Heavy Rains: తెలంగాణతో పాటు ఈ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heavy Rains Across India: దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర ఆంధ్రప్రదేశ్-దక్షిణ ఒడిశాల తీరాలను అనుకుని పశ్చిమ- వాయువ్య బంగాళాఖాతంపై అల్పపీడనం ఏర్పడింది. దీంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. దక్షిణ ఒడిశా- ఉత్తరాంధ్రల మధ్య అల్పపీడనం కేంద్రీకృతం అయ్యే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఒడిశా, ఏపీ, పశ్చిమ బెంగాల్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
కోస్తా ఆంధ్రాప్రదేశ్, యానాం, తెలంగాణ, ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. ఈ రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 5 రోజుల్లో గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో రానున్న మూడు రోజుల్లో పశ్చిమ బెంగాల్, ఒడిశా, తెలంగాణ, ఏపీల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకర్, కేరల, మహేలతో విస్తారంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కువనున్నాయి. చత్తీస్ ఘడ్, మరాఠ్వాడా, విదర్భ, గుజరాత్, కొంకణ్, గోవాలలో వర్షపాతం నమోదు అవనున్నట్లు ఐఎండీ వెల్లడించింది.
Also Read
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
- IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
- PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
Read Also: RebelStar Krishnam Raju: టాలీవుడ్ లో విషాదం…రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇక లేరు
గుజరాత్ ప్రాంతానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మంగళవారం గుజరాత్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది ఐఎండీ. ఈ నెల 10,11 తేదీల్లో ఒడిశాలో భారీ వర్షాలు కురువనున్నాయి. 11,12 తేదీల్లో గంగా నది పరివాహక ప్రాంత, పశ్చిమబెంగాల్ ప్రాంతాల్లో వర్షాలు కురవనున్నాయి. 11 నుంచి 14 వరకు మహారాష్ట్రలో, 12-14 తేదీల్లో గుజరాత్ ప్రాంతంలో, రానున్న 5 రోజుల్లో కొంకణ్, గోవా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. సెప్టెంబర్ 10-11 తేదీల్లో వాయువ్య, పశ్చిమ బంగాళాఖాతం, ఏపీ, ఒడిశా, వెస్ట్ బెంగాల్ తీరాల వెంబడి పరిస్థితి అల్లకల్లోలంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. సెప్టెంబర్ 10,11 తేదీల్లో బంగాళాఖాతం తీరాలకు వెళ్లవద్దని సూచించింది.
తాజావార్తలు
-
Petrol Bunk: నమ్మి బాధ్యతలు ఇస్తే షాకిచ్చాడు.. పెట్రోల్ బంక్ నుంచి ఖైదీ పరార్..
-
Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
-
Dr. Himabindu Annamaraju : లక్షల్లో ఒక్కరికి వచ్చే రుగ్మత.. తల్లీబిడ్డకు సేఫ్ డెలివరీ..!
-
Chiranjeevi: మెగాస్టార్ మరో లీక్!.. ఈసారి #Mega158 టైటిల్
-
Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..