Sonia Gandhi: ‘‘నా కొడుకుని మీ చేతుల్లో పెట్టా’’ .. రాయ్బరేలీలో సోనియా గాంధీ కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sonia Gandhi: లోక్సభ 5వ విడతలో ఉత్తర్ ప్రదేశ్లోని రాయ్బరేలీ, అమేథీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేయడంతో దేశ ప్రజల దృష్టి ఈ స్థానంపై ఉంది. గత ఎన్నికల్లో అమేథీలో ఓడిపోయిన ఆయన, ఈ సారి తన తల్లి సోనియాగాంధీ కొన్ని పర్యాయాలుగా ప్రాతినిధ్యం వహిస్తూ, కాంగ్రెస్కి కంచుకోటగా ఉన్న రాయ్బరేలీ నుంచి పోటీ చేస్తున్నారు. మే 20న ఈ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి.
ఇదిలా ఉంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కోసం రాయ్బరేలీ ప్రజలకు కీలక విన్నపం చేశారు. ‘‘నేను నా కొడుకుని మీకు అప్పగిస్తున్నారు. మీరు నన్ను మీ వారిగా అనుకున్న విధంగానే రాహుల్ గాంధీతో వ్యవహరించండి. అతను మిమ్మల్ని నిరాశపరచడు’’ అని ఆమె అన్నారు. ‘‘ఇందిరాగాంధీ రాయ్ బరేలీ ప్రజలు నాకు నేర్పిన పాఠాలనే రాహుల్, ప్రియాంకాలకు నేర్పాను. అందర్ని గౌరవించడం, ప్రజల హక్కుల కోసం, అన్యాయాలపై పోరాటం నేర్పాను’’ అని అన్నారు. శుక్రవారం రాయ్బరేలీలో జరిగిన ప్రచార ర్యాలీలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read
- India: చరిత్రలో తొలిసారి, 12 అణు వార్హెడ్లను మోహరించిన భారత్..
- Tamil Nadu: విజయ్ ప్రభుత్వానికి మద్దతిచ్చిన 21 మంది ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్.. ఏం జరిగిందంటే?
- India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
- Explained: లౌకికవాదం నుంచి హిందుత్వ వైపు.. బెంగాలీ మేధావుల మనసు ఎందుకు మారింది?
Read Also: Swati Maliwal assault: ఇదంతా బీజేపీ కుట్ర.. స్వాతి మలివాల్ కేసుపై ఆప్..
2004లో తొలిసారిగా రాయ్బరేలీ నుంచి సోనియా గాంధీ ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే, రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎంపీగా కావడంతో 2024 ఎన్నికల్లో ఆమె పోటీ నుంచి దూరమయ్యారు. తను ఇంత కాలం ఎన్నుకున్నందుకు ప్రజలకు సోనియా గాంధీ థాంక్స్ చెప్పారు. చాలా కాలం తర్వాత మీ మధ్య ఉండే అవకాశం కల్పించినందుకు సంతోషంగా ఉందని, 20 ఏళ్ల పాటు నాకు సేవ చేసే అవకాశాన్ని మీరు కల్పించారని రాయ్బరేలీ ప్రజలను ఉద్దేశించి అన్నారు.
‘‘రాయ్బరేలీ నా కుటుంబం, అదే విధంగా అమేథీ కూడా నా ఇల్లు. ఈ ప్రదేశంతో నా జీవితంలోని సున్నితమైన జ్ఞాపకాలు మాత్రమే కాదు, మా కుటుంబం యొక్క మూలాలు కూడా గత 100 సంవత్సరాలుగా ఈ నేలతో ముడిపడి ఉన్నాయి. ఈ సంబంధం చాలా పవిత్రమైనది. ఈ అనుబంధం గంగా మాత అవధ్ మరియు రాయ్బరేలీ రైతుల ఉద్యమంతో ప్రారంభమై, ఇది నేటి వరకు కొనసాగుతోంది’’ అని సోనియా గాంధీ అన్నారు.
తాజావార్తలు
-
Abhai Naveen : కథ పట్టుకెళ్తే గ్లామర్ కావాలంటారు.. హీరోయిన్ల గుట్టు విప్పిన బిగ్ బాస్ అభయ్ నవీన్!
-
Shocking Survey: మన దేశంలో ఒంటరి మహిళలు ఎక్కడ ఎక్కువో తెలుసా? జాతీయ సగటు కంటే సౌత్లోనే ఘోరం!
-
India: చరిత్రలో తొలిసారి, 12 అణు వార్హెడ్లను మోహరించిన భారత్..
-
Varun Tej: ‘బరి’లోకి దిగడానికి ముందే వరుణ్ తేజ్ సంచలన నిర్ణయం! డైరెక్టర్ కండిషనే కారణమా?
-
SYG: రంగంలోకి దిగిన టాలెంటెడ్ బాలీవుడ్ స్టార్!
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!