Eknath Shinde: మహారాష్ట్ర ప్రభుత్వంలో ఎన్సీపీ కీలక నేత అజిత్ పవార్ తో చేరారు. ఆయనతో పాటు 9 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. దీన్ని ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే స్వాగతించారు. ఇప్పుడు మహారాష్ట్రలో ‘‘ట్రిపుల్ ఇంజన్ సర్కార్’’ ఉందంటూ వ్యాఖ్యానించారు. గత ఏప్రిల్ నెలలో ప్రభుత్వంలో ఎన్సీపీ చేరితే మేం వైదొలుగుతాం అని ప్రకటించిన ఏక్ నాథ్ షిండే ప్రస్తుతం ఎన్సీపీ ప్రభుత్వంలో చేరడాన్ని స్వాగతించారు. ఇప్పుడు మహారాష్ట్రలో డబుల్ ఇంజన్ సర్కార్ కాదు.. ట్రిపుల్ ఇంజన్ సర్కార్ ఉందని అన్నారు.
Read Also: Rangabali: పవన్ కళ్యాణ్ ను.. ఓ రేంజ్ లో దింపేశారయ్యా.. సూపర్.. సూపర్ .. సూపర్
ఎన్సీపీ నమ్మకద్రోహం చేసే పార్టీ, మేము అధికారంలో ఉన్నా ఎన్సీపీతో కలిసి ఉండము అని షిండే వర్గం నేత, అధికార ప్రతినిధి సంజయ్ శిర్సత్ ఏప్రిల్ 19న విలేకరులతో అన్నారు. బీజేపీతో ఎన్సీపీ చేరితే మహారాష్ట్ర ఇష్టపడదని.. కాంగ్రెస్, ఎన్సీపీతో శివసేన వెళ్లడం నచ్చకే ఉద్ధవ్ ఠాక్రే వర్గం నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నటు ఆయన గతంలో వెల్లడించారు. ఒకవేళ అజిత్ పవార్ ఎన్సీపీలో స్వేచ్ఛగా లేకపోతే, అతను ఎన్సీపీని వీడితే మేము స్వాగతిస్తామని.. అతను ఎన్సీపీ నాయకులతో వస్తే మాత్రం మేం ప్రభుత్వంలో ఉండబోమని అన్నారు.
ఇదిలా ఉంటే తాజాగా ప్రభుత్వంలో చేరిన అజిత్ పవార్, ఎన్సీపీ మొత్తం ప్రభుత్వంలో చేరిందని, ఎన్నికల్లో పార్టీ గుర్తుపైనే, ఉమ్మడిగా పోటీ చేస్తామని అన్నారు. గతంలో ఉద్ధవ్ ఠాక్రే ఎన్సీపీతో పొత్తు పెట్టుకోవడంతోనే ఏక్ నాథ్ షిండే తిరుగుబాటు చేశానని చెప్పారు. అయితే ఇప్పుడు మాత్రం ఎన్సీపీ రాకతో ట్రిపుల్ ఇంజన్ సర్కార్ అని వ్యాఖ్యానించారు. ఇప్పుడు మనకు ఇద్దరు డిప్యూటీ సీఎంలు, ఒక ముఖ్యమంత్రి ఉన్నారని, ఇది రాష్ట్రాభివృద్ధిని వేగం చేస్తుందని ఏక్ నాథ్ షిండే అన్నారు.