Sonia Gandhi: ‘‘నా కొడుకుని మీ చేతుల్లో పెట్టా’’ .. రాయ్బరేలీలో సోనియా గాంధీ కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sonia Gandhi: లోక్సభ 5వ విడతలో ఉత్తర్ ప్రదేశ్లోని రాయ్బరేలీ, అమేథీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేయడంతో దేశ ప్రజల దృష్టి ఈ స్థానంపై ఉంది. గత ఎన్నికల్లో అమేథీలో ఓడిపోయిన ఆయన, ఈ సారి తన తల్లి సోనియాగాంధీ కొన్ని పర్యాయాలుగా ప్రాతినిధ్యం వహిస్తూ, కాంగ్రెస్కి కంచుకోటగా ఉన్న రాయ్బరేలీ నుంచి పోటీ చేస్తున్నారు. మే 20న ఈ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి.
ఇదిలా ఉంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కోసం రాయ్బరేలీ ప్రజలకు కీలక విన్నపం చేశారు. ‘‘నేను నా కొడుకుని మీకు అప్పగిస్తున్నారు. మీరు నన్ను మీ వారిగా అనుకున్న విధంగానే రాహుల్ గాంధీతో వ్యవహరించండి. అతను మిమ్మల్ని నిరాశపరచడు’’ అని ఆమె అన్నారు. ‘‘ఇందిరాగాంధీ రాయ్ బరేలీ ప్రజలు నాకు నేర్పిన పాఠాలనే రాహుల్, ప్రియాంకాలకు నేర్పాను. అందర్ని గౌరవించడం, ప్రజల హక్కుల కోసం, అన్యాయాలపై పోరాటం నేర్పాను’’ అని అన్నారు. శుక్రవారం రాయ్బరేలీలో జరిగిన ప్రచార ర్యాలీలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read
- IIT Deaths: ఐఐటీల్లో ఈ చావులు వెనుక ఉన్న కారణాలేంటి? విద్యార్థులను బలి తీసుకుంటుంది ఎవరు?
- NEET Counselling 2026: NEET కౌన్సెలింగ్ తొలి విడతలో సీటు రాకపోవడంతో.. 21 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య
- High Court Slams FDA: ‘మీరేమైన దేవుడు అనుకుంటున్నారా..?’ ఎఫ్డీఏకు హైకోర్టు షాక్..!
- India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
Read Also: Swati Maliwal assault: ఇదంతా బీజేపీ కుట్ర.. స్వాతి మలివాల్ కేసుపై ఆప్..
2004లో తొలిసారిగా రాయ్బరేలీ నుంచి సోనియా గాంధీ ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే, రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎంపీగా కావడంతో 2024 ఎన్నికల్లో ఆమె పోటీ నుంచి దూరమయ్యారు. తను ఇంత కాలం ఎన్నుకున్నందుకు ప్రజలకు సోనియా గాంధీ థాంక్స్ చెప్పారు. చాలా కాలం తర్వాత మీ మధ్య ఉండే అవకాశం కల్పించినందుకు సంతోషంగా ఉందని, 20 ఏళ్ల పాటు నాకు సేవ చేసే అవకాశాన్ని మీరు కల్పించారని రాయ్బరేలీ ప్రజలను ఉద్దేశించి అన్నారు.
‘‘రాయ్బరేలీ నా కుటుంబం, అదే విధంగా అమేథీ కూడా నా ఇల్లు. ఈ ప్రదేశంతో నా జీవితంలోని సున్నితమైన జ్ఞాపకాలు మాత్రమే కాదు, మా కుటుంబం యొక్క మూలాలు కూడా గత 100 సంవత్సరాలుగా ఈ నేలతో ముడిపడి ఉన్నాయి. ఈ సంబంధం చాలా పవిత్రమైనది. ఈ అనుబంధం గంగా మాత అవధ్ మరియు రాయ్బరేలీ రైతుల ఉద్యమంతో ప్రారంభమై, ఇది నేటి వరకు కొనసాగుతోంది’’ అని సోనియా గాంధీ అన్నారు.
తాజావార్తలు
-
IIT Deaths: ఐఐటీల్లో ఈ చావులు వెనుక ఉన్న కారణాలేంటి? విద్యార్థులను బలి తీసుకుంటుంది ఎవరు?
-
NEET Counselling 2026: NEET కౌన్సెలింగ్ తొలి విడతలో సీటు రాకపోవడంతో.. 21 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య
-
Laikey Laikaa: రాషా థడానీ ఇంటెన్స్ రొమాంటిక్ యాక్షన్ ఆగిపోలేదు.. వాలెంటైన్స్ డేకు వస్తోంది..
-
China: వేలాది కుటుంబాల కన్నీటి వేదన..నిజాలను సమాధి చేసే పాలన.. చైనా నిజస్వరూపం ఇదే!
-
TVS, Vida, Zelio, Bounce: బడ్జెట్లో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. రూ.36,000కే చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్..!
ట్రెండింగ్
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!