Atiq Ahmed: నన్ను జైలు నుంచి బయటకు రప్పించి చంపేస్తారు.. గ్యాంగ్స్టర్ అతిక్ అహ్మద్ సోదరుడి ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Atiq Ahmed: ఉత్తర్ ప్రదేశ్ గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్కు ప్రయాగ్ రాజ్ కోర్టు ఉమేష్ పాల్ కిడ్నాప్ కేసులో జీవితఖైదు విధించింది. అతని తమ్ముడు అష్రాఫ్ అహ్మద్ తో పాటు మరో ఏడుగురిని నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది. ఇదిలా ఉంటే అన్నదమ్ములకు ప్రస్తుతం ఎన్ కౌంటర్ భయం పట్టుకుంది. యూపీ పోలీసులు తమను ఎన్ కౌంటర్ చేస్తారనే భయం వారిని వెన్నాడుతోంది. అతీక్ అహ్మద్ జైలు నుంచి బయటకు రావడానికే భయపడుతున్నారు.
ఇదిలా ఉంటే ఆయన తమ్ముడు అష్రాఫ్ అహ్మద్ కూడా ఇలాంటి ఆరోపణలే చేశారు. తనను జైలు నుంచి బయటకు రప్పించి రెండు వారాల్లో చంపేస్తారని ఆరోపించారు. ఓ ఉన్నతాధికారి తనతో ఇలా అన్నారని పేర్కొన్నాడు. అయితే ఆ అధికారి పేరు చెప్పేందుకు నిరాకరించాడు. తాను హత్యకు గురైతే ఒక ఎన్వలప్ లో ఆ పేరు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కి చేరుతుందని వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం బరేలీ జైలులో జైలులో ఉన్నాడు.
Also Read
- Mamata Banerjee: కేంద్రంలో బీజేపీ అధికారం కోల్పోవడం ఖాయం.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు..
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Nationwide Medical Shop Strike: నేడు దేశవ్యాప్తంగా మెడికల్ ఎమర్జెన్సీ? బంద్ కానున్న 15 లక్షల మందుల దుకాణాలు!
- PM Modi: రోమ్లో మోదీ.. భారత్-ఇటలీ వ్యూహాత్మక భాగస్వామ్యంపై దృష్టి.!
Read Also: Sourav Ganguly : రోహిత్ శర్మకు గంగూలీ సూచన.. హార్దిక్ పాండ్యాకే పగ్గాలు..?
నాపై పెట్టిన కేసులు నిరాధారమైనవి, నాపై పెట్టిన తప్పుడు కేసులతో నేను పడుతున్న బాధను ముఖ్యమంత్రి అర్థం చేసుకున్నారని అష్రాఫ్ అన్నారు. 2005లో బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్ హత్య కేసులో ప్రధాన సాక్షిగా ఉమేష్ పాల్ ఉన్నారు. ఈ కేసులో గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అతీక్ అహ్మద్ పై 100కు పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. కాగా, 2006లో ఉమేష్ పాల్ ను అతీక్ అహ్మద్ గ్యాంగ్ కిడ్నాప్ చేసి తన వాంగ్మూలాన్ని వాపస్ తీసుకోవాలని బెదిరించారు. ఈ కేసులో మంగళవారం ప్రయాగ్ రాజ్ కోర్టు శిక్ష విధించింది అతీక్ అహ్మద్ కు జీవితఖైదు పడగా.. అఫ్రాఫ్ ను నిర్దోషిగా తేల్చింది. ఇదిలా ఉంటే రాజుపాల్ హత్య కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న ఉమేష్ పాల్ ను గత నెల ఫిబ్రవరిలో దుండగులు కాల్చి చంపారు. ఈ కేసుపై యూపీ సీఎం యోగీ ఆదిత్య నాథ్ సీరియస్ గా ఉన్నారు. యూపీలో మాఫియాను మట్టిలో కలిపేస్తానని అసెంబ్లీలో ఆగ్రహంతో వ్యాఖ్యానించారు. ఉమేష్ పాల్ హత్యలో పాలుపంచుకున్న ఇద్దరు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ లో లేపేశారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తుఫాన్ ఇన్నింగ్స్కు ప్రత్యర్థి ఓనర్ కూడా ఫిదా.. బుడ్డోడి కోసం వచ్చే ఏడాది బిడ్ ఖాయం!
-
Google Search Big Update: గూగుల్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ చేంజ్.. కొత్త ఏఐ ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
-
Gulab Lassi Recipe: హీట్కు చెక్ పెట్టే షాహీ గులాబ్ లస్సీ.. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండి..!
-
భారత్ లోకి Mini Cooper S GP Inspired Edition.. కేవలం 30 కార్లకే పరిమితం.!
-
Anil Ravipudi: ‘పెద్ది’ ట్రైలర్ పై..అనిల్ రావిపూడి భారీ ప్రశంసలు!
ట్రెండింగ్
-
బ్రిటన్ మార్కెట్లోకి హీరో XPulse 200 బైక్స్.. అడ్వెంచర్ రైడర్ల కోసం కొత్త శక్తి!
-
Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?