Kiren Rijiju: రాహుల్ గాంధీ పప్పు అని భారతీయులకు తెలుసు.. విదేశీయులకు తెలియదు.. కేంద్రమంత్రి విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kiren Rijiju: దేశ ప్రజలను విభజించేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దేశ ఐక్యతకు అత్యంత ప్రమాదకరమని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు విమర్శించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని, ప్రధాని నరేంద్రమోదీని విమర్శిస్తూ రాహుల్ గాంధీ ఇటీవల లండన్లో చేసిన వ్యాఖ్యలపై రిజిజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘స్వయం ప్రకటిత కాంగ్రెస్ యువరాజు అన్ని పరిమితులను దాటారు. భారత ప్రజలకు రాహుల్ గాంధీ ‘‘పప్పు’’ అని తెలుసు, కానీ విదేశీయులకు పప్పు అని తెలియదు. అతని మూర్ఖపు ప్రకటనలపై స్పందించాల్సిన అవసరం లేదు. కానీ సమస్య ఏంటంటే అతడు భారతదేశ వ్యతిరేఖ ప్రకటనలతో, భారత ప్రతిష్ట దెబ్బతీసేలా, భారత వ్యతిరేఖ శక్తులను వినియోగిస్తున్నారు’’ అంటూ ట్వీట్ చేశారు.
Read Also: Tragedy: ఆడపిల్లగా పుట్టడమే తాను చేసిన నేరమా.. అప్పుడు వేధింపులు.. ఇప్పుడు దాడులు
Also Read
- RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
- Abhijeet Dipke: సోనమ్వాంగ్చుక్ దీక్ష భగ్నం వేళ అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం..
- EPFO గుడ్ న్యూస్.. PF ఖాతాల్లో వడ్డీ జమ.. మీ ఖాతాలో పడిందా? వెంటనే చెక్ చేసుకోండి
- Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ప్రసంగించిన రాహుల్ గాంధీ.. బీజేపీ ప్రజాస్వామ్య సంస్థలను నాశనం చేసిందని విమర్శించారు. దీంతో పాటు పార్లమెంట్ లో తరుచుగా మైకులు స్విచ్ ఆఫ్ అవుతాయని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఈ వ్యాఖ్యలపై కూడా రిజిజు తీవ్రంగానే స్పందించారు. రాహుల్ గాంధీతో పాటు మరికొంత మంది నేతలు తెల్లవారినప్పటి నుంచి రాత్రి వరకు ప్రభుత్వాన్ని , ప్రధాని మోదీని తిడుతూనే ఉంటారని ఆరోపించారు. రాహుల్ వ్యాఖ్యలపై రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ కూడా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్దారు. ఆయన వ్యాఖ్యలు పూర్తిగా అబద్దహని, నిరాధారమని అన్నారు.
పార్లమెంట్ లో ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని, ఇందులో భాగంగానే బీబీసీ కార్యాలయాలపై దాడులు చేశారని భారతదేశం ప్రశ్నించకుండా ఉండాలని బీజేపీ కోరుకుంటోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. భావవ్యక్తీకరణ, ప్రశ్నించేందుకే యాత్ర చేశానని ఆయన అన్నారు. బీబీసీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాయడం మానేస్తే అన్ని కేసులు మాయమవుతాయని అన్నారు. భారతదేశంలో దళితులు, అట్టడుగు కులాలు, ఆదివాసీలు, మీడియా గొంతు ఎత్తవద్దని బీజేపీ కోరుకుంటోందని, దేశంలోని సంపదను ఇద్దరు, ముగ్గురు వ్యక్తలకే అప్పగిస్తున్నారంటూ రాహుల్ గాంధీ ఆరోపించారు.
తాజావార్తలు
-
Mahesh Babu-Varanasi: రెడీ అయిపోండమ్మా.. బాబు బర్త్డేకు భారీ సర్ప్రైజ్?
-
The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన ‘ది ప్యారడైజ్’ నైజాం రైట్స్.!
-
Oppo K15: ఒప్పో K15 త్వరలో లాంచ్.. Dimensity 7360 ప్రాసెసర్, 8,000mAh బ్యాటరీ
-
Namitha: గుర్తుపట్టలేనంతగా మారిన నమిత.. వైరల్ వీడియో చూసి షాక్ అవుతున్న అభిమానులు!
-
RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?