Kapil Sibal: “వచ్చే 5 ఏళ్లు…” కర్ణాటక విజయం తర్వాత కాంగ్రెస్కు సిబల్ సందేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kapil Sibal: కర్ణాటక అసెంబ్లీలో ఘన విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఇతర ఎన్డీయేతర ప్రతిపక్షాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా రాజ్యసభ ఎంపీ, మాజీ కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ సందేశం ఇచ్చారు. వచ్చే 5 ఏళ్లలో ప్రజల మనుసులు గెలుచుకోవాలని కాంగ్రెస్ కు సూచించారు. ఎన్నికల్లో గెలవడం కష్టం.. ప్రజల హృదయాలను గెలుచుకోవడం చాలాచాలా కష్టం అంటూ.. కర్నాటకలో రాబోయే ఐదేళ్లపాటు బహిరంగంగా, నిజాయితీగా, వివక్ష చూపకుండా ప్రజల హృదయాలను గెలుకుకోవాలని సూచించారు.
Also Read
- Mothers Day Special: మాతృత్వానికి ప్రణామం.. సృష్టికి ప్రతిరూపం.. సహనానికి నిలువుటద్దం "అమ్మ"
- Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ
- PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్పై మోడీ ట్వీట్
- Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం
అంతకుముందు బీజేపీ ఓటమిని గురించి ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. ప్రధాన మంత్రి ఓడిపోయారు, కర్ణాటక ప్రజలు గెలిచారు. 40 శాతం కమీషన్లకు, ది కేరళ స్టోరికి, విభజన రాజకీయాలకు, అహంకారం, అబద్ధాలకు నో చెప్పారు. ఇదే కాంగ్రెస్ గెలవడానికి కారణమయ్యాయని ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు. యూపీఏ1, 2లో కేంద్ర మంత్రిగా పనిచేసిన కపిల్ సిబల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, సమాజ్ వాదీ పార్టీ మద్దతుతో స్వతంత్ర సభ్యుడిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడే లక్ష్యంతో ఆయన ఇటీవల ఎన్నికలేతర వేదిక ‘ఇన్సాఫ్’ను ప్రారంభించారు.
కర్ణాటక ఎన్నికల్లో 224 స్థానాలకు గానూ కాంగ్రెస్ 135 స్థానాల్లో గెలిచింది. బీజేపీ 65 స్థానాలకు, జేడీఎస్ 19 స్థానాలకు పరిమితం అయ్యాయి. దక్షిణాదిలో బీజేపీకి ఏకైక కంచుకోటగా ఉన్న కర్ణాటకను ఆ పార్టీ కోల్పోయింది. 2024 ఎన్నికల ముందు ఈ గెలుపు కాంగ్రెస్ పార్టీకి నైతికంగా బలాన్ని ఇస్తుంది.
తాజావార్తలు
-
Mothers Day Special: మాతృత్వానికి ప్రణామం.. సృష్టికి ప్రతిరూపం.. సహనానికి నిలువుటద్దం “అమ్మ”
-
GT vs RR : గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం.. పాయింట్ల పట్టికలో టాప్కు..!
-
Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ
-
Suriya: సూర్య ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ అప్పుడే!
-
PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్పై మోడీ ట్వీట్