Congress: సోనియా గాంధీతో భేటీకానున్న ఆజాద్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో ఘోర పరాజయాన్ని మూట గట్టుకున్న కాంగ్రెస్ పార్టీని.. అంతర్గత విభేధాలు కూడా కలవరపెడుతూనే ఉన్నాయి.. కాంగ్రెస్లో సీనియర్లుగా ఉన్న నేతలు రెబల్స్గా జట్టు కట్టడం ఆ పార్టీని ఇబ్బంది పెడుతోంది.. అయితే, కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన ప్రారంభించింది.. ఇప్పటికే ఐదు రాష్ట్రాల పీసీసీ చీఫ్లో రాజీనామా చేయాలని ఆదేశించింది.. మరోవైపు.. అసమ్మతి నేతల డిమాండ్లపై కూడా ఫోకస్ పెడుతున్నారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.. అందులో భాగంగా.. సోనియా గాంధీతో త్వరలోనే భేటీకాబోతున్నారు పార్టీ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్.. గాంధీ కుటుంబానికి అసమ్మతి నేతల నిశ్చితాభిప్రాయాలు, మనోవేదనను తెలియజేయనున్నారు.. సోనియా గాంధీతో ఆజాద్ జరిపే చర్చల్లో ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ కూడా పాల్గొనబోతున్నారు..
Read Also: AP: వంట నూనెల ధరలకు సర్కార్ బ్రేక్..!
Also Read
- Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై "సింగం" ఫార్ములా బ్లాక్బస్టర్!!
- Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
- TMC Rebellion: కోల్కతా టు ఢిల్లీ.. పార్లమెంట్కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
- Delhi: అభిజీత్ దిప్కే పిలుపునకు భారీ స్పందన.. ‘కాక్రోచ్ మాస్కులు’ ధరించి నిరసన బాట పట్టిన యువత..
కాంగ్రెస్ పార్టీలో “చీలిక” మనుగడ సాగించే పరిస్థితి, శక్తి పార్టీకి లేదనే అంశం అసమ్మతి నేతల సమావేశంలో చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది.. గాంధీ కుటుంబం చుట్టూ ఉన్న వీర విధేయులే పార్టీ పతనానికి కారణమంటూ నిన్న జరిగిన సమావేశంలో అభిప్రాయపడ్డారు అసమ్మతి నేతలు… వెంటనే “వీర విధేయులు”ను తొలగించాలని తిరుగుబాటుదారుల డిమాండ్ గా ఉంది.. కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వాన్ని “వీర విధేయులే” తప్పుదోవ పట్టించారంటూ రెబల్స్ మండిపడుతున్నారు.. కాంగ్రెస్ అధినాయకత్వం వినకపోతే, మరిన్ని విపరీత నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు అసమ్మతి నేతలు. పార్టీ అధినాయకత్వాన్ని వెనుకేసుకురావడం, విమర్శల నుంచి “రక్షణ” కలిపించడం మినహాయించి, “వీర విధేయులు” పార్టీ కి చేసింది చాలా తక్కువ అని అభిప్రాయపడ్డారు అసమ్మతి నేతలు. పైపై తాత్కాలిక మార్పులను సూచిస్తూ, అధినాయకత్వాన్ని సమర్ధించడం తప్పా, వీర విధేయులు చేసింది ఏమీ లేదని కాంగ్రెస్ అసమ్మతి నేతల అభిప్రాయంగా ఉంది.. ఐదు రాష్ట్రాల్లో ఓటమికి ఎవరైతే కారణమో, తిరిగి వారికే పరిష్కార మార్గాల చూపాలంటూ బాధ్యతలు అప్పగించారంటూ మండిపడ్డారు.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయా రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులను అంచనా వేసేందుకు, సంస్థాగత మార్పులను సూచించేందుకు ఐదుగురు నేతలకు బాధ్యతలు అప్పగించిన సోనియా గాంధీ.. జైరామ్ రమేష్ కు మణిపూర్, జితేంద్ర సింగ్ కు ఉత్తర్ ప్రదేశ్, అజయ్ మెకన్ కు పంజాబ్, అవినాష్ పాండే కు ఉత్తరాఖండ్, రజనీ పాటిల్ కు గోవా బాధ్యతలు అప్పగించారు.. వారినే తప్పుబడుతున్నారు రెబల్స్. గాంధీ కుటుంబేతరులకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వ బాధ్యతలు ఇవ్వాలని నేరుగా చెప్పడం ఒక్కటే తక్కువగా ఉన్నట్టు పరిస్థితి ఉంది.. ఇతర అన్ని అంశాలలో నిక్కచ్చిగా పూర్తి ప్రక్షాళన చేపట్టాలని కోరుతున్న కాంగ్రెస్ అసమ్మతి నేతలు. ఈ నేపథ్యంలో సోనియా గాంధీతో జరగున్న ఆజాద్ భేటీలో ఎలాంటి చర్చ సాగుతుంది అనేది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Digital Arrest Scam: ముందు కాల్ వస్తుంది.. తర్వాత వీడియో కాల్.. చివరికి ఖాతాలోని డబ్బంతా మాయం!
-
Manav Suthar: టీమిండిలో మరో యువ కెరటం.. భారత టెస్టు జట్టులోకి దూసుకొచ్చిన ఈ కుర్రాడు ఎవరో తెలుసా?
-
CM Revanth Reddy: నన్ను మభ్యపెట్టడం అంత ఈజీ కాదు.. సీఎం రేవంత్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Anasuya: బాధ్యత ఉండక్కర్లా.. బుచ్చిబాబు’కి అనసూయ పరోక్ష కౌంటర్?
-
BCCI: ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనకు భారత జట్టు ప్రకటన.. వైభవ్ సూర్యవంశీకి తొలి అంతర్జాతీయ అవకాశం
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!