Haldwani violence: హల్ద్వానీ హింస..300 ముస్లిం కుటుంబాలు పలాయనం.. అధికారుల వేట తీవ్రతరం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Haldwani violence: ఉత్తరాఖండ్ ఆర్థిక రాజధాని హల్ద్వానీలోని బన్భూల్పురాలో ఇటీవల అక్రమంగా నిర్మించిన మదర్సా కూల్చివేత ఘటన తీవ్రమైన అల్లర్లకు దారి తీసింది. ఆ ప్రాంతంలోని ప్రజలు, అధికారులు, పోలీసులు, జర్నలిస్టులను టార్గెట్ చేస్తూ దాడులకు తెగబడ్డారు. పోలీసులపై రాళ్లు, కర్రలతో దాడి చేయడంతో పాటు పలు వాహానాలకు నిప్పు పెట్టి విధ్వంసం సృష్టించారు. పోలీసులను సజీవ దహనం చేసే ప్రయత్నం చేశారు. పక్కా ప్లాన్ ప్రకారమే దాడి జరిగినట్లు అధికారులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో సంఘ విద్రోహ శక్తులపై ఉక్కుపాదం మోపేందుకు పుష్కర్ సింగ్ ధామి సిద్ధమైంది.
Read Also: Aphrodisiac Pills: ఫస్ట్ నైట్ రోజు “మాత్రలు” తీసుకుని భర్త శృంగారం.. తీవ్రగాయాలతో నవవధువు మృతి..
Also Read
- Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
- Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
- Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
- Supreme Court: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణను తిరస్కరించిన సుప్రీంకోర్టు
ఈ అల్లర్లలో ఐదుగురు మరణించగా.. 60 మంది గాయపడ్డారు. ఇదిలా ఉంటే, ఈ ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత 300కి పైగా ముస్లిం కుటుంబాలు బన్భూల్పురా ప్రాంతాన్ని వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు. కర్ఫ్యూతో రవాణా సౌకర్యాలు లేకపోవడంతో, లగేజీ పట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇదిలా ఉంటే, హింసాకాండ నేపథ్యంలో పోలీసులు ఇంకా పెద్ద ఎత్తున సోదాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ అల్లర్లకు కారణమైన 30 మందిని పోలీసులు అరెస్ట్ చేయగా.. చాలా మంది కోసం గాలిస్తున్నారు. అరెస్టైన వారి నుంచి ఆయుధాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హల్ద్వానీ పరిధిలోని చాలా ప్రాంతాల్లో కర్ఫ్యూని సడలించినప్పటికీ.. బన్భూల్పురాలో మాత్రం ఇంకా కర్ప్యూ కొనసాగుతోంది. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని లేకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
మరిన్ని ముస్లిం కుటుంబాలు కూడా పారిపోవడానికి ప్లాన్ చేస్తుండటంతో, జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. అన్ని మార్గాల్లో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను మూసేసింది. హింసాకాండలో రెచ్చిపోయిన అల్లరి మూకల పారిపోయేందుకు ప్రయత్నించే అవకాశం ఉండటంతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం జమియత్ ఉలేమా-ఎ-హింద్ ప్రతినిధులు జిల్లా అధికారులతో సమావేశమై గంట పాటు చర్చించారు. అధికారులు హడావుడిగా మసీదును కూల్చేయడమే ఉద్రిక్తత, హింసకు దారి తీసిందని వారు చెప్పారు. మరోవైపు మసీదు, మదర్సా కూల్చివేసిన స్థలంలోనే పోలీస్ స్టేషన్ నిర్మిస్తామని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ప్రకటించారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్రెడ్డి
-
Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
-
Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
-
Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!