ఫేక్ న్యూస్.. గూగుల్, ట్విట్టర్, ఫేస్బుక్పై కేంద్రం సీరియస్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదోఒకటి ఫేక్ న్యూస్ తెగ రచ్చ చేస్తోంది.. అసలు ఏది వైరల్, ఏ రియల్ అని కనిపెట్టడమే కష్టంగా మారింది… అది ఫేక్ అని తెలిసేలోపే.. వైరల్గా మారి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.. అయితే, ఈ వ్యవహారంలో గూగుల్, ట్విట్టర్, ఫేస్బుక్ లాంటి సంస్థలపై కేంద్ర సర్కార్ సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది.. ఫేక్ న్యూస్ అరికట్టడంలో తగినన్ని చర్యలు చేపట్టక పోవడంలో కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా సమాచారం. అయితే, సామాజిక మాద్యమాల్లో వచ్చే నకిలీ వార్తలను రిమూవ్ చేసేందుకు ఇటీవల గూగుల్, ట్విట్టర్, ఫేస్బుక్ వంటి సంస్థలతో కేంద్ర ప్రభుత్వ అధికారులు సమావేశం నిర్వహించగారు.. జనవరి 31వ తేదీన వర్చువల్ గా జరిగిన ఈ సమావేశంలో ఆయా సంస్థలు, సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ అధికారులు మధ్య చర్చ తీవ్రంగా జరిగినట్టు నేషనల్ మీడియా పేర్కొంది.
Read Also: తెలంగాణలో ఈ రోజు ఎన్ని కోవిడ్ కేసులంటే..
Also Read
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- Parliament Monsoon Session: 'వందే మాతరం'ను అవమానిస్తే జైలుకే.. కేంద్రం కీలక బిల్లు సిద్ధం
- Parliament: పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ వ్యూహం ఇదే! గరంగరమేనా?
- CM Vijay: అవినీతిపై సీఎం విజయ్ సీరియస్.. మంత్రులకు స్ట్రాంగ్ వార్నింగ్
కాగా, గత రెండు నెలల్లోనే భారత ప్రభుత్వం 55 యూట్యూబ్ ఛానెళ్లు, 2 ట్విట్టర్ ఖాతాలు, 2 ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు, 2 వెబ్సైట్లను నిషేధించిన విషయం తెలిసిందే.. అదే పనిగా కొన్ని చానెళ్లు ఫేక్ వార్తలు కానీ లేదా భారత వ్యతిరేక వార్తలను ప్రోత్సహిస్తున్నాయన్న కారణంతో ఈ చర్యలు తీసుకోంది కేంద్రం.. పాకిస్థాన్ కేంద్రంగా ఉన్న ఖాతాల ద్వారా తప్పుడు సమాచారాన్ని భారత్లో ప్రచారం చేస్తున్నాయని కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది.. ఇక, మిలియన్ల మంది వినియోగదారులను కలిగి దేశీయ కంటెంట్-భాగస్వామ్య వేదికలుగా ఉన్న షేర్ చాట్ లాంటి సంస్థ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నాయి.. ఈ భేటీలో.. స్థానిక చట్టాలకు లోబడి ఉన్న కంటెంట్ను మాత్రమే పరిమితం చేస్తామని.. మిగతా కంటెంట్ను తొలగిస్తామని కొన్ని సంస్థలు కేంద్రానికి హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.. గూగుల్, ట్విట్టర్, ఫేస్బుక్ వంటి పెద్ద సంస్థలే ఫేక్ న్యూస్ను కట్టడి చేయడంలో విఫలం అవుతున్నారని.. ఆయా సంస్థల విషయంలో సర్కార్ నిరాశకు గురైనట్టు అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!