Sanatan Dharma remark: ఉదయనిధి స్టాలిన్, ప్రియాంక్ ఖర్గేలపై ఎఫ్ఐఆర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanatan Dharma remark: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ ‘సనాతన ధర్మం’పై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారాన్ని రేపుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ, డీఎంకే పార్టీపై విరుచుకుపడుతోంది. ఉదయనిధి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తుంది. ఇండియా కూటమిలో భాగస్వామిగా డీఎంకే పార్టీ ఉండటంతో, హిందూమతాన్ని ఇండియా కూటమి ద్వేషిస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ వ్యాఖ్యలపై ఇండియా కూటమి సైలెంట్ గా ఉంది. కాంగ్రెస్ అన్ని మతాలను గౌరవించాలని వ్యాఖ్యానించింది.
ఇదిలా ఉంటే ఉదయనిధి చేసిన వ్యాఖ్యలపై పలు ప్రాంతాల్లో ఫిర్యాదులు చేస్తున్నారు. తాజాగా ఉదయనిధి స్టాలిన్ పై, అతని వ్యాఖ్యలకు మద్దతు తెలిపిన కర్ణాటక మంత్రి, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గేలపై ఎఫ్ఐఆర్ నమోదైంది. వీరి వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపిస్తూ న్యాయవాదుల ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదైంది.
Also Read
- Tamil Nadu Budget 2026: జెన్-జెడ్ విద్యార్థులపై ప్రభుత్వం వరాల జల్లు.. గోల్డ్ కాయిన్స్, పట్టు చీరలు, సైకిళ్ల పంపిణీ..!
- PM Modi: "మార్క్ జుకర్బర్గ్ ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే..." మెటా సీఈఓకు పార్లమెంటరీ ప్యానెల్ అల్టిమేటం?
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
- Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
Read Also: Arun Kumar Sinha: SPG చీఫ్, పీఎం సెక్యూరిటీ గ్రూప్ అధికారి అరుణ్ కుమార్ సిన్హా మరణం
మంగళవారం ఉత్తరప్రదేశ్లోని రాంపూర్లోని సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్లో ఇద్దరిపై IPC సెక్షన్లు 295 A (ఉద్దేశపూర్వకంగా మరియు ద్వేషపూరిత చర్యలు) మరియు 153 A (వివిధ మత సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం) కింద కేసు నమోదు చేశారు. న్యాయవాదులు హర్ష్ గుప్తా, రామ్ సింగ్ లోధి ఫిర్యాదు మేరకు ఇద్దరిపై ఎప్ఐఆర్ బుక్ చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు.
చెన్నైలో జరిగిన రచయితల సమావేశంలో మాట్లాడుతూ ఉదయనిధి సనాతన ధర్మపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం డెంగీ, మలేరియా వంటిదని దీన్ని నిర్మూలించాలని అన్నారు. దేశవ్యాప్తంగా ఈ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లవెత్తాయి. అయితే తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారంటూ ఉదయనిధి సంజాయిషీ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు.
తాజావార్తలు
-
Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
-
SpaceX Rocket Moon Crash: గంటకు 8,690 కి.మీ వేగంతో.. చంద్రుడిని ఢీకొట్టనున్న SpaceX రాకెట్..!
-
Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
-
Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
ట్రెండింగ్
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!