Karnataka: లక్ష అప్పు.. ముగ్గురు పిల్లలతో సహా భార్యభర్తల ఆత్మహత్య.. రెండు పేజీల సూసైడ్ నోట్
Karnataka Family Suicide: కర్ణాణకలో దారుణం చోటు చేసుకుంది. రూ. 1.5 లక్షల అప్పు ఓ కుటుంబాన్ని బలిగొంది. తీసుకున్న అప్పుకు వడ్డీ కట్టలేక.. అప్పులవారి వేధింపుల భరించలేక ఓ వ్యక్తి తన భార్య, ముగ్గురు పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తుమకూరు జిల్లా సదాశివ నగర్లో చోటు చేసుకుంది. ఆత్మహత్యకు ముందు మఈతుడు రెండు పేజీల సూసైడ్ నోట్, బంధువులకు ఓ సెల్పీ వీడియో పంపినట్టు తెలుస్తోంది. దాని ఆధారంగా ధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వివరాలు.. గరీబ్ సాబ్ (36) అనే వ్యక్తి తన భార్య సుమయ్య (33), వారి కుమార్తె హజీరా (14), కుమారులు మహ్మద్ సుభాన్ (10), మహ్మద్ మునీర్లతో (8) కలిసి తుమకూరు జిల్లా సదాశివనగర్లోని ఓ అపార్టుమెంటులో నివసిస్తున్నాడు. కబాబ్ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వ్యాపారంలో నష్టం రావడంతో అప్పుల పాలయ్యాడు. అదే అపార్టుమెంట్లో గ్రౌండ్ ఫ్లోరలో నివసించే కలందర్ వద్ద రూ. 1.5 లక్ష అధిక వడ్డికి అప్పు తీసుకున్నాడు. అయితే ఆర్థిక ఇబ్బందుల వల్ల గరిబ్ వడ్డీ కట్టలేని పరిస్థితిలో ఉన్నాడు.
Also Read
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
- Viral: ‘మీసాల పిల్ల’ అంటూ ఎగతాళి చేశారు.. కట్ చేస్తే ప్రశంసల హోరు..
- Padma Awards 2027: దేశ అత్యున్నత పౌర పురస్కారాలు.. నేడే నామినేట్ చేసుకోండి.. పూర్తి వివరాలివే!
Also Read: Kishan Reddy: బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అంటే వాళ్ళను చెప్పుతో కొట్టండి.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
అప్పు తీర్చమంటూ, వడ్డీ కట్టాలంటూ తరచూ కలందర్ తన కుటుంబాన్ని వేధించేవాడని గరిబ్ సూసైడ్ నోట్లో తెలిపాడు. తన భార్యతో అసభ్యంగా మాట్లాడుతూ తన పిల్లలని కొట్టేవాడని పేర్కొన్నాడు. అంతేకాదు ఇరుకుపొరుగు వారు కూడా తమని నీచంగా చూసేవారని, అది భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్టు వెల్లడించాడు. అంతేకాదు తమని మానసికంగా వేధించిన కలందర్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గరిబ్ తన వీడియోలో పోలీసులను కోరాడు. అలాగే తన నానమ్మకు పంపిన వీడియోలో కష్టకాలంలో తమకు డబ్బులు ఇచ్చి ఆదుకున్న బంధువులు, స్నేహితులకు కృతజ్ఞతలు తెలిపాడు.
Also Read: MLC Kavitha: రైతు బంధు ఆపింది కాంగ్రెస్సే.. రైతు వ్యతిరేక పార్టీగా రుజువు చేసుకున్నారు
తన ఇంటి సమాన్లు, ఇతర వస్తువులు అమ్మి తన అప్పులు తీర్చాల్సిందిగా గరిబ్ తన నానమ్మకు తెలిపాడు. ఈ ఘటనపై ఎస్పీ అశోక్ వెంకట్ మాట్లాడుతూ.. అప్పుల బాధ వల్లే గరిబ్ తన కుటుంబంతో ఆత్మహత్య పాల్పడ్డాడని వెల్లడించారు. మొదటి గరిబ్ తన ముగ్గురు పిల్లల గొంతునులిమి చంపాడని, ఆ తర్వాత భార్యతో పాటు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు వెల్లడించారు. సూసైడ్ నోట్, సెల్పీ వీడియో ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు.
తాజావార్తలు
-
DC Vs RCB: హమ్మయ్య.. ‘49’ తప్పించుకున్నాం.. ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాపీ..
-
Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??
-
Yatra: హీరోగా రజనీకాంత్ మనవడు.. కొడుకు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై ధనుష్ క్లారిటీ ఇదే!
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
DC Vs RCB: రెండు చెత్త రికార్డులను మూట కట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. ఆర్సీబీ సంచలనం..
ట్రెండింగ్
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!