Heavy Rains: తెలంగాణతో పాటు ఈ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heavy Rains Across India: దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర ఆంధ్రప్రదేశ్-దక్షిణ ఒడిశాల తీరాలను అనుకుని పశ్చిమ- వాయువ్య బంగాళాఖాతంపై అల్పపీడనం ఏర్పడింది. దీంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. దక్షిణ ఒడిశా- ఉత్తరాంధ్రల మధ్య అల్పపీడనం కేంద్రీకృతం అయ్యే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఒడిశా, ఏపీ, పశ్చిమ బెంగాల్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
కోస్తా ఆంధ్రాప్రదేశ్, యానాం, తెలంగాణ, ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. ఈ రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 5 రోజుల్లో గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో రానున్న మూడు రోజుల్లో పశ్చిమ బెంగాల్, ఒడిశా, తెలంగాణ, ఏపీల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకర్, కేరల, మహేలతో విస్తారంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కువనున్నాయి. చత్తీస్ ఘడ్, మరాఠ్వాడా, విదర్భ, గుజరాత్, కొంకణ్, గోవాలలో వర్షపాతం నమోదు అవనున్నట్లు ఐఎండీ వెల్లడించింది.
Also Read
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Petrol-Diesel: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. జూలై 1 నుంచి ఆంక్షలు ఎత్తివేత
- Ayodhya Ram Mandir: బ్యాంకులకు చేరిన రామాలయ కానుకల చోరీ కేసు.. ఎస్బీఐతో పాటు మరో 5 బ్యాంకులకు నోటీసులు!
- Mumbai: ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. రెస్క్యూ ఆపరేషన్ ఫెయిల్.. చివరికిలా..!
Read Also: RebelStar Krishnam Raju: టాలీవుడ్ లో విషాదం…రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇక లేరు
గుజరాత్ ప్రాంతానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మంగళవారం గుజరాత్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది ఐఎండీ. ఈ నెల 10,11 తేదీల్లో ఒడిశాలో భారీ వర్షాలు కురువనున్నాయి. 11,12 తేదీల్లో గంగా నది పరివాహక ప్రాంత, పశ్చిమబెంగాల్ ప్రాంతాల్లో వర్షాలు కురవనున్నాయి. 11 నుంచి 14 వరకు మహారాష్ట్రలో, 12-14 తేదీల్లో గుజరాత్ ప్రాంతంలో, రానున్న 5 రోజుల్లో కొంకణ్, గోవా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. సెప్టెంబర్ 10-11 తేదీల్లో వాయువ్య, పశ్చిమ బంగాళాఖాతం, ఏపీ, ఒడిశా, వెస్ట్ బెంగాల్ తీరాల వెంబడి పరిస్థితి అల్లకల్లోలంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. సెప్టెంబర్ 10,11 తేదీల్లో బంగాళాఖాతం తీరాలకు వెళ్లవద్దని సూచించింది.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!