Karnataka: లక్ష అప్పు.. ముగ్గురు పిల్లలతో సహా భార్యభర్తల ఆత్మహత్య.. రెండు పేజీల సూసైడ్ నోట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka Family Suicide: కర్ణాణకలో దారుణం చోటు చేసుకుంది. రూ. 1.5 లక్షల అప్పు ఓ కుటుంబాన్ని బలిగొంది. తీసుకున్న అప్పుకు వడ్డీ కట్టలేక.. అప్పులవారి వేధింపుల భరించలేక ఓ వ్యక్తి తన భార్య, ముగ్గురు పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తుమకూరు జిల్లా సదాశివ నగర్లో చోటు చేసుకుంది. ఆత్మహత్యకు ముందు మఈతుడు రెండు పేజీల సూసైడ్ నోట్, బంధువులకు ఓ సెల్పీ వీడియో పంపినట్టు తెలుస్తోంది. దాని ఆధారంగా ధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వివరాలు.. గరీబ్ సాబ్ (36) అనే వ్యక్తి తన భార్య సుమయ్య (33), వారి కుమార్తె హజీరా (14), కుమారులు మహ్మద్ సుభాన్ (10), మహ్మద్ మునీర్లతో (8) కలిసి తుమకూరు జిల్లా సదాశివనగర్లోని ఓ అపార్టుమెంటులో నివసిస్తున్నాడు. కబాబ్ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వ్యాపారంలో నష్టం రావడంతో అప్పుల పాలయ్యాడు. అదే అపార్టుమెంట్లో గ్రౌండ్ ఫ్లోరలో నివసించే కలందర్ వద్ద రూ. 1.5 లక్ష అధిక వడ్డికి అప్పు తీసుకున్నాడు. అయితే ఆర్థిక ఇబ్బందుల వల్ల గరిబ్ వడ్డీ కట్టలేని పరిస్థితిలో ఉన్నాడు.
Also Read
- Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
- West Bengal: అక్రమ బంగ్లాదేశీయుల బహిష్కరణ.. బెంగాల్లో సీఏఏ స్టార్ట్..
- Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
- Congress: డీఎంకే వల్ల కాలేదు, 59 ఏళ్ల కాంగ్రెస్ కోరిక తీర్చిన విజయ్..
Also Read: Kishan Reddy: బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అంటే వాళ్ళను చెప్పుతో కొట్టండి.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
అప్పు తీర్చమంటూ, వడ్డీ కట్టాలంటూ తరచూ కలందర్ తన కుటుంబాన్ని వేధించేవాడని గరిబ్ సూసైడ్ నోట్లో తెలిపాడు. తన భార్యతో అసభ్యంగా మాట్లాడుతూ తన పిల్లలని కొట్టేవాడని పేర్కొన్నాడు. అంతేకాదు ఇరుకుపొరుగు వారు కూడా తమని నీచంగా చూసేవారని, అది భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్టు వెల్లడించాడు. అంతేకాదు తమని మానసికంగా వేధించిన కలందర్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గరిబ్ తన వీడియోలో పోలీసులను కోరాడు. అలాగే తన నానమ్మకు పంపిన వీడియోలో కష్టకాలంలో తమకు డబ్బులు ఇచ్చి ఆదుకున్న బంధువులు, స్నేహితులకు కృతజ్ఞతలు తెలిపాడు.
Also Read: MLC Kavitha: రైతు బంధు ఆపింది కాంగ్రెస్సే.. రైతు వ్యతిరేక పార్టీగా రుజువు చేసుకున్నారు
తన ఇంటి సమాన్లు, ఇతర వస్తువులు అమ్మి తన అప్పులు తీర్చాల్సిందిగా గరిబ్ తన నానమ్మకు తెలిపాడు. ఈ ఘటనపై ఎస్పీ అశోక్ వెంకట్ మాట్లాడుతూ.. అప్పుల బాధ వల్లే గరిబ్ తన కుటుంబంతో ఆత్మహత్య పాల్పడ్డాడని వెల్లడించారు. మొదటి గరిబ్ తన ముగ్గురు పిల్లల గొంతునులిమి చంపాడని, ఆ తర్వాత భార్యతో పాటు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు వెల్లడించారు. సూసైడ్ నోట్, సెల్పీ వీడియో ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!