టెన్షన్
సినిమాపై స్టే విధించాలని వాదించిన పిటిషనర్లు.. ఈ సినిమా అమాయక ప్రజల్లో విషం నింపుతోందని, కేరళలో ‘లవ్ జీహాద్’ ఉనికిని ఏ సంస్థ కూడా గుర్తించలేదని వాదించారు. జస్టిస్ ఎన్ నగరేష్, జస్టిస్ మహ్మద్ నియాస్ సీపీలతో కూడిన డివిజన్ బెంచ్ ఈ అంశాన్ని పరిశీలించింది. సుదీప్తో సేన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అదాశర్మ, యోగితా బిహానీ, సిద్ధి ఇద్నానీ, సోనియా బలానీ లీడ్ క్యారెక్టర్స్ చేశారు.
కేరళలో 35,000 హిందూ, క్రిస్టియన్ అమ్మాయిలు ఇస్లాంను స్వీకరించారని, ఇందులో కొంత మంది ఐసిస్ ఉగ్రసంస్థలో పనిచేయడానికి సిరియా వెళ్లారనే ఇతివృత్తంతో సినిమా రూపొందించారు. దీనిపై కేరళలోని అధికార సీపీఎంతో పాటు కాంగ్రెస్ పార్టీలు బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. సీఎం పినరయి విజయన్ ఏకంగా ఇది ‘సంఘ్ పరివార్’ ప్రచారం అని విమర్శించారు.
తాజావార్తలు
-
Gorilla Viral Video: సేమ్ టు సేమ్.. మనిషిలా గొరిల్లా ఎక్స్ప్రెషన్స్.. వీడియో వైరల్..!
-
Ather Energy: ఎలక్ట్రిక్ స్కూటర్లకు వాయిస్ కమాండ్ ఫీచర్.. కొత్త అప్డేట్ విడుదల చేసిన ఏథర్ ఎనర్జీ
-
God of Masses Birthday Special : నటసింహం ‘బంగారు బాలయ్య’.. బర్త్ డే స్పెషల్
-
Blink Mobility EV: టాటా నానో కంటే చౌకైన EV కారు.. 250KM రేంజ్తో రానున్న బ్లింక్ మోడల్
-
Weather Update : తెలంగాణకు బ్రేక్ ఇచ్చిన రుతుపవనాలు.. మళ్లీ వానల జోరు ఎప్పుడంటే.?
ట్రెండింగ్
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి