Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • Pahalgam Terror Attack
  • Story Board
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Majority Will Be In Minority One Day Allahabad High Court On Conversion

Allahabad High Court: మతమార్పిడిని ఆపకపోతే మెజారిటీ కూడా మైనారిటీగా మారుతుంది.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

NTV Telugu Twitter
Published Date :July 3, 2024 , 7:43 am
By Mahesh Jakki
  • మతమార్పిడి ఇలాగే కొనసాగితే దేశంలోని మెజారిటీ జనాభా మైనారిటీలుగా మారతారు
  • అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
Allahabad High Court: మతమార్పిడిని ఆపకపోతే మెజారిటీ కూడా మైనారిటీగా మారుతుంది.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Allahabad High Court: మతమార్పిడి ఇలాగే కొనసాగితే దేశంలోని మెజారిటీ జనాభా మైనారిటీలుగా మారతారని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. ఉత్తరప్రదేశ్ అంతటా ఎస్సీ/ఎస్టీ, ఆర్థికంగా పేదవారిని క్రైస్తవ మతంలోకి అక్రమంగా మార్చడం పెద్ద ఎత్తున జరుగుతోందని కోర్టు పేర్కొంది. మత మార్పిడి ఆరోపణలు ఎదుర్కొంటున్న కైలాష్ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ ఈ వ్యాఖ్య చేశారు.

అసలు కేసు ఏంటంటే.. హామీర్‌పూర్‌కు చెందిన రామ్‌కాలీ ప్రజాపతి అనే మహిళ సోదరుడు రామ్‌పాల్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఢిల్లీలో చికిత్స చేయిస్తానని, వారంలో తిరిగివస్తానని చెప్పి అతడిని కైలాస్ తీసుకెళ్లాడు. తన సోదరుడు రాలేదని రామ్‌కాలీ అతడిని అడగడంతో సరైన జవాబు ఇవ్వలేదు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. గ్రామస్థులను ఢిల్లీ తీసుకెళ్లి మతమార్పిడి చేస్తున్నాడని పోలీసులు కేసు నమోదు చేశారు. హమీర్‌పూర్‌లోని మౌదాహా పోలీస్ స్టేషన్‌లో పిటిషనర్ కైలాష్‌పై అక్రమ మత మార్పిడి సెక్షన్ల కింద కేసు నమోదైంది.

Read Also: Nepal: పుష్ప కమల్ దహల్ ప్రచండకు పదవీ గండం.. నేపాల్లో కూలనున్న సంకీర్ణ సర్కార్..?

అలాంటి సమావేశం నిర్వహిస్తున్న సోనూ పాస్టర్ ఇప్పటికే బెయిల్‌పై విడుదలయ్యాడు. అదే సమయంలో రాష్ట్రం తరఫున హాజరైన అదనపు అడ్వకేట్ జనరల్ పీకే గిరి మాట్లాడుతూ.. ఇలాంటి సమావేశాలు నిర్వహించడం ద్వారా పెద్ద సంఖ్యలో ప్రజలను క్రైస్తవ మతంలోకి మారుస్తున్నారని అన్నారు. కైలాష్ గ్రామంలోని ప్రజలను క్రైస్తవ మతంలోకి మార్చడానికి తీసుకువెళుతున్నారని, ఈ పని కోసం అతనికి చాలా డబ్బులు కూడా చెల్లిస్తు్న్నారని సాక్షులు చెప్పారని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. ఇదిలా ఉండగా.. కైలాష్‌ తరపున న్యాయవాది వాదిస్తూ.. రామ్‌పాల్‌ను క్రైస్తవ మతంలోకి మార్చలేదని, కేవలం ఢిల్లీకి చికిత్స కోసం మాత్రమే తీసుకెళ్లాడని వాదనలు వినిపించారు.

ఢిల్లీలో గ్రామ ప్రజల మత మార్పిడి
రామ్‌కాలీ తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె సోదరుడు చాలా కాలం వరకు తిరిగి రాలేదని, కైలాష్‌ ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమానికి గ్రామంలోని చాలా మందిని తీసుకెళ్లాడు. ఇక్కడ చాలా మంది మతం మార్చబడింది. అతను క్రైస్తవుడిగా మార్చబడ్డాడు. ప్రతిఫలంగా రామ్‌కాలీ సోదరుడికి డబ్బులు ఇచ్చారు.

అగ్ని ప్రమాదాల నివారణకు సంబంధించి ప్రశ్నించిన న్యాయస్థానం
వివిధ ప్రభుత్వ భవనాలు, ప్రైవేట్ సంస్థలలో ఫైర్ ప్రివెన్షన్ అండ్ ఫైర్ సేఫ్టీ యాక్ట్ 2005ని పాటించకపోవడంపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై అలహాబాద్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం నుండి స్పందన కోరింది. వివిధ సంస్థలకు నోటీసులు ఇవ్వడమే కాకుండా అగ్నిమాపక శాఖ ఇంతవరకు ఏం చేసిందో చెప్పాలని కోర్టు ప్రశ్నించింది. వివిధ న్యాయ విశ్వవిద్యాలయాల్లోని న్యాయ విద్యార్థులు దాఖలు చేసిన పిల్‌ను విచారిస్తున్న సందర్భంగా బుధవారం ప్రధాన న్యాయమూర్తి అరుణ్ బన్సాలీ, వికాస్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ ఆదేశాలు జారీ చేసింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Allahabad High Court
  • Christian
  • Majority population
  • Majority Will Be In Minority
  • religious conversion

తాజావార్తలు

  • Acharya pramod krishnam: రాహుల్ గాంధీకి పాకిస్తాన్‌లో ఫుల్ క్రేజ్, అక్కడ పోటీ చేస్తే గెలుస్తాడు..

  • Kangana Ranaut : వయస్సు గురించి నాకు పట్టింపు లేదు..

  • Ponnam Prabhakar: ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొన్నం కీలక ప్రకటన

  • Naga Chandrika Rani: “మిస్‌ తెలుగు యూఎస్‌ఏ” కిరీటం సొంతం చేసుకున్న పోలవరం భామ..

  • Miss World 2025: కాసేపట్లో మిస్ వరల్డ్ విజేత ప్రకటన.. ఎలా ఎంపిక చేస్తారంటే.!

ట్రెండింగ్‌

  • Moto g86 Series: మోటొరోలా నుంచి మోటో G86 పవర్ 5G, మోటో G86 5G, మోటో G56 5G మూడు కొత్త 5G ఫోన్లు లాంచ్…!

  • Nissan Magnite CNG: నిస్సాన్ మాగ్నైట్‌కు ఇకపై సీఎన్జీ కిట్ కూడా.. కేవలం రూ.74,999 మాత్రమే..!

  • WhatsApp In iPad‌: ఆపిల్ ప్రియుల నిరీక్షణకు చెక్.. ఇకపై iPad‌లో కూడా వాట్సాప్..!

  • Motorola Razr 60: రూ. 49,999లకే రెండు డిస్‌ప్లేలు, 50MP కెమెరాతో మడతపెట్టే ఫోన్ను లాంచ్ చేసిన మోటరోలా..!

  • Jade Damarell: ‘ట్రూ లవ్’ అంటే ఇదేనేమో.. ప్రియుడు బ్రేకప్ చెప్పడంతో 10,000 అడుగుల ఎత్తు నుంచి దూకి సూసైడ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions