Meena: ఢిల్లీ టూర్లో హీరోయిన్ మీనా.. బీజేపీలో చేరే అవకాశం
- ఢిల్లీ టూర్లో హీరోయిన్ మీనా
- ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ను కలిసిన మీనా
- బీజేపీలో చేరే అవకాశం
- సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ సీనియర్ హీరోయిన్ మీనా ఢిల్లీలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ను మీనా కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో మీనా పంచుకున్నారు. ‘‘మిమ్మల్ని కలవడం గౌరవంగా ఉంది.. మీ నుంచి చాలా నేర్చుకున్నాను. నా భవిష్యత్ నమ్మకంగా నడిపించడంలో నాకు సహాయపడుతుందని భావిస్తున్నా. మీ సమయానికి ధన్యవాదాలు’’ అంటూ మీనా రాశారు. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో రకరకాలైన ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. త్వరలోనే బీజేపీలో చేరనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు తమిళ మీడియాలో కూడా వార్తలు వస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Raw Garlic : ఈ సమస్యలతో బాధపడేవారు.. ఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లి తింటే డాక్టర్తో పని లేదు !
Also Read
- Swine Flu H1N1 in India: H1N1 కొత్త వేరియంట్ వచ్చిందా? కరోనా లాంటి ముప్పు ఉందా? ICMR కీలక సమాచారం
- Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్దేవ్పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
- CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
- Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన
వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఇక అన్నాడీఎంకే-బీజేపీ మధ్య కూడా పొత్తు కుదిరింది. అధికారాన్ని చేజిక్కించుకోవాలని కమలనాథులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులను పార్టీలో చేర్చుకోవాలని కాషాయ పార్టీ భావిస్తోంది. ఇప్పటికే ఖుష్బు బీజేపీలో ఉన్నారు. మరికొందరిని పార్టీలో చేర్చుకుంటే బలం చేకూరుతుందని ఆ పార్టీ భావిస్తోంది. ఇందులో భాగంగానే మీనా ఢిల్లీకి వెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఉప రాష్ట్రపతితో భేటీ అయిన తర్వాత ఆ వార్తలకు బలం చేకూరింది. త్వరలోనే ఆమె కాషాయ కండువా కప్పుకోవచ్చని పుకార్లు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Crime News: అనంతపురంలో మరో వ్యక్తి దారుణహత్య.. బండరాయితో కొట్టి చంపిన దుండగులు!
2009లో మీనా.. వ్యాపారవేత్త విద్యాసాగర్ను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమార్తె ఉంది. అయితే 2022లో తీవ్ర అనారోగ్యంతో భర్త విద్యాసాగర్ చనిపోయారు. అప్పటి నుంచి మీనా.. కుమార్తెతోనే ఉంటుంది. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు సినీ పరిశ్రమలో రాణించింది. ప్రస్తుతం రాజకీయాలపై వైపు అడుగులు వేస్తున్నారని.. ఇందులో భాగంగానే ఆమె బీజేపీలో చేరాలని భావించినట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
తాజావార్తలు
-
Female characters : స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ డిజైన్ చేస్తోన్న తమిళ్ ఇండస్ట్రీ
-
Don’t Be Shy: హీరోయిన్గా కాదు.. నిర్మాతగా అలియా భట్.. నేరుగా ఓటీటీలోకి కొత్త సినిమా!
-
H-1B Visa: భారతీయ ఐటీ నిపుణులకు ట్రంప్ షాక్.. హెచ్-1బీ వీసా రుసుము భారీగా పెంపు..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. ‘3’ నంబర్ వెనుక అసలు కథేంటి?
-
Amaravati Energy Stations: అమరావతికి ఎనర్జీ బూస్ట్.. 18.25 ఎకరాల్లో 7 ఎనర్జీ స్టేషన్లు
ట్రెండింగ్
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!