దేశ రాజధాని ఢిల్లీలో బీఆర్ఎస్ శకం మొదలైంది. జాతీయ రాజకీయాల్లో తన వంతు పాత్ర పోషించేందుకు అధినేత కేసీఆర్ హస్తినలో పార్టీ కార్యాలయం ప్రారంభించారు. రాజశ్యామల యాగం, చండీయాగం, యాగ పూర్ణాహుతిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొన్నారు. వేదపండితుల ముహూర్తం ప్రకారం మధ్యాహ్నం 12 గంటల 37 నిమిషాలకు నూతన కార్యాలయంలో గులాబీ జెండా ఆవిష్కరించారు. ఆ తర్వాత కార్యాలయాన్ని ప్రారంభించి.. తన చాంబర్లో బాధ్యతలు చేపట్టారు కేసీఆర్. భారత రాష్ట్ర సమితి కార్యాలయ ప్రారంభోత్సవానికి మాజీ ముఖ్యమంత్రులు కుమార స్వామి, అఖిలేష్ యాదవ్ హాజరయ్యారు. తన చాంబర్లో తొలిసారి ఆశీనులైన కేసీఆర్.. బీఆర్ఎస్ జాతీయ అద్యక్షుడిగా లెటర్ హెడ్పై మొదటి సంతకం చేశారు. బీఆర్ఎస్కు అనుబంధ సంఘంగా భారత్ రాష్ట్ర కిసాన్ సమితిని ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ కిసాన్ సెల్ అధ్యక్షుడిగా.. హర్యానా కురుక్షేత్రకు చెందిన గుర్నామ్ సింఘ్ చడూని.. కార్యాలయ కార్యదర్శిగా రవి కొహార్ను నియమిస్తూ వారికి పత్రాలు అందంచారు కేసీఆర్. ఇక, కిసాన్ సెల్ అధ్యక్షుడిగా జాతీయ రైతు సంఘం నేత గుర్నామ్ సింగ్ చదూని నియమించారు.. బీఆర్ఎస్ జాతీయ పార్టీ అధ్యక్షుని హోదాలో నియామక పత్రాలపై తొలి సంతకం చేశారు కేసీఆర్.. బీఆర్ఎస్ కిసాన్ సెల్ అధ్యక్షుడిగా.. హర్యానా కురుక్షేత్రకు చెందిన జాతీయ రైతు సంఘం నేత గుర్నామ్ సింగ్ను నియమించారు. కార్యాలయ కార్యదర్శిగా రవి కొహార్ను నియమించారు కేసీఆర్..
Read Also: BRS Twitter : మారిన టీఆర్ఎస్ ట్విట్టర్ హ్యాండిల్..