Bajrangdal protest: తెలంగాణకు తాకిన కర్ణాటక సెగ.. గాంధీ భవన్ వద్ద టెన్షన్
Bajrangdal protest: కర్ణాటకలో మొదలైన కాంగ్రెస్ మేనిఫెస్టో సెగ తెలంగాణను తాకింది. బజరంగ్దళ్పై నిషేధం విధిస్తామన్న కాంగ్రెస్ హామీపై కర్ణాటకలో బీజేపీ ఇప్పటికే వివాదంలో ఉంది. అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభల్లో నినాదాలు చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయంపై తెలంగాణలోని భజరంగ్ దళ్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ కార్యాలయాల ఎదుట హనుమాన్ చాలీసా పఠించేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధమయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా భజరంగ్ దళ్ శ్రేణులు రెచ్చిపోయాయి. దీంతో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కర్ణాటక ఎన్నికల సందర్భంగా బజరంగ్దళ్పై నిషేధం విధిస్తామని కాంగ్రెస్ చెప్పడంతో వివాదం చెలరేగింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్కు వ్యతిరేకంగా బజరంగ్దళ్ శ్రేణులు నిరసనలు కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలో కూడా భజరంగ్ దళ్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల ముందు ప్రజాస్వామ్యయుతంగా హనుమాన్ చాలీసా పారాయణం చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ క్రమంలో బజరంగ్ దళ్, బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హైదరాబాద్ గాంధీభవన్ కు చేరుకున్నారు.
Read also: Fake ice cream: మళ్లీ కల్తీ ఐస్ క్రీం కలకలం.. లైట్ తీసుకుంటే ప్రాణానికే ప్రమాదం
Also Read
గాంధీభవన్ ముందు నిలబడి హనుమాన్ చాలీసా పఠించేందుకు ప్రయత్నించారు. కానీ గాంధీభవన్కు చేరుకున్న భజరంగ్దళ్, బీజేపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, భజరంగ్ దళ్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలిస్తున్నారు. అయితే పోలీసుల తీరుపై భజరంగ్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జై శ్రీరాం, జై హనుమాన్ అంటూ నినాదాలు చేస్తున్నారు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతలు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు బీజేపీ శ్రేణులు గాంధీభవన్కు చేరుకుంటున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో గాంధీభవన్ పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు. బారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు గాంధీభవన్ వద్ద మహిళా కాంగ్రెస్ నేతలు కూడా బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భజరంగ్ దళ్ శ్రేణులు నిరసనలు తెలిపాయి. సిరిసిల్ల జిల్లాలో నిరసనకు సిద్ధమైన బీజేపీ, భజరంగదళ్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయం వద్ద నుంచి పార్టీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, బీజేపీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
AC Helmet: తెలంగాణ సర్కార్ కూల్ వార్త.. త్వరలో ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్
తాజావార్తలు
-
Off The Record: కాళేశ్వరం కేసు దర్యాప్తు చుట్టూ పొలిటికల్ కలర్..
-
Salt : జాగ్రత్త..! ఉప్పు ఎక్కువగా తింటున్నారా.? ఈ ప్రమాదం గురించి తెలుసుకోండి..!
-
Infinix GT 50 Pro: 6,500mAh బ్యాటరీతో కొత్త గేమింగ్ బీస్ట్.. ఇన్ఫినిక్స్ GT 50 Pro విడుదల
-
Off The Record: నాగబాబు మంత్రి పదవి మీద ఆశలు వదులుకున్నట్టేనా..?
-
Dwcra Group: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 22 లక్షల మంది అకౌంట్లోకి డబ్బులు..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!