DY Chandrachud: ఢిల్లీలో కాలుష్యం వల్ల మార్నింగ్ వాక్ చేయడం మానేశాం..
- ఢిల్లీలో రోజురోజుకు క్షీణించిపోతున్న గాలి నాణ్యత..
- గాలి నాణ్యతపై సంచలన వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు సీజేఐ..
- వాయు కాలుష్యంతో మార్నింగ్ వాక్కు వెళ్లడం మానేసినట్లు సీజేఐ చంద్రచూడ్ వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DY Chandrachud: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం కమ్మేయడంతో రోజురోజుకూ గాలి నాణ్యత క్షీణిస్తుంది. ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ కాలుష్యం మాత్రం తగ్గిపోవడం లేదు. కాలానుగుణంగా పెరుగుతున్న కాలుష్యం అక్కడి ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇదే విషయంపై భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టులో విలేకరులతో సీజేఐ మాట్లాడుతూ.. పెరుగుతున్న వాయు కాలుష్యం వల్ల మార్నింగ్ వాక్కు వెళ్లడం కూడా మానేసినట్లు వెల్లడించారు. సాధారణంగా తాను ఉదయం 4 నుంచి 4.15 గంటల ప్రాంతంలో వాకింగ్కు వెళ్తానని చెప్పారు.
Read Also: KTR: వారికి వారే చంపుకుంటున్నారు.. జగిత్యాల ఘటనపై కేటీఆర్ కీలక కామెంట్..
Also Read
- TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
- Import Duty Charges increased: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
కానీ, ప్రస్తుతం బయటి వాతావరణంలో గాలి నాణ్యత బాగా క్షీణించినందున ఉదయాన్ని బయటకు వెళ్లకపోవడం మంచిదని తన వ్యక్తిగత డాక్టర్ సలహా ఇచ్చారని సీజేఐ డీవై చంద్రచూడ్ తెలిపారు. ఇంట్లో ఉండటం వల్ల శ్వాసకోశ వ్యాధులకు దూరంగా ఉండొచ్చని చెప్పినట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. ఇక, గడిచిన వారం రోజులుగా ఢిల్లీలో గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. దీంతో దేశంలోనే అత్యంత అధ్వానమైన గాలి నాణ్యతను ఢిల్లీలో నమోదు అయింది. రాష్ట్రాలు అవసరమైన కాలుష్య నిరోధక చర్యలను పాటించకపోవడంపై కేంద్ర ప్రభుత్వంతో పాటు పంజాబ్, హర్యానా సర్కార్ లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
Read Also: Free Gas Cylinders: ఉచిత సిలిండర్ల పథకం.. షరతులు ఇవే..!
ఇక, జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఏ అమానుల్లా, జస్టిస్ ఏజీ మసీహ్లతో కూడిన సుప్రీం ధర్మాసనం పంజాబ్, హర్యానా రాష్ట్రాల ప్రభుత్వాలకు పంట వ్యర్థాలను కాల్చడాన్ని అరికట్టడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నాయని ప్రశ్నించింది. ఈ రెండు రాష్ట్రాల నుంచి వచ్చే విషపూరిత పొగలు తరచుగా ఢిల్లీలో గాలి నాణ్యత క్షీణించేలా చేస్తుందని మండిపడ్డారు. అలాగే, రాజధాని ఏరియాలో కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఏర్పాటైన సంస్థ తన టార్గెట్ ను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని ఎయిర్ క్వాలిటీ ప్యానెల్ కు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది.
తాజావార్తలు
-
Aadi Saikumar : ఆది సాయికుమార్ కొత్త సినిమా అనౌన్స్మెంట్: ‘శంభల’ టీమ్తో మరో క్రేజీ ప్రయోగం!
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Import Duty Charges increased: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Akshay Kumar: దిల్ రాజు – అక్షయ్ కుమార్ మూవీ రిలీజ్ డేట్ ఖరారు..
-
Shubman Gill: “మా ప్లాన్ వర్కవుట్ అయింది”.. హైదరాబాద్పై భారీ విజయం తర్వాత గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!