PM Modi: హేమంత్ సొరెన్, కాంగ్రెస్ పార్టీ బంగ్లాదేశీ, రోహింగ్యాలతో జతకట్టింది..
- హేమంత్ పార్టీ.. కాంగ్రెస్ పార్టీలపై విరుచుకుపడిన ప్రధాని మోడీ..
- బంగ్లాదేశీ మరియు రోహింగ్యాలకు మద్దతునిస్తున్నాయని విమర్శలు..
- కాంగ్రెస్ దెయ్యం జేఎంఎంని ఆవహించింది..
- బీజేపీ అధికారంలోకి రాగానే అవినీతిపై విచారణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్, జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం), ఆర్జేడీ పార్టీలపై విరుచుకుపడ్డారు. ఈ మూడు పార్టీలు జార్ఖండ్ రాష్ట్రానికి అతిపెద్ద శత్రువులని ఆరోపించారు. జార్ఖండ్ని కాంగ్రెస్ చాలా కాలంగా ద్వేషిస్తోందని, రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినందుకు ఆర్జేడీ ఇప్పటికీ ప్రతీకారం కోరుకుంటోందని ఆయన అన్నారు. అధికార హేమంత్ సొరెన్ పార్టీ జేఎంఎం ఆదివాసీ వర్గాలకు ద్రోహం చేస్తుందని ఆరోపించారు. ఆదివాసీ ఓట్లతో అధికారంలోకి వచ్చిన వారు, ఇప్పుడు వారి అటవీ భూమిని ఆక్రమించిన వారితో జతకట్టారని జేఎంఎంపై తీవ్ర విమర్శలు చేశారు.
కాంగ్రెస్, జేఎంఎం ‘‘బంగ్లాదేశీ, రోహింగ్యా చొరబాటుదారుల’’తో జతకట్టిందని, వీరంతా ఆ పార్టీలను ఎక్కువగా ప్రభావితం చేస్తున్నారని అన్నారు. బుజ్జగింపు రాజకీయాల దృష్టిసారించిన కాంగ్రెస్ దెయ్యం ఇప్పుడు జేఎంఎంని ఆవహించిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని ప్రభావితం చేసినప్పుడల్లా బుజ్జగింపు మాత్రమే ఎజెండా అవుతుందని, దీని వల్ల మొదటగా బాధపడేది దళితులు, గిరిజనులు, వెనకబడిన సమాజ ప్రయోజనాలే అని అన్నారు. అదే ద్రోహం ఇప్పుడు జేఎంఎం చర్యల్లో స్పష్టంగా కనిపిస్తోందని ఆయన విమర్శించారు.
Also Read
కాంగ్రెస్పై నిందలు వేసిన ప్రధాని, దేశంలో ‘‘అత్యంత నిజాయితీ లేని, అత్యంత అవినీతి పార్టీ’’ గా అభివర్ణించారు. కాంగ్రెస్ కుటుంబాన్ని అవినీతిపరులంట తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జేఎంఎం కూడా అదే మార్గాన్ని అనుసరిస్తుందని చెప్పారు. జేఎంఎం ఐదేళ్లలో జార్ఖండ్ని దోచుకోవడంపై మాత్రమే దృష్టిపెట్టిందని దుయ్యబట్టారు. ఏ రంగాన్ని వదలేదని ఆరోపించారు. నీరు, అడవులు, భూమి ఇలా అన్నింటిలో జేఎంఎం అవినీతికి పాల్పడిందని అన్నారు.
రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత అవినీతి, అక్రమాలకు సంబంధించిన ‘ఈ కేసులన్నీ’ క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. హామీలు ఇచ్చి అమలు చేసే ఏకైక పార్టీ బీజేపీ పార్టీనే అని ప్రధాని అన్నారు. జార్ఖండ్ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రధాని వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల మాజీ సీఎం, జేఎంఎం కీలక నేత చంపాయ్ సోరెన్ బీజేపీలో చేరారు. సంతాల్ పరగణాలో ఆదివాసీల భూముల్ని అక్రమ చొరబాటుదారులు చెరబడుతున్నారని అన్నారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
-
Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా దూరం.. కారణం ఇదే..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!