Hathras Stampede: యూపీ తొక్కిసలాటలో 116 మంది మృతి.. నేడు హత్రాస్కు సీఎం యోగి..
- ఉత్తర ప్రదేశ్ లో విషాద ఘటన..
- హత్రాస్ జిల్లాలో భోలే బాబా సత్సంగ్ కార్యక్రమంలో పెను విషాదం..
- తొక్కిసలాటలో 116 మంది మృతి
- వందమందికి పైగా గాయాలు..
- నేడు తొక్కిసలాట జరిగిన ప్రదేశానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hathras Stampede: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది. మంగళవారం యూపీలోని హత్రాస్ జిల్లా ఫూల్ రాయ్ గ్రామం దగ్గర నిర్వహించిన భోలే బాబా సత్సంగ్ కార్యక్రమంలో ఈ పెను విషాదం జరిగింది. వేలాది మంది హాజరైన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో తీవ్రమైన రద్దీ కారణంగా జరిగిన తొక్కిసలాటలో దాదాపు 116 మంది మరణించారు. మృతుల్లో ఏడుగురు చిన్నారులు ఉండగా.. 108 మంది మహిళలు ఉన్నారు. వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు.
Also Read
- GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
- Health Awareness Wedding: ఆలోచింపజేస్తున్న ఈ వధూవరుల నిర్ణయం.. ఆ టెస్ట్ తర్వాతే వివాహబంధంలోకి అడుగుపెట్టిన జంట
- Karnataka: మందుబాబులకు కర్ణాటక ప్రభుత్వం బంపర్ ఆఫర్.. భారీగా తగ్గనున్న మద్యం ధరలు!
- Greater Noida: కోటి రూపాయలతో పెళ్లి.. 14 నెలలకే విషాదాంతం! కట్నం వేధింపులకు వివాహిత బలి
అయితే, ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే బాబా వెళ్లిపోతుండగా ఆయనతో ఫొటో దిగేందుకు.. ఆయన కాళ్లు మొక్కేందుకు జనం ఎగబడ్డారు.. అలాగే, బురద వల్ల నేలపై కొందరు జారిపడటంతో తొక్కిసలాట స్టార్ట్ అయింది అని చెప్తున్నారు. కాగా, తొక్కిసలాటలో మరణించిన 89 మంది డెడ్ బాడీలను హత్రాస్ లోని ఆస్పత్రిలో ఉంచామని ఎస్పీ రాజేశ్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. అలాగే, ఎటాలోని జిల్లా ఆస్పత్రికి 27 మంది డెడ్ బాడీలను తరలించామన్నారు. ఇప్పటి వరకు మృతుల్లో 72 మందిని గుర్తించామని పోలీసులు వెల్లడించారు.
కాగా, తొక్కిసలాట ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడ్డవారికి రూ.50 వేల చొప్పున నష్ట పరిహారం అందిస్తామన్నారు. సంఘటన ప్రదేశానికి వెళ్లి యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఇద్దరు రాష్ట్ర మంత్రులు, సీఎస్, డీజీపీని కూడా ఘటన జరిగిన ప్రదేశంలోనే ఉండి పరిస్థితి సమీక్షించాలని చెప్పారు. తొక్కిసలాట జరిగిన ఘటనపై యూపీ సర్కార్ ఓ కమిటిని వేసింది. అలాగే, ఇవాళ ( బుధవారం ) రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హత్రాస్ జిల్లాలోని ఫూల్ రాయ్ గ్రామానికి వెళ్లి పరిస్థితిని దగ్గరుండి సమీక్షించనున్నారు. దీంతో అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు.
తాజావార్తలు
-
Redmi K100: 200MP కెమెరాతో రెడ్మీ K100 చవకైన స్మార్ట్ఫోన్.. 10,000mAh బ్యాటరీ!
-
IPL 2026: ఐపీఎల్ 2026లో మజా లేదు.. ఆ సమరం ఎక్కడ అంటున్న ఫాన్స్?
-
GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
-
AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
-
Hyderabad Traffic Alert: ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్.. నగర, వరంగల్-హైదరాబాద్ ప్రయాణికులకు రూట్ మ్యాప్ ఇదే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..