Mandi: కార్యకర్తలకు బీజేపీ నేత జైరామ్ ఠాకూర్ సమోసా పార్టీ
- హిమాచల్ప్రదేశ్ రాజకీయాలను సమోసా వివాదం
- కార్యకర్తలకు బీజేపీ నేత జైరామ్ ఠాకూర్ సమోసా పార్టీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హిమాచల్ప్రదేశ్ రాజకీయాలను సమోసా వివాదం కుదిపేస్తోంది. అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య ఈ వ్యవహారం రచ్చరచ్చ చేస్తోంది. ఇప్పటికే నేతలు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. సమోసాల మిస్సింగ్పై అధికార కాంగ్రెస్ పార్టీ సీఐడీ విచారణకు ఆదేశించడం పెను దుమారం చెలరేగింది. దీనిపై ప్రతిపక్ష బీజేపీ తీవ్ర విమర్శనాస్త్రాలు సంధించింది. తాజాగా సమోసా వివాదం నేపథ్యంలో మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత జైరామ్ ఠాకూర్ సమోసా పార్టీ ఇచ్చారు. మండిలోని సర్క్యూట్ హౌస్లో బీజేపీ కార్యకర్తలతో కలిసి సమోసా పార్టీ ఆస్వాధించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అసలేం జరిగిందంటే..
అక్టోబర్ 21న ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు సీఐడీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ జరిగిన ఓ కార్యక్రమం కోసం ప్రముఖ హోటల్ నుంచి సమోసాలు తెప్పించారని, అయితే వాటిని సెక్యూరిటీ సిబ్బంది తినేసినట్లుగా వార్తలు హల్చల్ చేశాయి. సీఎం దగ్గరకు చేరాల్సిన సమోసాలు, కేక్లు మధ్యలో ఎలా దారి తప్పాయో గుర్తించేందుకు సీఐడీ విచారణకు సీఎం ఆదేశించినట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి. దీంతో ప్రతిపక్ష బీజేపీ నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ వ్యవహారం హాస్యాస్పదంగా ఉందంటూ ఎద్దేవా చేసింది. వాటిని ఇతరులు తింటే ఏమవుతుందని ప్రశ్నించింది. సీఎం తినాల్సిన సమోసాలను తీసుకెళ్లిందెవరు..? సీఐడీ తేల్చనుంది..?’’ అని బీజేపీ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఈ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతుండటంతో సీఎం సుఖు క్లారిటీ ఇచ్చారు.
Also Read
- TMC Crisis: మూడు దశాబ్దాల దీదీ సామ్రాజ్యం నిలువునా కొల్లాప్స్.. టీఎంసీ కూలడానికి ప్రధాన కారణాలు ఇవే..
- Mamata Banerjee: దీదీనే దేశ ప్రధాని అన్నది, ఇప్పుడు షాక్ ఇచ్చిన సాయోని ఘోష్..
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
- Cabinet: అహ్మదాబాద్ మెట్రో విస్తరణ, అమరావతిలో సెంట్రల్ కాంప్లెక్స్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
అసలు ఇలాంటిది ఏమీ జరగలేదని తేల్చారు. సమోసాల వ్యవహారంపై సీఐడీ విచారణ జరుపుతున్నట్లుగా వస్తున్న వార్తలను కొట్టిపారేశారు. సీఐడీ విచారణ చేస్తున్న అంశం వేరు అని చెప్పారు. మీడియాలో మాత్రం సమోసాలపై సీఐడీ విచారణ అంటూ ప్రచారం చేస్తున్నారని సుఖు మండిపడ్డారు.
ఇదే వ్యవహారంపై సీఐడీ అధికారులు కూడా స్పందించింది. ఇదంతా సీఐడీ అంతర్గత వ్యవహారం అని తేల్చారు. దీనిని రాజకీయం చేయొద్దని కోరింది. ముఖ్యమంత్రి సమోసాలు తినరని.. తాము ఎవరికీ నోటీసులు ఇవ్వలేదని… అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకే విచారణకు ఆదేశించినట్లు తెలిపింది. ఈ విషయంతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని సీఐడీ పేర్కొంది. అయినా ఈ సమాచారం ఎలా లీక్ అయిందో కూడా తెలుసుకుంటామని సీఐడీ డీజీ సంజీవ్ రంజన్ స్పష్టం చేశారు.
#WATCH | Mandi: Amid the 'samosa' controversy, Former Himachal Pradesh CM and LoP Jairam Thakur organises a samosa party with BJP workers at the Circuit House in Mandi.
(Source: Jairam Thakur Office) pic.twitter.com/wq1rrm57X0
— ANI (@ANI) November 8, 2024
తాజావార్తలు
-
TMC Crisis: మూడు దశాబ్దాల దీదీ సామ్రాజ్యం నిలువునా కొల్లాప్స్.. టీఎంసీ కూలడానికి ప్రధాన కారణాలు ఇవే..
-
June 2026 Movie Releases: ‘పెద్ది’ తర్వాత థియేటర్లలోకి వచ్చే సినిమాలు ఇవే..
-
Elon Musk: ప్రపంచ చరిత్రలో ఒకే ఒక్కడు.. ఎలాన్ మస్క్కు అడుగు దూరంలో అరుదైన ఘనత!
-
Pawan Kalyan : యాక్టింగ్’కు దూరంగా పవన్?
-
Manav Suthar: ఒక్క టెస్ట్ మ్యాచ్తో ఊహించని ఆఫర్ కొట్టేసిన మానవ్ సుతార్.. ఇక దూకుడే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!