Wardha gang rape case: వార్ధా సామూహిక అత్యాచారం కేసు.. 8 మందిని నిర్దోషులుగా ప్రకటించిన హైకోర్టు..
- వార్ధా సామూహిక అత్యాచారం కేసులో సంచలనం..
- 8 మందిని నిర్దోషులుగా ప్రకటించిన హైకోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wardha gang rape case: 2010లో సంచలనం సృష్టించిన ‘‘వార్ధా సామూహిక అత్యాచారం’’ కేసులో సంచలనం నమోదైంది. ఈ అత్యాచార కేసులో దోషులుగా తేలి, 10 ఏళ్లుగా జైలు శిక్ష విధించబడిన 8 మందిని నిర్దోషులుగా విడుదల చేస్తూ బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్ తీర్పు ఇచ్చింది. ప్రాసిక్యూషన్ సాక్ష్యాలు, ఫిర్యాదుదారుడి వాంగ్మూలంలో అసమానతలు ఉన్నట్లు కోర్టు పేర్కొంది.
కేసు నేపథ్యం ఇదే:
Also Read
- Karnataka: "నిన్ను చంపి నేను చస్తా".. ఎక్స్ లవర్ని చంపేందుకు ప్లాన్.. కట్చేస్తే..
- Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
- Woman Litters In Train: రైలు కోచ్లో చెత్త విసిరి, సీటు పక్కనే చేతులు కడిగిన మహిళ.. సివిక్ సెన్స్పై దేశవ్యాప్తంగా చర్చ
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
జూన్ 24, 2010న తనకు ఆరోగ్యం బాగాలేదని, దీంతో ఆస్పత్రికి వెళ్లినట్లు బాధితురాలు చెప్పింది. ఆ సమయంలో ఆస్పత్రి మూసి ఉందని, గ్రామానికి తిరిగి వచ్చేందుకు ఆటోరిక్షా కోసం ఒక పాఠశాలలో వేచి ఉన్నట్లు చెప్పింది. సాయంత్రం 4 గంటలకు ఒక నిందితుడు తన ఆటోతో సంఘటనా స్థలానికి చేరుకున్నాడని, అప్పటికే ఆటోలో నలుగురు ప్రయాణికులు కూర్చొని ఉన్నారని చెప్పింది. ఆటో తన గ్రామానికి వెళ్లకుండా, వేరే ప్రాంతానికి వెళ్లిందని, ఆటో డ్రైవర్ నలుగురు ప్రయాణికులను దింపేసి, ముందుకు వెళ్లాడని చెప్పింది.
ఆటోడ్రైవర్ సదరు మహిళను మరికొంత మంది వ్యక్తులతో కలిసి వేరే ఆటోకి మార్చారని, ఇద్దరు వ్యక్తులు బైక్తో ఆటోని వెంబడించారని ఆరోపించింది. మహిళను నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి, కండోమ్ ధరించి విడతల వారీగా తనపై అత్యాచారం చేసినట్లు బాధితురాలు ఆరోపించింది. ఆ తర్వాత రాత్రి 9 గంటల ప్రాంతంలో, నిందితులు తనను బస్టాప్లో దించినట్లు చెప్పింది. ఇంటికి చేరిన తర్వాత బాధితురాలు విషయాన్ని తల్లికి తెలిపింది. ఆ తర్వాత పోలీసులు ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
కోర్టు విచారణ:
ఈ కేసులో ప్రధాన సాక్షలుగా ఉన్న బాధిత మహిళ, ఆమె తల్లి ప్రాసిక్యూషన్ వాదనలకు మద్దతు ఇవ్వలేదని కోర్టు చెప్పింది. మొదటగా మొదటి నిందితుడిని కేసులో మహిళ ఇరికించిందని, ఆ తర్వాత తానే పోలీసుల ఒత్తిడితో వాగ్మూలం ఇచ్చినట్లు చెప్పిందని కోర్టు పేర్కొంది. నమ్మశక్యం కాని ఆధారాల ఆధారంగా శిక్ష విధించలేమని కోర్టు చెప్పింది. నిందితుల ప్రమేయాన్ని నిర్ధారించడానికి ప్రాసిక్యూషన్ డీఎన్ఏ నివేదికపై ఎక్కువగా ఆధారపడింది. అయితే, ఫోరెన్సిక్ విశ్లేషణలో సరైన విధానపరమైన ఆధారాల ప్రామాణికతను ధృవీకరించడానికి నిపుణులైన సాక్షులను పిలవడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని కోర్టు చెప్పింది.
విచారణలో కోర్టు CrPC సెక్షన్ 164 కింద ఫిర్యాదుదారుడి వాంగ్మూలంపై ఎక్కువగా ఆధారపడింది. అయితే, క్రాస్ ఎగ్జామినేషన్ సమయంలో బాధితురాలు తన వాదనల్లో కొన్నింటిని తిరస్కరించింది. నిందితులను దోషులుగా నిర్ధారించే ముందు ట్రయల్ కోర్టు జాగ్రత్తగా వ్యవహరించాల్సిందని జస్టిస్ సనప్ అభిప్రాయపడ్డారు. సాక్షి సాక్ష్యంతో కొంత భాగం ప్రాసిక్యూషన్ కేసుతో సరిపోలినప్పటికీ, నేరాన్ని నిర్ణయించడంలో సాక్షి మొత్తం విశ్వసనీయత చాలా కీలకమని జస్టిస్ సనప్ హైలెట్ చేశారు. లోపభూయిష్ట దర్యాప్తులు లేదా బలవంతపు సాక్ష్యాల ఆధారంగా తప్పుడు శిక్షలు పడకుండా కోర్టులు నిర్ధారించుకోవాలని సూచించారు.
తాజావార్తలు
-
HYDRAA: వర్షం పడితే మునిగిపోవడానికి అసలు కారణం ఇదే.. కాలువల్లో లారీల కొద్దీ సోఫాలు, పరుపులు..రంగంలోకి ‘హైడ్రా’!
-
Shivam Dube: శివమ్ దూబేకు సరైన గుర్తింపు రాలేదా?.. సోషల్ మీడియాలో వైరల్గా స్టాట్స్!
-
Weight Loss Tips: బరువు తగ్గాలని అనుకుంటున్నారా? ముందుగా ఈ నిజాలు తెలుసుకోండి!
-
Vivo TWS 5 Pro: వివో కొత్త ఇయర్బడ్స్ విడుదల.. 50 గంటల ప్లేటైమ్
-
Multiplex Business: రూ.200 టికెట్ కొంటే ఎవరికెంత వెళ్తుంది?.. థియేటర్లను బతికించే అసలైన హీరో ఎవరు?
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!