Meena: ఢిల్లీ టూర్లో హీరోయిన్ మీనా.. బీజేపీలో చేరే అవకాశం
- ఢిల్లీ టూర్లో హీరోయిన్ మీనా
- ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ను కలిసిన మీనా
- బీజేపీలో చేరే అవకాశం
- సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ సీనియర్ హీరోయిన్ మీనా ఢిల్లీలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ను మీనా కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో మీనా పంచుకున్నారు. ‘‘మిమ్మల్ని కలవడం గౌరవంగా ఉంది.. మీ నుంచి చాలా నేర్చుకున్నాను. నా భవిష్యత్ నమ్మకంగా నడిపించడంలో నాకు సహాయపడుతుందని భావిస్తున్నా. మీ సమయానికి ధన్యవాదాలు’’ అంటూ మీనా రాశారు. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో రకరకాలైన ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. త్వరలోనే బీజేపీలో చేరనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు తమిళ మీడియాలో కూడా వార్తలు వస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Raw Garlic : ఈ సమస్యలతో బాధపడేవారు.. ఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లి తింటే డాక్టర్తో పని లేదు !
Also Read
- Parag Shah Turns Beggar: రూ.3,400 కోట్ల ఆస్తులున్న ఎమ్మెల్యే.. ఒక్కరోజు బిచ్చగాడిగా.. వైరల్గా మారిన ఘటన
- Bhajan Lal Sharma: రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లో బీజేపీ హవా.. ప్రధాని మోడీ పాపులారిటీ కలిసొచ్చిందన్న సీఎం
- EPFO WhatsApp Service: PF క్లెయిమ్ స్టేటస్ నుంచి బ్యాలెన్స్ వరకు.. అన్నీ వాట్సాప్లోనే..
- West Bengal: మదర్సాలపై బెంగాల్ ప్రభుత్వం ఉక్కుపాదం.. 252 మూసివేత.. 100 సంస్థలకు షోకాజ్ నోటీసులు
వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఇక అన్నాడీఎంకే-బీజేపీ మధ్య కూడా పొత్తు కుదిరింది. అధికారాన్ని చేజిక్కించుకోవాలని కమలనాథులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులను పార్టీలో చేర్చుకోవాలని కాషాయ పార్టీ భావిస్తోంది. ఇప్పటికే ఖుష్బు బీజేపీలో ఉన్నారు. మరికొందరిని పార్టీలో చేర్చుకుంటే బలం చేకూరుతుందని ఆ పార్టీ భావిస్తోంది. ఇందులో భాగంగానే మీనా ఢిల్లీకి వెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఉప రాష్ట్రపతితో భేటీ అయిన తర్వాత ఆ వార్తలకు బలం చేకూరింది. త్వరలోనే ఆమె కాషాయ కండువా కప్పుకోవచ్చని పుకార్లు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Crime News: అనంతపురంలో మరో వ్యక్తి దారుణహత్య.. బండరాయితో కొట్టి చంపిన దుండగులు!
2009లో మీనా.. వ్యాపారవేత్త విద్యాసాగర్ను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమార్తె ఉంది. అయితే 2022లో తీవ్ర అనారోగ్యంతో భర్త విద్యాసాగర్ చనిపోయారు. అప్పటి నుంచి మీనా.. కుమార్తెతోనే ఉంటుంది. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు సినీ పరిశ్రమలో రాణించింది. ప్రస్తుతం రాజకీయాలపై వైపు అడుగులు వేస్తున్నారని.. ఇందులో భాగంగానే ఆమె బీజేపీలో చేరాలని భావించినట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
తాజావార్తలు
-
Family Pack First Look: సంక్రాంతి బరిలో శ్రీ విష్ణు కొత్త సినిమా.. ఫన్నీగా ‘ఫ్యామిలీ ప్యాక్’ టైటిల్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
iPhone 17 Pro Discount: ఐఫోన్ 17 ప్రోపై ఊహించని డిస్కౌంట్.. రూ.69,990కే సొంతం చేసుకునే ఛాన్స్!
-
Ketika Sharma : హిట్ వచ్చింది కానీ ఆఫర్స్ మాత్రం రావడం లేదు
-
Parag Shah Turns Beggar: రూ.3,400 కోట్ల ఆస్తులున్న ఎమ్మెల్యే.. ఒక్కరోజు బిచ్చగాడిగా.. వైరల్గా మారిన ఘటన
ట్రెండింగ్
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!